మూడు రోజుల నుంచి, తన కుమార్తె పెళ్లి సందడిలో సరదాగా గడిపిన మంత్రి పరిటాల సునీత, అనుకోని సంఘటనతో కుప్పకూలిపోయారు. దివంగతన నేత పరిటాల రవి ప్రధాన అనుచరుడు చమన్ సాబ్ హఠాన్మరణం చెందడంతో మంత్రి పరిటాల సునీత ఆసుపత్రిలోనే కళ్లుతిరిగి స్పృహతప్పి పడిపోయారు. పరిటాల రవి కుమార్తె స్నేహలత వివాహ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్న చమన్‌కు సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో వెంటనే అనంతపురంలోని సవేరా ఆసుపత్రికి తరలించారు. కుమారుడు శ్రీరామ్‌తో కలిసి ఆసుపత్రికి చేరుకున్న మంత్రి సునీత చమన్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు.

suneeta 07052018 2

అయితే వైద్యులు చికిత్స అందిస్తుండగానే చమన్ ఆకస్మికంగా మృతి చెందారు. చమన్ మృతి చెందారనే విషయం తెలియగానే అక్కడే ఉన్న సునీత ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కుమారుడు శ్రీరామ్ ఓదారుస్తుండగానే సునీత స్పృహతప్పి పడిపోయారు. వెంటనే శ్రీరామ్‌తో పాటు అక్కడున్నవాళ్లు పైకి లేపి ఆసుపత్రి బెడ్‌పై పడుకోబెట్టారు. అనంతరం వైద్యులు ఆమె ఆరోగ్యపరిస్థితిని పరిశీలించి, చికిత్స అందిస్తున్నారు. పరిటాల రవీంద్ర కుమార్తె పరిటాల స్నేహలత వివాహ వేడుక కోసం పర్యవేక్షణ కోసం మూడు రోజులుగా వెంకటాపురంలోనే ఉన్న చమన్‌కు సోమవారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. మంత్రి పరిటాల సునీత వెంటనే చమన్‌ను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ చమన్ మృతి చెందారు.

suneeta 07052018 3

పరిటాల రవికి ఎంతో సన్నిహితుడైన చమన్‌ 2014 నుంచి 2017 మే వరకు అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్‌గా పని చేశారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి ఫ్యాక్షన్ హత్యల నేపథ్యంలో చమన్ దాదాపు ఎనిమిది సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నారు. 2012 సంవత్సరంలో అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం... పరిటాల సునీత మంత్రి అవడంతో.. అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రామగిరి మండలం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున చమన్ జడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం రెండున్నర సంవత్సరాల తరువాత తన పదవికీ రాజీనామా చేశారు.

మహిళలు, బాలికలపై పెరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ పేరుతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చైతన్య ర్యాలీలు నిర్వహించనుంది. ఇటీవల గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో ఈ తరహా ఘటనలు ఇకపై రాష్ట్రంలో ఎక్కడా జరగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ర్యాలీలకు శ్రీకారం చుట్టింది. వీటిని నిర్వహించే బాధ్యతను అన్ని జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది. ఈ విషయం తెలుసుకున్న, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి చంద్రబాబుకి ఫోన్ చేసారు. చంద్రబాబును నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాష్‌ సత్యార్థి కొనియాడారు.

kailash 07052018

'ఆడబిడ్డకు రక్షణగా కదులుదాం' కార్యక్రమం చేపట్టడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నట్టు సత్యార్థి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల కార్యకర్తలు పాల్గొంటారని, తాను కూడా హాజరవుతానని సీఎంకు సత్యార్థి తెలిపారు.. కైలాష్ సత్యార్థి ఫోన్ చేసినందుకు, చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గుని, ఇలాంటి ఘటనలు జరగకుండా ఏమి చెయ్యాలి, సమాజం బాధ్యత, తల్లి దండ్రులు తీసుకోవాల్సిన బాధ్యతల పై, ప్రసంగించాలని, సలహాలు ఇవ్వాలని చంద్రబాబు కోరారు.

kailash 07052018

విజయవాడలో సోమవారం నిర్వహించే భారీ ర్యాలీ, బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ర్యాలీని ప్రారంభించి, రెండు కిలోమీటర్లు ప్రదర్శనలో భాగంగా ముఖ్యమంత్రి నడుస్తూ ఇందిరాగాంధీ క్రీడా మైదానం వద్దకు వస్తారు. అదే సమయంలో నగరంలోని నాలుగు ప్రధాన ప్రాంతాల నుంచి ర్యాలీలుగా బయలుదేరి స్టేడియం వద్దకు చేరుకుంటాయి. ‘ఆడబిడ్డల రక్షణకు కదులుదాం’ అంటూ సభలో ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేయిస్తారు. సభ, ర్యాలీ ఏర్పాట్లను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోమవారం రాత్రి పరిశీలించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీకి ఘాటు లేఖ రాశారు. పదిహేనో ఆర్థిక సంఘం విధివిధానాల్లో పేర్కొన్న ‘జనాకర్షక పథకాలపై సమీక్ష’ అనే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. అందులో చంద్రబాబు పలు అంశాలను ప్రస్తావించారు. ‘‘అన్నదాతలను ఆదుకోవడానికి అమలు చేస్తున్న ఉచిత విద్యుత్తు పథకాన్ని దెబ్బ తీసే ప్రయత్నం జరుగుతోంది. విద్యుత్తు చట్టం - 2003కు సవరణ ప్రతిపాదించడం అభ్యంతరకరం. ఇది రాష్ట్రాలు ఉచిత విద్యత్తు ఇవ్వకుండా కేంద్రం ఒత్తిడి చేసేలా ఉంది. విద్యుత్తు చట్టానికి సవరణ చేయాలనే ప్రతిపాదనను విరమించుకోవాలి. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయించే విధానం రైతుకు మేలు చేసేలా ఉండాలి.

cbn letter 07052018

ఏపీలో వరి సాగు ఖర్చు హెక్టారుకు 1.08 లక్షలు అవుతోంది. క్వింటాలుకు రూ. 1,702 సాగు ఖర్చవుతోంది. సాగు రూపాయి ఖర్చవుతుంటే మద్దతు ధర 83 పైసలుగా ఉంది. వరితోపాటు అన్ని పంటలకు మద్దతు ధర నిర్ణయించాలి. పంటల బీమా నిబంధనల్లో పలు మార్పులు అవసరం. బ్యాంకులు విధించిన నిబంధనలతో అనేక ఇబ్బందులు వస్తున్నాయి’’ అని సీఎం లేఖలో వివరించారు. వరితో పాటు అన్ని పంటలకు మద్దతు ధర నిర్ణయించాలని సూచించారు. పంటల భీమా నిబంధనల్లో పలు మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. బ్యాంకులకు విధించిన నిబంధనతో అనేక ఇబ్బందులు వస్తున్నాయన్నారు. రుణాల వివరాలను జాతీయ పంట బీమా పోర్టల్‌లో నమోదు చేయాలన్న నిబంధనతో ఇబ్బందులు వస్తున్నాయన్నారు.

cbn letter 07052018

‘‘15వ ఆర్థిక సంఘానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టర్మ్స్‌ ఆఫ్‌ రెఫరెన్స్‌లోని నాలుగో సూచనలో... జనాకర్షక పథకాలపై రాష్ట్రాలు చేసే ఖర్చును నియంత్రించేలా ఒక అంశం పెట్టారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరాను కూడా జనాకర్షక పథకంగా చూపించి... దీనిని అమలు చేసే రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో కోత విధించేలా ఈ నిబంధన ఉంది. ఇది రైతుల సంక్షేమాన్ని దెబ్బతీస్తుంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘విద్యుత్‌ అం శం కేంద్ర - రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉంది. దానిపై రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్రం ఏకపక్షంగా సవరణ ప్రతిపాదనలు తేవాలని ఆలోచించడం సరికాదు. ఏపీలో 50శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. ఉచిత విద్యుత్‌ను నిలిపివేయడమంటే... వారికి అన్యాయం చేయడమే’’ అని సీఎం పేర్కొన్నారు.

దేశ రాజకీయాలు నేను మార్చేస్తున్నా, మోడీ లేదు, సోనియా లేదు, కాంగ్రెస్, బీజేపీ దేశాన్ని నాశనం చేసాయి, నేనే ఢిల్లీని ఏలుతా అంటూ, నాకు మాయావతి ఫోన్ చేసింది, ఇంకా ఎవరో ఫోన్ చేసారంటూ హడావిడి చేసిన తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మాటలు గుర్తుండే ఉంటాయి... అప్పట్లో, చూసారా కెసిఆర్ ఎలా పోరాడుతున్నారో, చంద్రబాబుకి ధైర్యం లేదు అంటూ ఇక్కడ కొంత మంది హడావిడి చేసారు.. పవన్ కళ్యాణ్ లాంటి నేతలు అయితే, ట్విట్టర్ లో, హాట్స్ ఆఫ్ చెప్పారు... ఇక హోదా పై మద్దతు తెలిపారని, కవితను చెల్లలు అంటూ, ట్వీట్ చేసారు పవన్... ఇది ఇలా ఉండగా, దక్షిణాది రాష్ట్రాలతో పాటు, మరి కొన్ని ఉత్తరాది రాష్ట్రాలను నిర్వీర్యం చేసే విధంగా, 15వ ఆర్థిక సంఘం విధి విధానాలు ఉండటంతో, ఈ రాష్ట్రాలన్నీ కేంద్రం పై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యాయి...

amaravati 07052018

ఈ నేపధ్యంలో మొదటి సమావేశం కేరళలో జరిగింది, రెండో సమావేశం ఈ రోజు అమరావతిలో జరుగుతుంది. వివిధ రాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో కేంద్రానికి వ్యతిరేకంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.. దక్షిణాది నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి అధిక ఆదాయం వస్తున్నా… నిధుల విడుదలలో వివక్ష చూపిస్తున్నారని దక్షిణాది రాష్ట్రాలు ఎప్పటి నుంచో విమర్శలు గుప్పిస్తున్నాయి.. అయితే, ఇలాంటి కీలక సమావేశానికి, కెసిఆర్ మాత్రం ఎవరినీ పంపలేదు.. పోయినసారి, తిరువనంతపురంలో జరిగే సమావేశానికి రావటం కుదరదు అని, చాలా బిజీగా ఉన్నాం అంటూ, కబురు పంపించింది తెలంగాణా...

amaravati 07052018

అయితే ఈ రోజు అమరావతిలో జరిగే సమావేశానికి తెలంగాణా నుంచి ఎవరూ రాలేదు. నేటి ఆర్థికమంత్రుల సమావేశానికి తాను హాజరుకావడం లేదని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. దీనిపై వివరణ అడగ్గా.. స్పందించడానికి ఆయన ఇష్ట పడలేదు. ఎందుకు రావటం లేదో సరైన కారణం చెప్పటం లేదు... ఈ నిర్ణయంతో, వీరు మోడీ తొత్తులు అనేది మరోసారి స్పష్టం అయ్యింది... మొన్న పార్లమెంట్ సమావేశాలు అప్పుడు కూడా, అన్నడీయంకే, తెరాస పార్టీలే గోల చేసి, అవిశ్వాస తీర్మానం రాకుండా అడ్డు పడ్డాయి... చివరి వారం రోజులు తెరాస ఎంపీలు వెనక్కు తగ్గారు... కాని అన్నడీయంకే కొనసాగించింది... దేశంలో అన్ని పార్టీలు, ఈ రెండు పార్టీల చేత, బీజేపీనే గోల చేస్తుంది అని విమర్శలు కూడా చేసాయి... ఈ రోజు, అన్ని దక్షినాది రాష్ట్రాలు సమావేశం అయ్యి, కేంద్రం పై ఒత్తిడి తెస్తుంటే, తెలంగాణ, డుమ్మా కొట్టింది... దీంతో, పూర్తి క్లారిటీ వచ్చేసింది...

Advertisements

Latest Articles

Most Read