పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ‘‘మొన్నటి వరకు మనతో కలిసి ఉన్న పవన్‌ కల్యాణ్‌ మనల్ని విమర్శిస్తున్నారు. కేంద్రం ఎన్ని విధాలా ఆడించాలో అన్ని విధాలా ఆడిస్తోంది. మనల్ని ఇబ్బందులు పెడతారు, సమస్యలు సృష్టిస్తారు. ఐదు కోట్ల మంది ఐక్యతగా ఉంటే.. కేంద్రం ఆటలు సాగవు. 29 సార్లు దిల్లీకి వెళ్లా, ఎప్పుడూ రాజీ పడలేదు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇందిరాగాంధీ నుంచి రాజశేఖర్‌రెడ్డి వరకూ నన్నేమీ చేయలేకపోయారు. నిజాయితీగా ఉన్నందునే నన్నేమీ చేయలేకపోయారు. నేనెవరికీ భయపడను.. తప్పు చేసిన వారెవ్వరినీ వదలను అంటూ పదునైన విమర్శలు చేసారు...

cbn modi 24042018

రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత భాజపాకు లేదా? నేనేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలే అమలు చేయాలని కోరుతున్నా. ఈనెల 30న తిరుపతిలో సభ నిర్వహిస్తున్నాం’’ అని సీఎం వివరించారు. కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలవల్లే బ్యాంకుల్లో కుంభకోణాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేసిన వ్యక్తులను పీఎంవోలో పెట్టుకుంటూ... ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రధాని మోదీని ప్రశ్నించారు. మోదీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రక్షణ లేదని, దానికి కేంద్రప్రభుత్వమే కారణమని ఆరోపించారు.

cbn modi 24042018

బ్యాంకులు దివాళా తీస్తున్నాయని, బ్యాంకుల్లో తప్పు చేసినవారిని కఠినంగా శిక్షించలేకపోయారని చంద్రబాబు విమర్శించారు. అదే ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా తప్పు చేయాలంటే గజగజలాడే పరిస్థితి వస్తుందని, తప్పు చేసేవారిని వదిలిపెట్టనని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఆడబిడ్డలకు భద్రత లేదని, జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఘోరం చూస్తే... ఆడబిడ్డలు ఏ విధంగా ఈ ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకుంటారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఏడాదిలోపల మొత్తం జప్తు చేస్తామని అన్నారని, అవినీతిని ప్రక్షాళన చేస్తామని అన్నారని, అలాంటి అవినీతిపరులను పక్కన పెట్టుకుని, ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని మోదీపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆడుకోవాలని అనుకుంటోందని, వేరే రాష్ట్రాల్లో కేంద్రం ఆటలు సాగాయి గానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రం ఆటలు సాగవని ఆయన అన్నారు.

పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ట్వీట్ల చేస్తూ, చంద్రబాబు పై చేస్తున్న చౌకబారు ఆరోపణలు పై, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఏప్రిల్ 20వ తేదీన సిఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష ప్రారంభం రోజు నుంచే పవన్ కళ్యాణ్ ట్వీట్లు ప్రారంభం కాగా, ఆ వ్యవహారంపై పరోక్షంగానే తప్ప నేరుగా స్పందించని చంద్రబాబు మంగళవారం డైరెక్టుగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించే మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లా ద్వారపూడిలో జరిగిన సభలో మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై స్పందించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టీడీపీ ఎన్నడూ విమర్శించలేదని... ఎదుటివారి మీద బురద చల్లే అలవాటు తెలుగుదేశం పార్టీకి లేదని సిఎం చంద్రబాబు అన్నారు. మొన్నటిదాకా మనతోనే ఉన్న ఆయన ఇప్పుడు మనల్నే విమర్శిస్తున్నారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎప్పుడూ ఎవరిపైనా విమర్శలు చేయలేదని...కేవలం సమస్యలపైనే పోరాడానని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.

cbn pk tweets 24042018 1

పవన్‌ కల్యాన్ వ్యాఖ్యలు తనను చాలా బాధించాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నిరాధార ఆరోపణలతో ఆయన సాధించేదేమీ లేదని అభిప్రాయపడ్డారు. వైసీపీని బీజేపీ రెచ్చగొడుతోందన్నారు. కేంద్రం అందరినీ ఆడిస్తోందని, ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఆటలు సాగినా... ఏపీలో సాగబోవని బాబు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు గెలిచి.. ప్రధానిని నిర్ణయించే స్థాయికి ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో గవర్నర్ రాజకీయ వ్యవహారాలు నెరుపుతున్నారంటూ ఆరోపించారు. వివిధ పార్టీలను గవర్నరే కలుపుతున్నారని వార్తలు వస్తున్నాయని, గవర్నర్ ఇలా వ్యవహరించడం సరికాదన్నారు.

cbn pk tweets 24042018 1

ఇదిలా ఉండగా పవన్ ట్వీట్ లపై పార్టీ నేతలెవరూ స్పందించవద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిరసిస్తూ చంద్రబాబు ఒక్కరే గట్టిగా పోరాటాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తే చంద్రబాబు నాయుడు చేపట్టే నిరసనలు పక్క దారిపడుతుందని... ఇలాంటి టైంలో ఈ తరహా రాజకీయాలకు తెరలేపడం కుట్రలో భాగమేనని టీడీపీ అధిష్టానం అభిప్రాయపడింది. శ్రీరెడ్డి ఎపిసోడ్‌ను రాజకీయాలకు ఆపాదించడంలోనే అతిపెద్ద రాజకీయ కుట్ర ఉందని.. ఒక వేళ టీడీపీ నేతలు పవన్‌పై విమర్శలు చేస్తూ రంగంలోకి దిగితే చంద్రబాబు చేపట్టే నిరసనలు పక్కదారి పడతాయని, అప్పుడు బీజేపీ, పవన్, జగన్ ఏదైతే ఆశిస్తున్నారో అది సక్సెస్ అవుతుందని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి... ఇవి పెద్దవి అయితే, కులాల గొడవలుగా కూడా మారతాయని, అందుకే పవన్ చేస్తున్న ట్వీట్ లకు స్పందించవద్దు అని చెప్పారు.. పవన్ చేసే ట్వీట్ లు కూడా, మరీ దిగజారి ఉంటున్నాయని, ఇలాంటివి రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదని, ప్రజలే అలాంటి వారికి బుద్ధి చెప్తారని, తెలుగుదేశం భావిస్తుంది..

ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల తూర్పు తీరంలో అలలు ఉవ్వెత్తున్న ఎగిసిపడే ప్రమాదం ఉందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కాయిస్) హెచ్చరించింది. ఏప్రిల్ 24- 26 మధ్య సముద్రంలో భారీగా అలలు ఎగసి పడే సూచనలు ఉన్నాయని స్పష్టం చేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్‌బంగా తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారిందని ఇన్‌కాయిస్ హెచ్చరికలు జారీ చేసింది. అండమాన్ నుంచి భారత ప్రధాన భూభాగం తీరం వైపునకు ప్రచండ అలలు దూసుకువస్తున్నాయని వెల్లడించింది. అలల ఎత్తు దాదాపుగా 2 నుంచి 3 మీటర్ల ఎత్తున ఉండే అవకాశముందని పేర్కొంది. ఇవి తీరానికి చేరువయ్యే సమయంలో మరింత ఉద్ధృతంగా ఉంటాయని తెలియజేసింది. బలమైన అలలు హఠాత్తుగా ఎగసిపడతాయని, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

climate 24042018 2

ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో అలల ఉధృతికి అవకాశం ఉందని ఇన్కాయిస్ సంస్థ తెలిపింది. వచ్చే నాలుగు రోజుల్లో విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సముద్రపు అలలు ఉధృతంగా ఉంటాయని, మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికరలు జారీ చేశారు. ఇప్పటికే విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది.. విజయనగరం జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు... తూర్పుగోదావరి జిల్లాలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది.. తీరానికి దగ్గరగా నివసించే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్‌కాయిస్ తెలిపింది.

climate 24042018 3

అంతేకాదు ఈ రెండు రోజులూ సముద్ర స్నానాలు నిలిపివేసేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ యంత్రాంగానికి హెచ్చరికలతో కూడిన సూచనలు చేసింది. సముద్రం అల్లకల్లోలంగా మారినందున మత్స్యకారులు సైతం వేటకు వెళ్లకుండా నిరోధించాలని స్పష్టం చేసింది. సముద్ర ఉపరితలం నుంచి గాలులు 45- 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు ఒడిశా, పశ్చిమ్‌బెంగాల్‌‌పై ఈ అలల ఉధృతి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఆఫ్రికా తీరంలో ప్రచండ గాలుల ప్రభావంతో సముద్రంలో భారీ అలలు ఏర్పడి, ఇప్పటికే పశ్చిమ తీరంలోని చాలా ప్రాంతాలను తాకాయని ఇన్ కాయిస్ వెల్లడించింది.

గత నాలుగేళ్లలో, గవర్నర్ ఎంత ఇబ్బంది పెట్టినా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏనాడు ఒక్క మాట కూడా బహిరంగంగా మాట్లాడలేదు... మొన్నటి దాకా తెలంగాణాకు అనుకూలంగా ఉన్నా, కొన్ని రోజుల క్రితం నుంచి కేంద్రంలో బీజేపీతో కలిసి, రాష్ట్రంలో పవన్, జగన్ తో ఆడిస్తున్నారని వార్తలు వస్తున్నా, చంద్రబాబు ఏ నాడు బ్యాలన్సు తప్ప లేదు... గవర్నర్ పై, తెలుగుదేశం పార్టీ నేతలు ఏమన్నా వ్యాఖ్యలు చేసినా, వారిని వారించే వారు... అయితే, ఈ రోజు మాత్రం, చంద్రబాబు ఓపెన్ అప్ అయిపోయారు... రెండు రోజుల క్రితం గవర్నర్, కేంద్రం నుంచి ఎదో రాయబారం తెచ్చారు అనే వార్తలు వచ్చాయి... కర్ణాటక ఎన్నికలు అయ్యే వరకు, మోడీ పై విమర్శల వేడి తగ్గించమని కోరినట్టు తెలిసింది... అయితే చంద్రబాబు కూడా అదే రీతిలో స్పందించినట్టు సమాచారం...

cbn governer 24042018 2


అయితే ఈ రోజు, పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలను గవర్నరే కలుపుతున్నారన్న వార్తలు పేపర్లలో వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఓ గవర్నర్ ఆ విధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. గవర్నర్ వ్యవస్థ వద్దని టీడీపీ ఎప్పుడో స్పష్టం చేసిందని, దానిపై పోరాటం కూడా చేశామని చంద్రబాబు తెలిపారు. గవర్నర్ వ్యవస్థ ఒక పద్ధతిప్రకారం చేసుకోవాల్సిన వ్యవస్థ అని. పేపర్‌లో వచ్చే విధంగా గవర్నర్ చేయడం కరెక్టు కాదని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు... చంద్రబాబు గవర్నర్ పై ఇలా డైరెక్ట్ గా వ్యాఖ్యలు చెయ్యటం ఇదే మొదటి సారి...

 

cbn governer 24042018 3

ఈ రోజు గవర్నర్, మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన విషయం తెలిసిందే.. చంద్రబాబుతో జరిగిన చర్చల వివరాలు, ఢిల్లీ పెద్దలకు చెప్పటానికి వెళ్ళారని తెలుస్తుంది... మూడు రోజుల పాటు ఆయన హస్తినలోనే ఉంటారు. ఈ మూడు రోజుల పర్యటనలో కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు పలువురు పెద్దలను ఆయన కలవనున్నారు. చంద్రబాబు దూకుడు తగ్గేలా లేదని, గవర్నర్ కేంద్ర పెద్దలకు చెప్పనున్నారు... అలాగే ఇక్కడ పవన్, జగన్ పోషిస్తున్న పాత్ర గురించి కూడా చర్చించనున్నారు... గవర్నర్ నివేదిక చుసిన తరువాత, కేంద్రం మరో ప్లాన్ తో ఆంధ్రప్రదేశ్ పై పట్టుకు ముందుకు రానుంది.. ఇప్పటికే పవన్, జగన్, తమ తమ పాత్రలు సమర్ధవంతంగా పోషిస్తున్నారు... కులాల వారీగా, కుట్రలకు బేస్ సెట్ చేసుకున్నారు... చంద్రబాబు ఎలాగు లొంగడు అని తెలుసుకున్న ఢిల్లీ పెద్దల, నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాలి...

Advertisements

Latest Articles

Most Read