చంద్రబాబు నాయుడు, ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు...ఆయన 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం అలాంటిది మరి... 68వ ఏట అడుగుపెడుతన్న మన ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలతో...

అది 1950వ సంవత్సరం ఏప్రిల్ 20.. చిత్తూరు జిలాలోని నారావారి పల్లెకు తెలీదు ఆ రోజు తమ ఊరిలో ప్రపంచ స్థాయి నేతకి జన్మ స్థలం అయ్యింది అని... చంద్రిగిరిలోని హై స్కూల్ అనుకుని ఉండదు, రోజు కిలోమీటర్లు దూరం నడిచి వచ్చి, తన స్కూల్ లో చదువుకున్న ఆ విద్యార్ధి రాష్ట్రాన్ని నడిపించే నాయకుడు అవుతాడు అని.... తిరుపతి వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీ ఉహించి ఉండదు, తన దగ్గర చదివిన స్టూడెంట్ దేశం గర్వించే నాయకుడు అవుతాడు అని.... ఆయన ఒక సామన్యుడు, ఏ రాజకీయ నేపధ్యం లేనివాడు, తండ్రి ఒక అయిదు ఎకరాలు సాగు చేసుకునే సామాన్య రైతు, తల్లి ఒక కష్ట జీవి...ఆయన మాత్రం నాలుగు దశాబ్దాలుగా రాజకీయాలను శాశిస్తూ, అలుపెరుగని ప్రయాణం చేస్తున్నారు...ఆయనే నారా చంద్రబాబు నాయుడు..

నారావారి పల్లె లాంటి మారు మూల గ్రామంలో పుట్టిన అతి సామాన్యుడు, తిరిగులేని శక్తిగా ఎలా మారారు...గవర్నమెంట్ స్కూల్ లో చుదువుకున్న ఒక సామాన్య కుర్రవాడు, టైమ్స్ మాగజైన్ లో స్పెషల్ స్టొరీ వేసే స్థాయికి ఎలా చేరాడు....క్లింటన్, టోనీ బ్లెర్ లాంటి దేశాధినేతల మనసు ఎలా దోచుకున్నారు....బిల్ గేట్స్ లాంటి కార్పొరేట్ దిగ్గజాల్ని ఎలా ఆకట్టుకున్నారు....

దేశం మొత్తం మీద, సారీ ప్రపంచం మొత్తం మీద 24/7 ప్రజా నాయకుడు అంటే ఆయనే...వ్యక్తిగత జీవితం లేదు, ఒక సరదా లేదు, కుటుంబంతో కలిసి ఎంజాయ్ చెయ్యటం లేదు...67 ఏళ్ళ వయసులో మనవడితో ముచ్చటించలేని స్థితి ఆయనది....ఆయన ఎంజాయ్ చేసేది అయన పనిని, అయన కష్టాన్ని...పొద్దున్న లెగిసిన దెగ్గర నుంచి, పడుకునే దాక, విశ్రాంతి అనేది ఉండదు ఆ మనిషికి....రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామం, ప్రతి మండలం స్వరూపం మొత్తం తెలుసు ఆయన డెబ్బైల్లో రాజకీయాలు చూసారు, ఎనభైల్లో రాజకీయాలు చూసారు, తొంబైల్లో రాజకీయాలు చూసారు, ఇప్పుడు 2017 రాజకీయాలు చూసారు...పాతికేళ్ళకే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి, ఇప్పటికి 45 ఇయర్స్ ఇండస్ట్రీ ఆయనది... అందుకే ఆయనను రాజకీయ అపర చాణిక్యుడు అంటారు...అయన చూడని ఎత్తులు లేవు, ఆయనకి ఎదురైన అవరోధాలు లేవు...అన్ని తట్టుకుని ముందుకు సాగరు, సాగుతూనే ఉన్నారు....రాష్ట్ర రాజకీయం కాదు, కేంద్ర రాజకీయ్యాల్లో కుడా ఆయనకి ప్రత్యేక స్థానం ఉంది...

రాజకీయాల్లో పోలిటీషియన్ లే ఉంటారు, కాని ఆయనను అడ్మినిస్ట్రేటర్గానే ప్రజలు గుర్తిస్తారు....రాష్ట్రానికి IT పరిచియం చేసిన హై-టెక్ CM ఆయనే, 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్ళు ప్రతిపక్ష నేత గా, మళ్ళి ఇప్పుడు నవ్యాంధ్ర మొదట ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రంలో ఎవరకి లేని అవకాశం ప్రజలు ఆయనకి ఇచ్చారు...

ఎలిమినేటి మాధవరెడ్డి, ఎర్రం నాయుడు, దేవినేని రమణ, పరిటాల రవి లాంటి ఎంతో ముఖ్యమైన నాయకులు చనిపోయినా...రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన రాజకీయం, 2012 జగన్ హవా, 2014 రాష్ట్ర విభజన, 2015 లో తెలంగాణాలో కెసిఆర్ పెట్టిన ఇబ్బందులు....ఇలా అన్ని దెబ్బలు తగిలినా, మళ్ళి లెగుస్తారు, సరిచేసుకుంటారు, మళ్ళి మొదలు పెడతారు..అది ఆయన స్టైల్.... ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా, పోరాట పటిమ అస్సలు తగ్గకుండా, అంతే వేగంతో దూసుకు వెళ్తున్న పొలిటికల్ మిస్సైల్ ఆయన...ఆయన నినాదాలతో పార్టీ రూపు రేఖలను, ఆయన విధానాలతో రాష్ట్ర అభివ్రుది రూపు రేఖలను మార్చేసిన ఘనుడు ఆయన....సంస్కరణలు అంటే ఏంటో దేశానికి చెప్పి, గవర్నమెంట్ అంటే ఎలా పని చెయ్యాలో చేసి చూపించారు.... జన్మభూమి, ప్రజల వద్దకు పాలనా అంటూ, నిద్రపోతున్న ఉద్యోగులను పరుగులు పెట్టించిన నాయకుడు ఆయన... ఇప్పుడు ఏమి లేని నవ్యాంధ్రకి పెద్ద దిక్కు ఆయనే... పెట్టుబడిదారులకు అయస్కాంతం ఆయన... ఆయన పడుకోడు, ఎదుటివాళ్ళని పడుకోనివ్వరు... పని పని పని....అదే ఆయన బలం... ఇంత పనిలో కుడా ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుంటారు... చక్కటి ఆహరం, క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా... ఇదే ఆయన హెల్త్ అండ్ ఫిట్నెస్ సీక్రెట్.... క్రమశిక్షణ, కష్టపడటం, నిజాయితీ ఇది ఆయన సక్సెస్ సీక్రెట్.... నాయకత్వం అంటే కేవలం జనాలని సమీకరించటం కాదు, జనాల్ని చైతన్య పరచటం...

ఇది ఆయన వ్యక్తిగత జీవన ప్రస్థానం...

1950 ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లా, నారావారి పల్లెలో తండ్రి ఖర్జూర నాయుడు, తల్లి అమ్మన్నమ్మ కు జన్మించారు చంద్రబాబు...డిగ్రీ చదివే రోజుల్లోనే కాలేజి రాజకీయాల్లో అడుగుపెట్టారు. డిగ్రీ కంటే ముందే, కాంగ్రెస్ పార్టీలో చేరారు...ఆచార్య ఎన్జీరంగా, పాతూరి రాజగోపాల్ అయన రాజకీయ గురువులు...
1978 ఎన్నికలలో చంద్రబాబుకి MLA టికెట్ ఇచ్చారు. 28 ఏళ్ళకే, 1980-83 మధ్య మంత్రిగా పనిచేసారు.
చంద్రబాబుకి ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు..
ఆయనకి కష్టం అనేది చిన్ననాటి నుంచే పరిచయం...ఆయన స్కూల్ కి రోజు అయుదు కీ.మీ నడుచుకుంటూ వెళ్ళే వారు...
1980 సెప్టెంబర్ 10న ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరితో వివాహం జరిగింది.
1995 సెప్టెంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి భాద్యతలు అప్పగించారు.
అధినేతగా పార్టీని, ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని తనదైన స్టైల్ లో ముందుకి తీసుకువెల్తున్నారు.. 44 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు తెలుగు రాష్ట్రాల్లో మళ్ళి పుట్టరేమో...

ఆయన కష్ట జీవి... కష్టం అనేది చాలా మజానిస్తుంది, సక్సెస్ కూడా ఇవ్వలేనంత గొప్ప సంతృప్తిని ఇస్తుంది. కష్టం ఇచ్చిన మజాకి రుచి మరిగిన వాడికి విజయం గురించి పెద్దగా పట్టింపు ఉండదు. విజయమైనా, అపజయమైనా వాడికి కావలసిన సంతృప్తి వాడు ఆల్రెడీ ఆస్వాదించాడు. అదీ శ్రమైక జీవన సౌందర్యం!! అదే చంద్రబాబు నైజం....

మీ నవ్వు చెరగకూడదు
మీ లక్ష్యం చెదరకూడదు
కోట్ల మంది ఆశలు మీపైనే
భావితరాల బ్రతుకు మీతోనే
కాలం కరుణించకపోయినా
వ్యతిరేక పవనాలెన్ని వీచినా
వడివడిగా సాగిపో నీ గమ్యం వైపు
తెలుగు నేలవైపు తిప్పు ప్రపంచపు చూపు...
వర్ధిల్లు వర్ధిల్లు వెయ్యేళ్ళు అమరేంద్రుడువై...
కొలువై నిలిచిపో హృదయాల్లో స్వర్ణాంధ్ర వల్లభుడివై...!!

హ్యాపీ బర్త్ డే చంద్రబాబు గారు....మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి....

సోదర, సోదరీమణులారా, అందరికీ నమస్కారం... ఈ రోజు నేను ధర్మ పోరాట దీక్ష చేపట్టాను. ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు ఆహారం ముట్టకుండా నిరశన వ్రతాన్ని చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, వంచనకు వ్యతిరేకంగా సత్యాగ్రహం చేస్తున్నాను. మన రాష్ట్రానికి కేంద్రం వాగ్దానం చేసిన ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల సాధనకు మన పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సిన సమయం ఇది. 'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014'లోని అంశాలు, ఆనాటి ప్రధాని ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. కేంద్ర ప్రభుత్వం తన ఆఖరి బడ్జెట్లో కూడా రాష్ట్రానికి అన్యాయమే చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగింది. నూతనంగా ఏర్పడిన మన రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది. ఆస్తుల అప్పుల విభజనలో, విద్యుత్ పంపిణీలో, పన్నుల వసూళ్లు, తిరిగి చెల్లింపుల్లో మిక్కిలి నష్టం జరిగింది.

cbn letter 19042018

విభజన చట్టం ప్రకారం రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఆర్ధిక సాయం చెయ్యాలి; రాష్ట్రానికి రైల్వే జోన్ రావాలి; ఉక్కు కర్మాగారం స్థాపించాలి; ఓడ రేవు రావాలి; పెట్రో కెమికల్ పరిశ్రమ ఏర్పాటు కావాలి; నియోజకవర్గాల సంఖ్య పెరగాలి; అనేక విద్యా, పరిశోధన సంస్థలు ప్రారంభించాలి; ఉమ్మడి రాష్ట్రంలోని సంస్థల విభజన పూర్తి కావాలి. విభజన బిల్లు రాజ్య సభలో ఆమోదింప చేయడానికి ఆనాటి ప్రధాన మంత్రి ఆరు హామీలతో కూడిన ప్రకటన చేసారు. అందులో ముఖ్యమైనవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం, ఆదాయం కోల్పోతున్నందున ఏర్పడే రెవెన్యూ లోటు భర్తీ చేయడం, బుందేల్ఖండ్, కోరాపుట్-బోలాంగిర్-కలహండి తరహాలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయాన్ని అందించడం.

కానీ ఇప్పుడు రైల్వే జోన్ ఇవ్వడం కుదరదంటున్నారు. ఉక్కు కర్మాగారం లాభసాటి కాదంటున్నారు. ఓడ రేవుకు అభ్యంతరాలు పెడుతూ తాత్సారం చేస్తున్నారు. పెట్రో కెమికల్ పరిశ్రమకు సుమారు ఐదు వేల కోట్ల రూపాయల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ భారం రాష్ట్రం భరించాలంటున్నారు. విద్యా సంస్థల పురోగతి మందంగా ఉంది. ఇప్పుడు ఇస్తున్న కేటాయింపులను చూస్తే ఇవి వచ్చే ఇరవై యేళ్ళకైనా పూర్తవుతాయా అన్న సందేహం కలుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలోని సంస్థల విభజన నత్తనడక నడుస్తోంది. విజయవాడ, గుంటూరు పట్టణాలకు డ్రైనేజీకి ఇచ్చిన డబ్బు కూడా రాజధాని అమరావతికి ఇచ్చినట్లు చూపిస్తున్నారు. యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇచ్చినా ఇవ్వలేదన్నట్లు ప్రకటనలు ఇచ్చి కుట్ర పూరితంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇస్తున్న సాయం నామమాత్రంగా ఉంది.

cbn letter 19042018

పోలవరం మన రాష్ట్రానికి జీవనాడి. మన ప్రజల చిరకాల స్వప్నం. ఏడు ముంపు మండలాలను మనకు బదలాయించిన తర్వాత కేంద్రం నుంచి అందాల్సిన సాయం మందగించింది. ఖర్చు చేసిన సుమారు మూడు వేల కోట్ల రూపాయలకు పైగా మొత్తం కేంద్రం నుంచి ఇంకా రావాల్సి ఉంది. దీని వడ్డీ భారం మనం మోయాల్సి వస్తోంది. పదునాల్గవ ఆర్ధిక సంఘం సిఫార్సుల దరిమిలా ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని, ఇప్పుడు హోదా కలిగి ఉన్న రాష్ట్రాలకు కూడా కొనసాగించబోమనీ కేంద్రం చెప్పింది. హోదా బదులు దానికి సరిసమానమైన ప్రయోజనాలు కలిగించే ప్రత్యేక సహాయాన్ని ఇస్తామన్నారు. అయితే ఈ ప్రత్యేక సహాయం నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏమీ రాక పోగా, ప్రత్యేక హోదా అనుభవిస్తున్న రాష్ట్రాలలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు 90:10 నిష్పత్తిలో నిధులు ఇవ్వడం, పన్ను రాయితీలు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. పదునాల్గవ ఆర్ధిక సంఘం రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వద్దంటూ ఎక్కడా చెప్పలేదనీ, అది తమ పరిధిలోని అంశం కాదనీ ఆ సంఘం అధ్యక్షులు, సభ్యులు బహిరంగంగా చెప్పారు.

ప్రత్యేక హోదా ఇవ్వద్దని ఆర్థిక సంఘం చెప్పనప్పుడు, రాయితీలు ప్రోత్సాహకాలు ప్రస్తుత హోదా రాష్ట్రాలకు కొనసాగిస్తున్నపుడు మన రాష్ట్రానికి ఎందుకు నిరాకరిస్తున్నారని కేంద్రాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఇచ్చి తీరాల్సిందేనని డిమాండు చేస్తున్నాను. చట్టంలో పేర్కొన్న అంశాలు, రాజ్యసభలో ఇచ్చిన హామీల అమలు అసంపూర్తిగా, ఆలస్యంగా జరగడం మన రాష్ట్రం పట్ల కేంద్రం చూపుతున్న వివక్షకు తార్కాణం. రాష్ట్రానికి చట్టపరంగా దక్కాల్సిన అంశాల పట్ల కేంద్ర ప్రభుత్వం లోని బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు హేళనగా మాట్లాడుతున్నారు. ఇది సహించరానిది.

కేంద్రానికి రాష్ట్రం పట్ల బాధ్యత ఉంది. మరీ ముఖ్యం గా రాష్ట్ర ప్రజల అభీష్టానికి విరుద్ధంగా, అన్యాయంగా విభజన జరిగి కష్టాలలో ఉన్న మన రాష్ట్రం పట్ల ఆ బాధ్యత మరింత ఎక్కువ. మనం నిలదొక్కుకుని మన కాళ్ళమీద మనం నిలబడేంత వరకూ కేంద్రం చేయూత అందించాలి. చట్టం లో లేనివీ, పార్లమెంటు సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీలలో లేనివి మనం అడగడం లేదు. మనవి చట్టబద్ధమైన డిమాండ్లని న్యాయమైన కోరికలని కేంద్రం గుర్తించి వ్యవహరించాలి. వీటన్నింటినీ సంపూర్ణంగా నెరవేర్చే వరకూ మన పోరాటం కొనసాగించాలి. ఇది శాంతియుతంగా, చట్టబద్ధంగా సాగాలి.

ఈ పోరాటంలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ, రాష్ట్రానికి చెందినవారు ప్రపంచంలో ఎక్కడ వున్నా భాగస్వాములు కావాలని, జన్మభూమి రుణం తీర్చుకోవడానికి తమ వంతు కృషి చేయాలని కోరుతున్నాను. ఐదుకోట్ల రాష్ట్ర ప్రజల తరుపున నేను చేసే ఈ పోరాటానికి మీరంతా బాసటగా నిలవాలని, నాతో కలిసి నడవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లు నారా చంద్రబాబు నాయుడు.

కడప,నెల్లూరు, ప్రకాశం, అనంతపురము, విజయనగరం జిల్లాలలో కరువు నుంచి ఉపశమన చర్యలకు రూ. 680 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన కరువు నివారణ చర్యలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి అదనంగా సాయం అందించాలని కోరారు. కరువును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినా ఒక్కోసారి ప్రకృతి సహకరించకపోవడం వల్ల నష్టపోవాల్సి వస్తోందని చెప్పారు. కరువు పరిస్థితులపై పరిశీలనకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం రెండు రోజుల పాటు నాలుగు జిల్లాల పర్యటన అనంతరం గురువారం ముఖ్యమంత్రితో సమావేశమైంది.

cbn kendrabrunam 19042018

తాము 5 జిల్లాల్లోని మొత్తం 121 మండలాల్లో పర్యటించామని వాటిలో ప్రకాశం జిల్లాలో పరిస్థితులు ఒకింత ఆందోళన కరంగా ఉన్నాయని కేంద్ర బృందం సభ్యులు ముఖ్యమంత్రికి తెలిపారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి పోయాయని, తాగునీటి, పశుగ్రాస సమస్యలు కూడా అధికంగా ఉన్న విషయాన్ని గమనించామని చెప్పారు. అదే సమయంలో కరువును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. రేషన్, పెన్షన్లు అందించేందుకు అవలంబిస్తున్న విధానాలు తమనెంతో ఆకట్టుకున్నాయని, కరువు మండలాల్లో ఉపాధి హామీ పధకం పనులు జరుగుతున్న తీరు చాలా బాగుందని ముఖ్యమంత్రికి తెలిపారు.

cbn kendrabrunam 19042018

ఆంధ్రప్రదేశ్‌లో కరవు, తుఫాన్లు రెండూ ఎదుర్కొనాల్సిన విచిత్ర పరిస్థితులు వున్నాయని కోస్తాంధ్రను తుఫాన్లు, రాయలసీమను కరవు పీడిస్తున్నాయని ముఖ్యమంత్రి కేంద్ర బృందానికి వివరించారు. ఎన్ని చర్యలు తీసుకున్నా ఒక్కోసారి ప్రకృతి వైపరీత్యాలను నిలువరించలేని పరిస్థితులు తలెత్తున్నాయని చెప్పారు. రాయలసీమ ప్రాంతాన్ని కరవు బారి నుంచి కాపాడటానికి విస్తృత చర్యలు చేపట్టాము, పెద్ద సంఖ్యలో పంటకుంటలు తవ్విన విషయాన్ని తెలిపారు. వర్షాభావ పరిస్తితులవల్ల పంట కుంటల్లో నీటి నిల్వలు చేరలేదన్నారు.

పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించకుంటే చివరికి కృష్ణా, గుంటూరు జిల్లాలు కూడా బీడు వారేవని ముఖ్యమంత్రి అన్నారు. సాధ్యమైనంత త్వరగా వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు పనిచేస్తున్నామని, టన్నెల్ పనులు పూర్తి అయితే ప్రకాశం జిల్లాను శాశ్వతంగా కరవు బారినుంచి కాపాడుకోగలుగుతామని అన్నారు. కరువు వచ్చినప్పుడే నివారణ చర్యల గురించి ఆలోచిస్తున్నామని, కానీ శాశ్వత ప్రాతిపదికపై ఈ సమస్యను అధిగమించాలని దీనికి రాష్ట్రాలకు కేంద్ర సాయం అవసరమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న వాస్తవ పరిస్థితులను కేంద్రానికి వివరించి ఏపీని ఉదారంగా ఆదుకునేలా చూడాలని బృందం సభ్యులకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

విభజన చట్టం హామీల అమలు విషయంలో కేంద్ర వైఖరిని ఎండగట్టేందుకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 12 గంటల పాటు ముఖ్యమంత్రి నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. తన పుట్టినరోజు వేడుకలు జరుపకుండా, అందరూ దీక్షల ద్వారా కేంద్రానికి మన ధర్మాగ్రహం తెలపాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రం కోసం పుట్టినరోజు నాడు నిరశన దీక్ష చేయడం ఇదే ప్రథమం. 68 ఏళ్ల వయసులో ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు.

cbnn deekshga 19042018

అయితే, ఈ దీక్షకు ముందు ప్లాన్ చేసిన ప్రకారం, దేశంలోని అన్ని జాతీయ పార్టీ నాయకులని, ఆహ్వానించాలని అనుకున్నారు. ఆ మేరకు, 8 మంది జాతీయ నాయకులతో పాటు, కొంత మంది ముఖ్యమంత్రులు కూడా వస్తామని కబురు పంపించారు. అయితే, చివరి నిమిషంలో ఒక పెద్దాయన సలహా మేరకు, ఇది వాయిదా పడినట్టు తెలుస్తుంది. మీరు రాష్ట్రం కోసం చేస్తున్న పోరాటంలో, అన్ని జాతీయ నాయకులు మీ దగ్గరకు వచ్చి మద్దతు ఇస్తే మంచిదే, కాని అలా చేస్తే, ఇక్కడ మీ మీద తప్పుడు ప్రచారం చెయ్యటానికి రెడీ అయ్యారు... మీరు రాజకీయం కోసమే చేస్తున్నారని, రాష్ట్రం కోసం కాదని, ప్రచారం చెయ్యటానికి రెడీ అయ్యారు. నా సలహా మేరకు, ఇప్పుడు జాతీయ నాయకులని, మీ దీక్షకు ఆహ్వానించ వద్దు అంటూ, ఆ పెద్దాయన చెప్పిన మేరకు, చంద్రబాబు కూడా ఈ విషయం వదిలేసారని సమాచారం...

cbnn deekshga 19042018

అందుకే జాతీయ స్థాయి నేతలు వస్తాను అని చెప్పినా, చంద్రబాబు మరో సందర్భంలో రావచ్చు, ఇప్పుడే వద్దు అని వారిని వారించారు... ప్రత్యేక హోదా, లోటు భర్తీ, పోలవరం నిర్మాణం, రైల్వే జోన్ ఏర్పాటు, గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ-పెట్రో కెమికల్ కాంప్లెక్స్, అమరావతి నిర్మాణం, జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు, దుగరాజుపట్నం పోర్టు, శాసనసభ సీట్ల పెంపు, కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖపట్నం-విజయవాడల్లో మెట్రో రైలు, అమరావతికి రైలు-రహదారి అనుసంధానం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సాయం, పొరుగు రాష్ట్రం నుంచి విద్యుత్ బకాయిల వసూళ్లు, షెడ్యూల్ సంస్థల విభజన, గ్రేహౌండ్ సెంటర్ ఏర్పాటు ఇలా ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014’లో పేర్కొన్న 18 అంశాలపై మాత్రమే మన ఒత్తిడి ఉండాలని, ఇప్పుడే రాజకీయాల వైపు వద్దు అని చంద్రబాబు కూడా నిర్ణయించుకున్నారు...

Advertisements

Latest Articles

Most Read