వర్షపు నీరు..సాగు, తాగుకు ఆధారం. కాలం అనుకూలిస్తే సంవత్సరంలో మూడు నెలలు మాత్రమే వర్షపు నీరు లభ్యమవుతోంది. ఆ నీటిని సంరక్షించక పోవడం వల్లే దుర్భిక్ష పరిస్థితులు నెలకుంటున్నాయి. చెరువులు, కుంట లలో నిలువ చేసిన నీటిలో చాలా భాగం ఆవిరి రూపంలో వృథా అవుతోంది. నీటిని భూమిలోకి ఇంకేలా చేసి భూగర్భ జలాలు సమృద్ధి పరచాలి. ప్రస్తుతం వర్షపు నీటి వినియో గం కేవలం పది శాతం మాత్రమే.. అందుకే ప్రతి వర్షపు నీటి చుక్కను భూమిలో ఇంకేటట్లు చూడాలి. ఇదే కార్యక్రమం కోసం, చంద్రబాబు వారంలో ఒక రోజు, నీరు - మీరు మీద సమీక్ష చేస్తూ, తగు సూచనలు ఇస్తూ, వివిధ రూపాల్లో, నీటి లభ్యత పెంచుతున్నారు... ఈ కోవలో, చంద్రబాబు విజన్ కు మరో ఉదాహరణ భూగర్భ ఆనకట్టలు (సబ్‌సర్ఫేస్‌ డ్యామ్స్‌)

cbn kadapa 18042018 2

ఈ విధానాన్ని కడప జిల్లలో, పైలట్ ప్రాజెక్ట్ గా మొదలు పెట్టారు. రూ.6 వేల కోట్లకు పైగా వెచ్చించి 92 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన పలు ప్రాజెక్టులను జిల్లాలో నిర్మించినా వాటిలోకి నీరు చేరే పరిస్థితి లేకపోవడంతో సమస్యగా తయారైంది. జిల్లా మొత్తం భూగర్భం రాతినేల కావడంతో నీరు ఇంకడమన్నదీ గగనమే. దీంతో ప్రభుత్వం ఈ సమస్య పై ద్రుష్టి సారించింది. కడప భూమిలో నీటిని ఇంకింపజేయలేని క్రమంలో పాతాళాన్నే జలాశయంగా మార్చాలని భావించి భూగర్భ ఆనకట్టలు (సబ్‌సర్ఫేస్‌ డ్యామ్స్‌) నిర్మాణానికి సంకల్పించారు. పాపాఘ్ని నదిని ప్రయోగానికి ఎంచుకున్నారు. అందులో అధ్యయనం చేసి 6 చోట్ల డ్యాముల నిర్మాణం చేపట్టారు. రూ.26.36 కోట్ల వ్యయంతో 0.796 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మాణాలు చేపట్టి ఇటీవల పూర్తిచేశారు. కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లోని చక్రాయపేట, వేంపల్లి, పెండ్లిమర్రి, వీరపునాయునిపల్లి మండలాల పరిధిలో ఆనకట్టలు ఏర్పాటయ్యాయి.

cbn kadapa 18042018 3

ప్రస్తుతం ఇక్కడ సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. భూగర్భజలమట్టం గణనీయంగా పెరుగుతోంది. ఒకప్పుడు వట్టిపోయిన బోర్లు, బావుల్లోనూ జలసిరులు కనిపిస్తున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం.. సుమారు 4-5 మీటర్ల మేర నీటిమట్టం పెరిగినట్లు గుర్తించారు. రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అధికారుల లెక్కల ప్రకారం.. ప్రత్యక్షంగా లబ్ధిపొందుతున్న 7795 ఎకరాల ద్వారా సుమారు 16,563 మెట్రిక్‌ టన్నుల వరి దిగుబడి వచ్చే అవకాశముందని లెక్కగట్టారు. వార్షిక జీవీఏ రూ.51.24 కోట్లు సాధించవచ్చన్నది అంచనా. అసలు ఏంటి ఈ భూగర్భ ఆనకట్టలు (సబ్‌సర్ఫేస్‌ డ్యామ్స్‌) ? ... వాటర్‌షెడ్‌ ప్రాంతంలో భూమిలోకి ఇంకింపజేసిన నీటిని కాపాడుకోవాలి. నిల్వ ఉన్న భూగర్భ జలాన్ని వాడక పోయినా నీరు భూమిలో ప్రవహించి వాటర్‌ షెడ్‌ హద్దు దాటి పోయే అవకాశం ఉంది. భూగర్భ ఆనకట్టలు వాటర్‌ షెడ్‌ పరిధి అంచున కాల్వలా తవ్వి నిర్మించాలి. ఇది నది నీరు బయటకు పోకుండా చేసే అడ్డుగోడలా పని చేస్తుంది. ఈ కట్టడాన్ని హెచ్‌డీపీఈ ఫిల్మ్‌తో కప్పినట్టయితే నీరు బయటకు రాదు. మామూలు భూగర్భ జలాల సంరక్షణకు అయ్యే ఖర్చులో కేవలం నాలుగో వంతు ఖర్చుతో ఈ నిర్మాణం పూర్తి చేయవచ్చు.

విభజన హామీలు నెరవేర్చండి అయ్యా అంటే, మీకు 10 సంవత్సరాల టైం ఉంది, ఈ లోపే మీకు ఎంతో చేసాం, పండగ చేసుకోండి అంటూ, బీజేపీ నేతలు వ్యంగ్యంగా మాట్లాడటం చూసాం... ఇప్పుడు మన రాష్ట్రానికి కేటాయించిన జాతీయ విద్యాసంస్థల స్థితి చుస్తే, మన రాష్ట్రానికి ఎంత దౌర్భాగ్యమో అర్ధమవుతుంది... సామాన్యంగా నిట్‌, ఐఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో, సీట్లు దొరకటం అంటేనే మహా భాగ్యం... వీటిల్లో సీట్లు రావటం కోసం, పోటీ అధికంగా ఉంటుంది... అయితే, మన రాష్ట్రంలో కొత్తగా కేటాయించిన జాతీయ విద్యాసంస్థల్లో సీట్లు మిగిలిపోతున్నాయి... ఎందుకో తెలుసా ? శాశ్వత భవనాలు, ల్యాబ్ లు కొరత వల్ల వీటిల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు.

bjp 18042018 1

ఐదు విద్యాసంస్థల్లో కర్నూలు ట్రిపుల్‌ఐటీ మినహా మిగతావి తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రైవేటు కళాశాలల భవనాలను అద్దెకు తీసుకుని వీటిని నిర్వహిస్తున్నారు. నిట్‌ తాడేపల్లిగూడెంలో వచ్చే ఏడాది ప్రవేశాలకు భవనాల కొరత ఉంది. నిట్‌, ఐఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో 2015-16లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు 2019-20లో మొదటి బ్యాచి కింద బయటకు రానున్నారు. మొదటి స్నాతకోత్సవానికి కూడా శాశ్వత భవనాలు అందుబాటులోకి రావడం లేదు. ఐఐఎం మినహా మిగతా వాటిల్లో ప్రవేశాలు పూర్తి స్థాయిలో జరగడం లేదు. ఐసర్‌లో గతేడాది మాత్రమే వందశాతం భర్తీ అయ్యాయి. నిట్‌లో పదుల సంఖ్యలో సీట్లు మిగులుతున్నాయి. ఐఐటీ తిరుపతిని కృష్ణతేజ విద్యాసంస్థల విద్యా ప్రాంగణంలో నిర్వహిస్తుండగా, ఐసర్‌ను శ్రీరామ ఇంజినీరింగ్‌ కళాశాలలో కొనసాగిస్తున్నారు.

bjp 18042018 1

ఐఐఎంను ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నారు. నిట్‌ను తాడేపల్లిగూడెం సమీపంలోని పెదతాడేపల్లి వద్దనున్న వాసవి ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తున్నారు. ఐఐటీ, ఐసర్‌, నిట్‌లకు ప్రహరీ నిర్మాణాలు 75శాతం పూర్తయ్యాయి. పెదతాడేపల్లి వద్దనున్న వాసవి ఇంజినీరింగ్‌ కళాశాలలో నిట్‌ను తాత్కాలికంగా ఏర్పాటుచేశారు. ఇక్కడ దాదాపు 32కు పైగా గదులున్నాయి. శాశ్వత భవనాల నిర్మాణానికి రూ.206కోట్లు మంజూరైనా టెండరు దశ దాటలేదు. ప్రస్తుతం నిర్వహిస్తున్న వాసవి కళాశాల యాజమాన్యంతో కుదుర్చుకున్న ఒప్పందం ఈ ఏడాదితో ముగియనుంది. భవనాన్ని ఖాళీ చేయాలని యాజమాన్యం ఒత్తిడి తెస్తోంది. ఒక వేళ నిర్మాణం పూర్తయ్యేవరకు కొనసాగించాల్సి వచ్చినా ఇప్పటివరకు కేటాయించిన భవనాలు తప్ప అదనంగా ఇవ్వలేమని పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ప్రవేశాలు పొందేవారికి ఎక్కడ తరగతులు నిర్వహించాలన్నది ప్రశ్నార్థకమవుతోంది. ఈ పరిస్థితికి, ఏ బీజేపీ నాయకుడు సమాధానం చెప్తాడు ? వీటితో పండగ చేసుకోమంటారా ?

రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ధర్మ పోరాట దీక్ష’ చేస్తున్న సంగతి తెలిసిందే. తన పుట్టిన రోజైన ఈనెల 20వ తేదీన బాబు దీక్ష చేయనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 12 గంటలపాటు నిరశన దీక్ష చేస్తారు. ఆయనకు మద్దతుగా దీక్షలో పాల్గొనేందుకు జిల్లా నుంచి పార్టీ శ్రేణులు తరలివెళ్లాలని భావిస్తున్నాయి. అయితే తెలుగు దేశం పార్టీ కూడా ఈ దీక్షను విజయవంతం చేయడానికి అందరి మద్దతును కోరుతోంది. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన నేతలందరికీ దీక్షకు హాజరు కావాలని ఆహ్వానాలు పంపింది.

congress 18042018 1

విశాఖ జిల్లా నుంచి సీనియర్‌ నాయకుడు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు కూడా ఆహ్వానం అందింది. మంగళవారం ఉదయం రాష్ట్ర విద్యుత్‌ శాఖా మంత్రి కళా వెంకటరావు, సాయంత్రం నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమలు వేర్వేరుగా ఫోన్‌ చేసి, కొణతాలను తప్పకుండా దీక్షకు హాజరు కావాలని కోరినట్టు తెలిసింది. ఇప్పటికీ కొణతాల రామకృష్ణ, ఏ పార్టీలో లేరు. ప్రస్తుతం, విశాఖ రైల్వే జోన్ కోసం పోరాడుతున్నారు.. చాలా రోజులుగా, జగన్ తన పార్టీలోకి లాగటానికి ప్రయత్నిస్తున్నా, ఆయాన మాత్రం, జగన్ పార్టీలో చేరటానికి మక్కువ చూపటం లేదు. ఈ నేపధ్యంలో, ఆయన చంద్రబాబుతో పాటు, విజయవాడ వచ్చి దీక్షలో కూర్చుంటారనే సమాచారం వస్తుంది.

congress 18042018 1

ధర్మ పోరాట దీక్షకు అన్ని పార్టీల నేతలను, అఖిలపక్ష నేతలను ఆహ్వానిస్తున్నామని నారా లోకేశ్‌ తెలిపారు. వారితో పాటు ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, మహిళా, వాణిజ్య, ఉపాధ్యాయ సంఘాలు, బార్‌ అసోసియేషన్‌, ట్రేడ్‌ యూనియన్లు, రిక్షా, ఆటో యూనియన్లు, విద్యార్థి సంఘాలతో పాటు వైద్యులు, ఇతర వృత్తుల వారంతా దీక్షలో పాల్గొనాలని కోరారు. ‘‘ఏపీకి జరుగుతున్న అన్యాయంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ఢిల్లీలో కదలిక రావాలని ఈ పవిత్ర దీక్షకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజన చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి తెలిపేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి’’ అని తెలిపారు. విభజన కష్టాలున్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తోందని... సాంస్కృతిక కార్యక్రమాలుంటాయని చెప్పారు.

ఆర్ధికంగా రాష్ట్రం ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా తాను వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేరుసక్తూ ఈమూ రైతులకు రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈమూ రైతులకు జీవో నెం. 14 ద్వారా రుణ మాఫీ చేసినందుకు ఎంపీ మాగంటి బాబు, రైతు సంఘం నేతలు కంతేటి వెంకటరాజు ఆధ్వర్యంలో రైతుల వచ్చి సచివాలయంలో మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలుపరుస్తున్నామని చెప్పారు. ఈమూ రైతుల రుణాలు మాఫీ అయినందుకు సంతోషంగా ఉందని అన్నారు.

cbn emu farmers 18042018

ఇదిలా ఉంటే కేంద్ర ప్రోత్సాహంతో 2008-09 సంవత్సరంలో చిన్న, సన్నకారు రైతులకు దన్నుగా ఉండాలన్న లక్ష్యంతో నాబార్డు బ్యాంకర్ల సహకారంతో రైతులచే ఈమూ పక్షుల పెంపకాన్ని ప్రోత్సహించింది. అయితే ఈమూ పక్షుల ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, మార్కెటింగ్ కానీ లేనంద వల్ల, పక్షులను పెంచిన రైతులందరూ కూడా పూర్తిగా నష్టపోయారు. అలాంటి కష్టకాలంలో ఈమూ రైతుల బాధలను మాగంటి, కంతేటి తదితరులు ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్రలో భాగంగా వచ్చిన నాటి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడి దృష్టికి తెచ్చారు. ఆనాడు ఈమై రైతుల కష్టాలను విని చలించిన చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చాక పూర్తి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

cbn emu farmers 18042018

అధికారంలోకి రాగానే సమస్యను సావధానంగా అధ్యయనం చేశారు. పలుమార్లు ఈ అంశంపై మాగంటి, కంతేటి ముఖ్యమంత్రిని కలిశారు. అదేవిధంగా ఈ సమస్యను ముఖ్యమంత్రి గారు ఎస్.ఎల్.బి.సి సమావేశంలో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ సిహెచ్. కుటుంబరావుతో కలసి బ్యాంకర్లకు వివరించారు. బ్యాంకర్లు కూడా సానుకూలంగా ముఖ్యమంత్రి సూచనలను పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసలు లో 50%, 25% బ్యాంకర్లు, 25% రైతులు భరించే విధంగా ఈ నిష్పత్తిలో వారికి న్యాయం చేసేందుకు, పూర్తిగా వడ్డీమాఫీ చేయడానికి ఎస్.ఎల్ .బి.సిలో తీర్మానం చేయించారు.

ముఖ్యమంత్రిని సత్కరించిన ఈమూ రైతులు... ఇదే విధంగా జీవో నెం..14 ద్వారా ఈమూ రైతులకు రుణమాఫీకి ఆదేశాలు జారీ చేసినందుకు మంగళవారం కంతేటి వెంకటరాజు ఆధ్వర్యంలో ఈమూ రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి సత్కరించారు. ముఖ్యమంత్రి వీరికి మిఠాయిలు తినిపించారు. ఈ కార్యక్రమంలో ఏలూరి ఎంపీ మాగంటి బాబు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు,సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, నారాయణ, రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీ మోహన్, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, ఈమూ రైతు నాయకులు కాకాని శ్రీనివాసరావు, వల్లూరు వంశీ కృష్ణ, కర్నాటి అశోక్ బాబు, కర్నాటి అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Latest Articles

Most Read