అంబ‌టి రాయుడు ముక్కుసూటి క్రికెట‌ర్. బ్యాటుతోనూ, మాట‌ల‌తోనూ స‌మాధానం చెప్ప‌గ‌ల ఎగ్రెసివ్ నెస్ ఆయ‌న సొంతం. ఇండియా టీమ్‌కి ఆడినా, ఐపీఎల్ లో సీఎస్‌కేతో జ‌ర్నీ చేసినా అంబ‌టి రాయుడు స్టైలే వేరు. అంత‌ర్జాతీయ మ్యాచుల్లో యాటిట్యూడ్-పాలిటిక్స్ వ‌ల్ల అవ‌కాశాలు ద‌క్క‌క‌పోవ‌డంతో రిటైర్మెంట్ ప్ర‌క‌టించేశాడు. అంబ‌టి రాయుడుకి క్రికెట్లో జ‌రిగిన అన్యాయం ప‌ట్లా అంద‌రిలోనూ సానుభూతి ఉంది. ఐపీఎల్ ముగిసిన వెంట‌నే రాయుడు వేసిన పొలిటిక‌ల్ ఫ్రంట్ ఫుట్ అంబ‌టిపై ఉన్న సాఫ్ట్ కార్న‌ర్‌ని దూరం చేసింది. ఐపీఎల్లో ఆడుతూనే జ‌గ‌న్ రెడ్డి పాల‌న‌ని ప్ర‌శంసిస్తూ ట్వీట్లేసిన రాయుడు ..అనంత‌రం సీఎంని క‌లిసి వైసీపీలో చేర‌డానికి సిద్ధంగా ఉన్నానంటూ సంకేతాలు పంపారు.  వైసీపీ అనుకూల మీడియా చాన‌ళ్ల‌కి వైసీపీ లైనులో ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. దీనికంత‌టికీ స్కెచ్ ఐప్యాక్ ఆఫీసులో రెడీ అవుతోంది. అంబ‌టి రాయుడు క్ర‌మం త‌ప్ప‌కుండా ఐప్యాక్ ఆఫీసులో కోర్ టీముతో భేటీ అయిన త‌రువాతే వైసీపీ అనుకూల చాన‌ళ్ల‌కి ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నార‌ని తెలుస్తోంది. అంబ‌టి రాయుడుని పేటీఎం టీములాగే వైసీపీ వాడుతోంద‌ని తెలుస్తోంది. అంబ‌టిరాయుడులాంటి వారితో కుల‌, ప్రాంత విద్వేషాలు రెచ్చ‌గొట్టించి వైసీపీ అందులో చ‌లికాచుకుని రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు పొందేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

వైసీపీకి చెందిన రెండు చాన‌ళ్లు, వైసీపీ కోసం అదే చాన‌ళ్ల‌లో ప‌నిచేసే ఇద్ద‌రు మ‌హిళ‌లు దారుణంగా క‌ల‌బ‌డి మ‌రీ కొట్టుకున్నారు. సీఎం క్యాంప్ ఆఫీసు మీడియా పాయింట్ ద‌గ్గ‌ర జ‌రిగిన ఈ గొడ‌వ‌ల్లో ఒక‌రిని ఒక‌రు ర‌క్కుకుంటూ, గిచ్చుకుంటూ, తిట్టుకుంటూ వీడియోలు కూడా తీసుకుని సోష‌ల్ మీడియాలో పోస్టులు చేసుకున్నారు. వీళ్లిద్ద‌రూ బ‌య‌ట‌కు చెబుతున్న‌ట్టు ఒక‌రు లైవ్ పెట్టిన‌ప్పుడు ఇంకొక‌రు లైవ్ మైకులు పెడుతున్నార‌ని చెబుతున్నా...ఇద్ద‌రి మ‌ధ్యా వివాదానికి ఇద్ద‌రు `ముఖ్య‌`మైన వ్య‌క్తులు కార‌ణం అని తెలుస్తోంది. ఒక‌రు ముఖ్య‌నేత పీఆర్ టీములో కీల‌కంగా ఉంటే..ఇంకొకాయ‌న స‌ల‌హాల సామ్రాజ్యాన్ని ఏలేవార‌ని తెలుస్తోంది. పీఆర్ టీములో కీల‌క వ్య‌క్తి టీవీ9 హ‌సీనాకి మ‌ద్ద‌తుగా నిలిస్తే.. స‌ల‌హాల పెద్దాయ‌న ఎన్టీవీ రెహానాకి అండ అని తెలుస్తోంది. ఇద్ద‌రి గొడ‌వ సంద‌ర్భంగా కూడా స‌ల‌హాల పెద్దాయ‌న పేరే ప్రస్తావ‌న‌కి రావ‌డం విశేషం. ఎస్సార్కే సార్ కి నీ గురించి తెలియ‌దు, ఆయ‌న ద‌గ్గ‌రే తేల్చుకుందాం అని హ‌సీనా మాట‌లు రికార్డు అయి ఇప్పుడు మీడియా వ‌ర్గాల్లో క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. ఎవ‌రా ఎస్సార్కే సార్! ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌. tv9 హసీనా, NTV రెహానా మధ్య సీఎంవో లో ఆధిపత్యం కోసం నిత్యం గొడవలు జ‌రుగుతున్నాయ‌ని, వీరిద్ద‌రికీ సీఎంవోలో ఇద్ద‌రు పెద్ద‌లు ఆశీస్సులుండ‌డంతో ఇది కొట్టుకునే వ‌ర‌కూ దారి తీసింద‌ని స‌మాచారం. ఇద్ద‌రు మ‌హిళా జ‌ర్న‌లిస్టుల తీరుపై అటు యాజ‌మాన్యాలు, ఇటు సీఎంవోలో వ‌త్తాసు ప‌లికిన వారు, వైసీపీ పెద్ద‌లు ఆగ్ర‌హంగా ఉన్నార‌ని తెలుస్తోంది. వీరి తీరుతో వైసీపీ రోడ్డున ప‌డింద‌ని, యాజ‌మాన్యాలు కూడా వైసీపీతోపాటే బ‌ద్నాం అయ్యాయ‌ని కోపంగా ఉన్నారు. వైసీపీ పెద్ద‌ల ఆదేశాల‌తో ఎన్టీవీ రెహానా ను విశాఖ‌కి, టీవీ9 మేనేజ్మెంట్ హసీనా హైదరాబాద్ కు బదిలీ చేసింద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ప్యాకేజీ స్టార్ అని రోజూ విష ప్ర‌చారం చేసే వైసీపీ కోసం పనిచేసే అస‌లు సిస‌లు ప్యాకేజీ స్టార్ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అని సాక్ష్యాధారాల‌తో వెల్ల‌డైంది. కాపు ఉద్య‌మం మాటున్న ఇన్నాళ్లూ వైసీపీ కోసం ప‌నిచేసిన ముద్ర‌గ‌డ ఒక లెట‌ర్‌తో ముసుగు తీసేసి తాను వైసీపీ ప్యాకేజీ స్టార్‌ని అని ప్ర‌క‌టించుకున్నారు. వారాహి యాత్ర‌లో భాగంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాకినాడ‌లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి అవినీతి-దాష్టీకాల‌పై ధ్వ‌జ‌మెత్తారు. దీనిపై కౌంట‌ర్ ద్వారంపూడి ఇచ్చారు. వైసీపీ నేత‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌నీ తిట్టారు, వార్నింగులు ఇచ్చారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. వైసీపీ నేత ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విమ‌ర్శిస్తే ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంకి ఏంటో నొప్పి అంటున్నారు జ‌న‌సైనికులు. కాపుల కోస‌మే త‌న జీవితం అంకితం అని, కాపుల కోసం ప్రాణం ఇస్తాన‌నే ముద్ర‌గ‌డ‌...రెడ్ల కోసం ఊడిగం చేయ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోప‌ణ‌ల‌పై వైసీపీ నేత‌లు స్పందించ‌డంలో అర్థం ఉంద‌ని, కాపు ఉద్య‌మ‌నేత‌న‌నే చెప్పుకునే ముద్ర‌గ‌డ వైసీపీ కోసం ఎందుకు స్పందిస్తున్నార‌ని జ‌న‌సైనికులు ప్ర‌శ్నిస్తున్నారు. ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి కాపు కాదు, రెడ్డి. ఆయ‌న కోసం ముద్ర‌గ‌డ గుడ్డ‌లు చించుకుని దీర్ఘాల‌తో ఉత్త‌రాలు రాయ‌డం ఏంట‌ని నిల‌దీస్తున్నారు.
ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం లెట‌ర్ హెడ్ పోయింద‌ని, అది తాడేప‌ల్లి ప్యాలెస్‌లో ఉంద‌ని..దానిపై త‌మ‌కు నోటికొచ్చింది వారు రాసుకుంటున్నా ఏమీ అన‌లేని నిస్స‌హాయ‌స్థితిలో వైసీపీ ప్యాకేజీ స్టార్ ప‌ద్మ‌నాభం ఉన్నార‌ని జ‌న‌సేన ఆరోపిస్తోంది. రేష‌న్ మాఫియా డాన్‌ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిది గౌరవప్రదమైన కుటుంబం అంటోన్న ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం...కాపులు ఎంత‌గానో ప్రేమిస్తూ, ప్ర‌జాసేవ కోసం కోట్లు ఖ‌ర్చు చేస్తోన్న‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ది గౌర‌వ‌నీయ‌మైన కుటుంబం కాదా అని జ‌న‌సైనికులు ముద్ర‌గ‌డ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం లేఖ‌ని వైసీపీ సోష‌ల్ మీడియా ఇన్చార్జిలు విడుద‌ల చేయ‌డం, వైసీపీ సోష‌ల్ మీడియా గ్రూపుల‌న్నీ ముద్ర‌గ‌డ లెట‌ర్‌ని ప్ర‌ముఖంగా పోస్ట్ చేయ‌డం చూస్తుంటే...వైసీపీ కోసం ప‌నిచేసే అస‌లు సిస‌లు లెట‌ర్ ప్యాకేజీ స్టార్ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభ‌మేన‌ని తేలుతోంద‌ని జ‌న‌సేన అంటోంది.

కాపు జాతిని కాపాడే ఏకైక నేత‌ని తానేన‌ని ప్ర‌క‌టించుకునే ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంకి కుంభ‌క‌ర్ణుడు మాదిరిగానే శాపం ఉంది. ఇది చాలా విచిత్ర‌మైన శాపం. వైసీపీ అధికారంలో ఉంటే ముద్ర‌గ‌డ హాయిగా నిద్ర‌పోతాడు. టిడిపి అధికారంలో ఉంటే నిద్ర‌మానేసి కాపు రిజ‌ర్వేష‌న్లు పేరుతో పోరాడుతుంటాడు. మ‌ళ్లీ వైసీపీ అధికారంలో ఉన్నా ఇబ్బందుల్లో ఉంటే నిద్ర‌మ‌త్తు వ‌దిలేసి మ‌రీ లేఖ‌ల‌తో విరుచుకుప‌డ‌తాడు ముద్ర‌గ‌డ‌. సంబంధంలేని అంశాల‌పైనా ప్రెస్ నోట్లు రిలీజ్ చేయ‌డంతో వైసీపీ కోసం ప‌నిచేసే కుంభ‌క‌ర్ణుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అని తేలిపోయింది.
ఈబీసీల‌కి ఇచ్చిన రిజ‌ర్వేష‌న్లు దెబ్బ తిన‌కుండా, బీసీల రిజ‌ర్వేష‌న్ల‌కి ప్రమాదం వాటిల్ల‌కుండా టిడిపి పాల‌న‌లో సీఎం చంద్ర‌బాబు కాపుల‌కి 5 శాతం రిజ‌ర్వేష‌న్ ఇచ్చారు. అయినా శాంతించ‌ని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం వైసీపీ కోసం రాష్ట్రంలో అల్ల‌ర్లు సృష్టించారు. టిడిపి ఐదేళ్ల పాల‌న‌లో కాపు కార్పొరేష‌న్ ఏర్పాటు చేసి వేల‌కోట్లు నిధులిచ్చినా ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఉద్య‌మం ఆప‌లేదు. ఐదేళ్లు (2014-19) టిడిపి పాల‌న మొత్తం ముద్ర‌గ‌డ ఉద్య‌మం కొన‌సాగింది. 2019లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. కుంభ‌క‌ర్ణుడు మాదిరిగానే మ‌ళ్లీ నిద్ర‌లోకి జారుకున్నారు ముద్ర‌గ‌డ‌. కాపులకి చంద్ర‌బాబు ఇచ్చిన రిజ‌ర్వేష‌న్ జ‌గ‌న్ రెడ్డి ఎత్తేస్తే నోరు మెద‌ప‌లేదు. కాపు కార్పొరేష‌న్‌కి రూపాయి కూడా వైసీపీ స‌ర్కారు కేటాయించ‌క‌పోతే ఒక్క లేఖ కూడా రాయ‌లేదు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తే కుంభ‌క‌ర్ణుడి నిద్ర‌వీడి వ‌చ్చి మ‌రో లేఖ రాశారు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.

Page 4 of 3181

Advertisements

Latest Articles

Most Read