ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు నెలల క్రిందట, హిందువులు దేవాలయాల టార్గెట్ గా జరిగిన ఘటనలు అందరినీ కలిచి వేసాయి. ఏదో ఒక ప్లాన్ గా చేస్తున్నాటు జరిగిన ఘటనలు చూస్తే అర్ధం అవుతుంది. అయితే పోలీసులు నిఘా వల్ల కానీ, మరే ఇతర కారణాల వల్లో కానీ, ఈ ఘటనలు ఆగిపోయాయి. అప్పుడప్పుడు జరుగుతున్నా, అప్పట్లో జరిగినట్టు వరుస పెట్టి జరగలేదు. అయితే ఈ జరిగిన ఘటనల్లో, ఒక ఘటన మాత్రం, తీవ్ర దుమారం రేపింది. అదే దక్షిణ కాశీగా పిలిచే, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రధం దగ్దం ఘటన. రాత్రికి రాత్రి ఈ రధం తగలబడి పోయింది. ఇప్పటికీ ఇది ఎవరు చేసారో తెలియదు. ఎవరో పిచ్చోడు చేసాడని నమ్మించే ప్రయత్నం కూడా చేసారు. తరువాత రధం పైన తేనే తుట్టు ఉంది, దాని కోసం ఎవరో అంటించారని అన్నారు. ఎవరు చేసారో ఏమో కానీ, హిందువులు మనోభావాలు ఈ ఘటనతో దెబ్బ తిన్నాయి. రధం అలా మంటల్లో తగలబడి పోతుంటే, అందరూ ఆవేదన చెందారు. అయితే ఈ ఘటన , రాజకీయంగా కూడా వేడెక్కింది. తెలుగుదేశం, బీజేపీ పార్టీలు ఈ ఘటన పై నిరసనలు తెలిపాయి. చివరకు అనేక ఉద్రిక్త పరిణామాలు తరువాత, ప్రభుత్వం కూడా దిగి వచ్చింది. ఈ ఘటనను సిబిఐకి అప్పగిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో సమస్యకు ఫుల్ స్టాప్ పడింది. ఆందోళనలు విరమించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా, తమ మీద నింద లేకుండా, కేంద్రం పరిధిలోకి నెట్టేస్తూ, సిబిఐ విచారణకు ఆదేశించింది.

antarvedi 1412020 2

దీంతో బీజేపీ కూడా ఈ విషయాన్ని రాజకీయం చేయాలనుకున్నా, కుదరలేదు. అయితే ఈ రాజకీయ అంశాలు పక్కన పెడితే, భక్తుల మనోభావాలతో ఉన్న అంశం కావటంతో, సిబిఐ విచారణకు ఆదేశించటంతో, అసలు దోషులు ఎవరో బయట పడతారని, నిజం తెలుస్తుందని అందరూ భావించారు. అయితే మూడు నెలలు దాటినా, ఇప్పటికీ సిబిఐ విచారణ ప్రారంభం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం, ఫైల్స్ అన్నీ ఇచ్చి, సిబిఐకి కేసు అప్పగించినట్టు వార్తలు వస్తున్నా, సిబిఐ మాత్రం ఇప్పటికీ కేసు నమోదు చేయలేదు, విచారణ ప్రారంభించ లేదు. అంతే కాదు అసలు ఈ కేసు తీసుకుంటారో లేదో కూడా, ఇప్పటికీ తెలియదు. మరో పక్క రాష్ట్ర పోలీసులు కూడా ఈ కేసు పై విచారణ ఏమి చేస్తున్నట్టు లేరు. మరి నిజం ఎవరు చెప్తారు ? రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా, కేంద్రం పరిధిలోని సిబిఐకి ఇచ్చేసింది. మరి రాష్ట్ర బీజేపీ నేతలు, కేంద్ర పెద్దల పై ఒత్తిడి తెచ్చి, ఈ కేసు విచారణ చేయమని కోరలేరా ? రాష్ట్ర బీజేపీ ఈ విషయంలో, నిరసన తెలిపింది కదా ? సిబిఐ కేంద్ర పరిధిలోదే కదా ? మరి రాష్ట్ర బీజేపీ ఎందుకు ఒత్తిడి తీసుకు రాదు ? మొత్తానికి, దేవుడికి జరిగిన అన్యాయం ఏమిటో, ఎప్పుడు బయటకు వస్తుందో, వేచి చూడటం తప్ప, ఏమి చేయలేం.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ప్రస్తుతం ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కన్నా, ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ తోనే ఎక్కువ ముప్పు ఉన్నట్టు ఉంది. ఆయన పదవి గడువు మార్చ్ 2021 వరకు ఉంటుంది. అప్పటి వరకు పంచాయతీ , మున్సిపల్ ఎన్నికలు జరగకుండా ప్రభుత్వం అనేక పావులు కదుపుతుంది. ఈ ఏడాది మార్చ్ లో, దేశంలో క-రో-నా ఎంటర్ అయిన సమయంలో దేశం మొత్తం జనతా కర్ఫ్యూ పెట్టే నిర్ణయం తీసుకోవటం, ప్రపంచటం మొత్తం వణికిపోవటం, ఎలా ఎదుర్కోవాలో ఐడియా లేకపోవటం, ప్రజలకు కూడా సరైన అవగాహన లేకపోవటంతో, అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసారు. అయితే ఆ సందర్భంలో జగన్ మోహన్ రెడ్డి, నిమ్మగడ్డను కులం పేరుతో ఎత్తి చూపి, కరోనా చాలా చిన్నది అంటూ, చెప్పుకొచ్చారు. ఆ తరువాత, నిమ్మగడ్డను తొలగించారు. అప్పట్లో ఇది ఒక సంచలనం. రాజ్యాంగ పదవిలో ఉన్న వారిని, ప్రభుత్వం తొలగించటంతో అందరూ ఆశ్చర్యపోయారు. చివరకు సుప్రీం కోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలటంతో, మళ్ళీ నిమ్మగడ్డ వచ్చారు. అయితే ఈ సారి క-రో-నా పై ప్రజలకు అవగాహన వచ్చింది, ప్రభుత్వానికి క్లారిటీ వచ్చింది, కేసులు కూడా భారీగా తగ్గిపోయాయి. బీహార్ లో అసెంబ్లీలో ఎన్నికలు జరిగాయి, రాజాస్థాన్, హైదరాబాద్ లో స్థానిక ఎన్నికలు జరిగాయి. కర్ణాటక, కేరళ రెడీ అవుతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టారు నిమ్మగడ్డ. ఫిబ్రవరిలో ఎన్నికలు అని ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అయితే ప్రభుత్వం మాత్రం సెకండ్ వేవ్ వస్తుంది అంటూ కోర్టుకు వెళ్ళింది.

nimmagadda 13122020 2

అయితే కోర్టు మాత్రం, మేం జోక్యం చేసుకోలేం అని చెప్పింది. అయితే ఈ సమయంలో సుప్రీం కోర్టుకు వెళ్ళినా ప్రభుత్వానికి అనుకూల ఫలితం వచ్చే అవకాసం లేదు. అందుకే ప్రభుత్వం తమ వద్దకు వచ్చిన ఒక నివేదికకు ఇప్పుడు వాడి, ఎన్నికల వాయిదాకు రెడీ అవుతుంది. ప్రభుత్వానికి వైద్య నిపుణులు ఒక నివేదిక ఇచ్చారు. అందులో తేదీలు వేసి మరీ సెకండ్ వేవ్ వస్తుందని చెప్పారు. జనవరి 15-మార్చి 15 మధ్యలో సెకండ్ వేవ్ వచ్చే అవకాసం ఉందని, జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 25 క్రిస్మస్ నాడు ఇళ్ళ పట్టాలు ఇచ్చేసిన తరువాత, నిబంధనలు కఠినంగా అమలు కానున్నాయి. న్యూ ఇయర్ వేడుకలు కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సరిగ్గా మార్చ్ 15తో సెకండ్ వేవ్ అంతం అవుతుందని ఆ నివేదిక చెప్తుంది. అంటే అప్పటికి నిమ్మగడ్డ పదవీ కాలం అయిపోతుంది. ప్రభుత్వం ఈ నివేదికను కోర్ట్ ముందు ఉంచి, ఎన్నికల వాయిదా కోరే అవకాసం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ నివేదిక, ఎలక్షన్ కమిషన్ కూడా పంపారని సమాచారం. మరి ప్రభుత్వం వేసిన ఎత్తు ఫలిస్తుందా ? ఎన్నికలు మార్చి వరకు వాయిదా పడతాయా ? చూడాలి మరి...

బీజేపీతో పవన్ కళ్యాణ్ కలిసిన దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ కు ఏమి ఉపయోగమో తేలియదు కానీ, పవన్ క్రేజ్ ని ఉపయోగించి, బీజేపీ మాత్రం హడావిడి చేస్తుంది. ఇప్పటి వరకు బీజేపీతో పొత్తుతో పవన్ కళ్యాణ్ కు ఒరిగింది ఏమి లేదు. చివరకు ఒకసారి కూడా అమిత్ షాని కానీ, మోడీని కానీ కలిసి ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి, అజెండా గురించి చర్చించింది లేదు. ఇది ఒక పక్కన పెడితే, మొన్న జరిగిన, హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో, జనసేనతో పొత్తు విషయంలో బీజేపీ చేసిన పని నచ్చక, పవన్ కళ్యాణ్ తన అభ్యర్ధుల జాబితీ కూడా ప్రకటించారు. ఎంపీ అరవింద్ కానీ, బండి సంజయ్ కానీ, జనసేనతో మాకు పొత్తు లేదని తేల్చి చెప్పారు. చివరకు అమిత్ షా ర్యాలీలో కూడా, జనసేన జెండాలో తీసేయమని చెప్పిన వీడియో బయటకు వచ్చింది. చివరకు కిషన్ రెడ్డి చర్చలు జరపటంతో, ఆ వివాదం సమసిపోయి, పవన్ కళ్యాణ్ అభ్యర్ధులను వెనక్కు పిలిపించి, బేషరతుగా బీజేపీకి మద్దతు ఇచ్చారు. అయితే వెంటనే ఢిల్లీ వెళ్లి బీజేపీ అధ్యక్షుడు నడ్డాని కలిసి, తమకు తిరుపతి ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని కోరారు. తమ బలం గురించి వివరించారు. అయితే ఎంపీ టికెట్ పై బీజేపీ, జనసేన కలిసి ఒక కమిటీ వేసి, అభ్యర్ధిని నిలపాలని నిర్ణయం తీసుకున్నాయి. బీజేపీకి అక్కడ పెద్దగా ఓట్లు లేకపోవటంతో, అందరూ టికెట్ జనసేనకే వస్తుందని ఊహించారు.

somuverraju 12122020 2

అయితే ఈ రోజు సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్ కు షాక్ ఇస్తూ, తిరుపతిలో బీజేపీ అభ్యర్ధి నుంచుంటున్నారు అంటూ బహిరంగ ప్రకటన చేసారు. ఒక పక్క కమిటీ ఏది తేల్చకుండానే, సోము వీర్రాజు చెప్పేశారు. బీజేపీకి మద్దతుగా జనసేన ఉంటుందని అన్నారు. మరి దీని పై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే వారం క్రితం పవన్ తిరుపతిలో తుఫాన్ బాధితులను పరామర్శించిన సమయంలో, అక్కడ తన క్యాడర్ బలం చూపించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీకి 6 వేల కోట్లు వస్తే, జనసేన బలపరిచిన అభ్యర్ధికి 16 వేల ఓట్లు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీకి 0.84 శాతం ఓట్లు వస్తే, పవన్ కళ్యాణ్ కు 6% ఓట్లు వచ్చాయి. ఏ విధంగా చూసుకున్న ఒక పొత్తులో ఉన్నప్పుడు, ఎంపీ లాంటి సీటు, బలం ఉన్న పార్టీకి ఇవ్వాలి. మరి బీజేపీ ఏ ఉద్దేశంతో అక్కడ జనసేనని కాదని తమ అభ్యర్ధిని నిలపాలని అనుకుంటుందో వేచి చూడాలి. అసలు కమిటీ నివేదిక రాక ముందే సోము వీర్రాజు తిరుపతిలో చేసిన ప్రకటన పై, జనసేనకు ముందే చెప్పారా ? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. దీని పై పవన్ స్పందిస్తే కానీ, జనసేన వైఖరి ఏమిటో తెలియదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇప్పటికే న్యాయవ్యవస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ప్రభుత్వం వైపు నుంచి అయితే డైరెక్ట్ గానే విమర్శలు చేస్తున్నారు. ఏకంగా జగన్ మొహన్ రెడ్డి, ఆరుగురు హైకోర్టు జడ్జిల పై చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేసి, ఆ లేఖను కూడా మీడియాకు వదిలిన సంగతి తెలిసిందే. ఇక మరో పక్క కొంత మంది వైసీపీ ప్రజా ప్రతినిధులు, ఏకంగా కోర్టుల పైనే ఆపాదిస్తూ, వ్యాఖ్యలు చేస్తున్నారు. కోర్టులను చంద్రబాబు మ్యానేజ్ చేస్తున్నారు అంటూ, ఏకంగా అసెంబ్లీలోనే జగన్ మోహన్ రెడ్డి పదే పదే చెప్పారు. అయితే కోర్టు మాత్రం, తన ముందు ఉన్న చట్టం, న్యాయం పరిధిలోనే కామెంట్ చేస్తుంది, తీర్పులు ఇస్తుంది. ఎందుకంటే అనేక కేసుల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పులని, సుప్రీం కోర్టు కూడా సమర్ధించింది. ఇది ఇలా ఉంటే ఈ రోజు సిపిఐ నేత నారయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్ పై కుట్ర చేస్తున్నారు అంటూ బాంబు పేల్చారు. కేంద్రంతో లాబీయింగ్ చేస్తూ, తమ ప్రభుత్వ విధానాలను తరుచూ తప్పు బడుతున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ ను బదిలీ చేసే పనిలో ఉన్నారని, దీనికి సంబంధించి తన వద్ద సమాచారం ఉందని, కేంద్రం కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్టు, తనకు తెలిసింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు నారాయణ. కోర్టులు ప్రభుత్వ విధానాలు చట్ట ప్రకారం లేకపోతే వాటి పై కామెంట్ చేయటం, సర్వ సాధారణం అని అన్నారు. తమ పరిధిలో లేని ఎన్నికల కమీషనర్ ని రాష్ట్ర ప్రభుత్వం తప్పించే ప్రయత్నం చేస్తే, కోర్టు దాన్ని సరి చేసిందని, ఆ చర్యను రాష్ట్ర ప్రభుత్వం తట్టుకోలేక పోతుందని అన్నారు.

narayana 13122020 2

చట్ట విరుద్ధంగా పనులు చేస్తూ, కోర్టు మమ్మల్ని అనేస్తుంది అంటూ ప్రభుత్వం అనటం కరెక్ట్ కాదని అన్నారు. అమరావతి అంశంలో కూడా కోర్టు తమకు వ్యతిరేకంగా ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఉందని నారాయణ అన్నారు. ఎలా అయితే ఎన్నికల కమిషన్ ను తప్పించారో, అలాగే ఇప్పుడు తమకు ఇష్టం లేని జడ్జిలని బదిలీ చేసే పనిలో ఉన్నారని నారాయణ అన్నారు. కేంద్రం కూడా రాజ్యసభలో వీళ్ళ అవసరం ఉంది కాబట్టి, మద్దతు ఇస్తున్నారని అన్నారు. కోర్టులు జగన్ ని వ్యతిరేకించటం లదని, ప్రభుత్వం చేస్తున్న పనులని వ్యతిరేకిస్తుందనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. చీఫ్ జస్టిస్ పై నారాయణ ఏమన్నారంటే, "ఆంధ్రప్రదేశ్ లో న్యాయ వ్యవస్థకే ఒక ప్రమాదం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరిని కూడా ట్రాన్స్ఫర్ చేయటానికి పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి చేసి, తద్వారా ఇక్కడ కోర్టు ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపుతుంది కాబట్టి, ఈ చీఫ్ జస్టిస్ మహేశ్వరిని, ట్రాన్స్ఫర్ చేయమని కేంద్రంలో లాబీయింగ్ చేస్తున్నారు. ఆ లాబీయింగ్ ప్రకారం, వాళ్ళు దాదాపుగా ఆమోదించినట్టు నాకు సమాచారం ఉంది." అని నారాయణ అన్నారు.

Advertisements

Latest Articles

Most Read