తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో ఉ-ద్రి-క్త పరిస్థితి నెలకొంది. లక్ష్మీ నరసింహ స్వామి వారి రధం దగ్ధం ఘటనకు నిరసనగా, ఈ రోజు హిందూ సంఘాలు ఆందోళనకు సిద్ధపడటం, పోలీసులు అడ్డుకోవటంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇదే సమయంలో కాలిపోయిన రధాన్ని పరిశీలించేందుకు ఈ రోజు ఆలయానికి వచ్చిన ముగ్గురు మంత్రుల తీరు పై, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆలయ పరిసరాల్లో ని-ర-స-న-ల-తో హోరెత్తించారు. ఈ క్రమంలోనే, కొందరు ని-ర-స-న-కా-రా-లు మంత్రుల కాన్వాయ్ పైకి రాళ్ళు రు-వ్వా-రు. దీంతో అప్రమ్మతమైన పోలీసులు, ముగ్గురు మంత్రులైన వెల్లంపల్లి, విశ్వరూప్, వేణుని సురక్షితంగా గుడి లోపలకు తీసుకు వెళ్ళారు. ఈ సమయంలోనే కొందరు ఆలయం లోపలకు వెళ్లేందుకు ప్రయత్నం చేసారు. మంత్రులను లోపలకు పంపిన తరువాత ఆలయ ద్వారాన్ని మూసేసినా, అక్కడ ఉన్న వారు శాంతించలేదు. బారికేడ్ లను విరగొట్టి మరీ, కల్యాణోత్సవం షెడ్డు వైపుకు దూసుకువెళ్ళారు. వీళ్ళను కంట్రోల్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేసినా, భారీగా తరలివచ్చిన వారిని నిలువరించలేక పోయారు. వైసిపీ ప్రభుత్వం పై వ్యతిరేకంగా నినాదాలు చేసారు.

antarvedi 080920202 1

ఒకేసారి ఎక్కువ మంది రావటంతో, ఒక్కసారిగా ఏమి జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం కనిపించింది. ప్రభుత్వం ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని, కానీ ప్రతి సారీ ఎదో ఒకటి జరుగుతూనే ఉందని అన్నారు. పోలీసుల విచారణ తీరు పైనా, అనుమానం వ్యక్తం చేసారు. నిస్పాక్షికంగా పోలీసులు విచరణ చేసి ఎంతటి వారు ఉన్నా, వదిలి పెట్ట కూడదని అన్నారు. అయితే 15 వ తేదీ లోపు, జరిగిన ఘటన పై పూర్తి నివేదిక తెచ్చుకుని, బాధ్యుల పై చర్యలు తీసుకుంటామని, అప్పటి వరకు టైం ఇవ్వాలి అని చెప్పటంతో, హిందూ సంఘాలు శాంతించాయి. అప్పటి వరకు ఆగి చూస్తాం అని, ప్రభుత్వం ఏమి చేస్తుందో చూస్తాం అని అన్నారు. దీని పై స్పందించిన వెల్లంపల్లి, ఎవరు బాధ్యలు ఉన్న వదిలి పెట్టం అని, ఇప్పటికే అధికారుల పై చర్యలు తీసుకున్నాం అని, విచారణ జరిగిన తరువాత, ఎవరు బాధ్యులు అయితే వారి పై చర్యలు తీసుకుంటాం అని చెప్పారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఒకప్పటి నెంబర్ 2, రాజ్యసభ సభ్యడు అయిన విజయసాయి రెడ్డికి, ఊరట లభించింది. ఆయన ఆఫీస్ అఫ్ ప్రాఫిట్ కింద లాభాదయాక పదవిలో ఉన్నారని, ఒక పక్క రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ, మరో పదవిలో ఉండటం, రాజ్యాంగానికి విరుద్ధం అని, విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని తొలగించి, ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలి అంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నేత రామకోటయ్య, విజయసాయి రెడ్డి పై రాష్ట్రపతికి గతంలో ఫిర్యాదు చేసారు. పిటీషన్ ను పరిగణించి, వాస్తవాలు చూసి, విజయసాయి రెడ్డి పై అనర్హత వేటు వెయ్యాలని కోరారు. విజయసాయి రెడ్డి ఒక పక్క రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే, ఆయన్ను ఏపి ప్రభుత్వం మరో పదవిలో పెట్టిందని అన్నారు. ఆయనకు క్యాబినెట్ ర్యాంకు ఇచ్చి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రత్యేక ప్రతినిధిగా నియమించిందని, ఆయనకు ఆ పదవి లాభదాయకమైన పదవి అంటూ, ఫిర్యాదు చేసారు. ఒక పక్క రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే, మరో పదవి కలిగి ఉండటం పై రామకోటయ్య అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆయన లాభదాయక పదవిలో కొనసాగుతున్నారు కాబట్టి అనర్ధత వెయ్యాలని రాష్ట్రపతిని కోరారు. అయితే ఫిర్యాదు పై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం, దీని పై కేంద్ర ఎన్నికల కమిషన్ అభిప్రాయం చెప్పమని కోరింది.

vs reddy 07092020 2

ఆ ఫిర్యాదుని కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫార్వడ్ చేసింది, రాష్ట్రపతి కార్యాలయం. అయితే దీని పై విచారణ చేసిన ఎన్నికల కమిషన్, విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడితో పాటుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యెక ప్రతినిధిగా ఢిల్లీలో, క్యాబినెట్ ర్యాంక్ తో ఉన్నారని, అయితే ఈ పదవి లాభదాయక పదవి కాదని, ఆయన ఈ పదవి కోసం ఎలాంటి జీతం తీసుకోవటం లేదని, ఇది ఆఫీస్ అఫ్ ప్రాఫిట్ కిందకు రాదని, ఎలక్షన్ కమిషన్ తేల్చింది. ప్రిపెన్షన్ ఆఫ్ డిస్‌క్వాలిఫికేషన్ యాక్ట్ అనేది, ఈ పిటీషన్ కు వర్తించదని, రాష్ట్రపతికి విన్నవించింది. దీంతో ఎన్నికల సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం, విజయసాయి రెడ్డి అనర్హత పిటీషన్ ను, రాష్ట్రపతి కొట్టేసారు. దీంతో విజయసాయి రెడ్డికి ఊరట లభించింది. అయితే ఆయనను ముందుగా ప్రత్యెక ప్రతినిధిగా నియమించినప్పుడు, ఈ పదవి లాభదాయక పదవిలోనే ఉంది. ప్రతిపక్షాలు గొడవ చేయటంతో, వెంటనే ఆ నియామకం రద్దు చేసి, ప్రత్యెక ప్రతినిధి పదవిని, లాభదాయక పదవి నుంచి మినహాయింపు ఇచ్చి, మళ్ళీ విజయసాయి రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే.

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు, వైసీపీ నేతలకు గట్టిగానే తగిలాయి. మంత్రుల నుంచి, నేతల వరకు అందరూ ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల గురించి, చర్చ చేసిన విషయం తెలిసిందే. క-రో-నా రాకపోయి ఉండి ఉంటే, ఈ పాటికే ఆ అంశం ఒక కొలిక్కి వచ్చేది. అయితే ఈ ప్రక్రియ కొంచెం నెమ్మదించింది. అయితే గత వారం ప్రధాన మంత్రి కార్యాలయంలో, ఒక దేశం, ఒక ఎన్నికల జాబితా పై ఒక ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. దీంతో ఈ ప్రక్రియ జమిలీ ఎన్నికల కోసమే అని ప్రచారం జరుగుతుంది. జమిలీ ఎన్నికలు జరిగితే 2022 చివర్లో కానీ, 2023 మొదట్లో కానీ జరిగే అవకాశం ఉంది. 2022లో జరిగే ఎన్నికలు ఆపేసి, అలాగే 2024లో జరిగే రాష్ట్రాలు ఎన్నికలు ముందుగా పెట్టి, ఒకే దేశం, ఒకే ఎన్నిక జరపాలని, తద్వారా ఖర్చు ఆదా అవుతుందని, అభివృద్ధి పనులకు ఆటంకం కలగదు అని, కేంద్రం యోచన. ఈ చర్చ జరుగుతూ ఉండటంతో, చంద్రబాబు కూడా ఇదే విషయం తన ప్రెస్ మీట్ లో చెప్పారు. ఈ ప్రభుత్వం చేస్తున్న పనులు, అప్రజాస్వామికంగా ఉన్నాయని, 2023లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాసం ఉంది కాబట్టి, తొందరగానే మనకు విముక్తి లభిస్తుంది అని, తన ప్రెస్ మీట్ లో చెప్పారు.

cbn 07092020 2

అయితే ఈ విషయం పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. చంద్రబాబు ప్రెస్ మీట్ అవ్వగానే బొత్సా ప్రెస్ మీట్ పెట్టి, జమిలీ ఎన్నికలు వచ్చే అవకశమే లేదు, ఆ వాతావరణమే లేదని, చంద్రబాబు వెంటనే కుర్చీ ఎక్కేయాలనే ఆతృతలో ఉన్నారని అన్నారు. ఇక మిగతా నేతలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి, జమిలీ ఎన్నికలు అంటూ చంద్రబాబు చేసిన ప్రకటన పై అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇందులో ముఖ్యంగా చంద్రబాబు మాటలు కనుక బలంగా ప్రజల్లోకి వెళ్తే, తమకు నష్టం అనే భావనలో వైసీపీ నేతలు ఉన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు, కేవలం అప్పు చేసి, చేస్తున్న సంక్షేమం మాత్రమే కొంత ఊరట, ఇప్పుడు ఎన్నికలు ముందే వచ్చేస్తే, అంతకు ముందు ఏడాది కాలం నుంచే ఎన్నికల వాతావరణం వచ్చేస్తుంది. ప్రజలకు చూపించటానికి, తాము చేసిన పని ఏమి ఉండదు అని వైసీపీ నేతల భావన. అంతే కాకుండా, టిడిపి నుంచి బయటకు వచ్చేద్దాం అనుకునే నేతలు ఎవరైనా ఉంటే వారు కూడా, ఆలోచనలో పడతారు. అందుకే చంద్రబాబు జమిలీ అనగానే, దాన్ని డైల్యూట్ చేసే పనిలో పడింది వైసీపీ. చంద్రబాబు చెప్పినా, జగన్ చెప్పినా, పైన ఉన్న ప్రధాని మోడీ ఆగే పని ఉండదు. ఆయన ఏమి అనుకుంటే, అది చేసి తీరుతారు. చూద్దాం ఏమి జరుగుతుందో.

సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో శనివారం అర్థరాత్రి అపచారం జరిగింది. మంటల్లో స్వామివారి రథం పూర్తిగా కాలిపోయింది. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి రథాన్ని దుండగులు నిప్పు పెట్టారా..? లేక ప్రభుత్వం చెప్తున్నట్టు తేనెపట్టు గూర్చి పెట్టిన మంట వల్ల దగ్గమైయిందా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రసిద్ది వేవాలయం దక్షిణ కాశీగా వెలుగొందుతున్న అంతర్వేది శ్రీ లక్ష్మీసింహస్వామివారి కల్యాణోత్సవం అనంతరం రథప్తమిరోజున లక్షలాదిమంది భక్తులతో ఆలయం వద్ద నుంచి గుర్రాలక్కమ ఆలయం వరకూ రథోత్సవం జరుగుతుంది. అనంతరం రథాన్ని షెడ్డులో భద్రంచేస్తారు. 62 ఏళ్ల చరిత్ర కలిగిన స్వామివారి రథం అర్థరాత్రి సమయంలో కాలిపోవడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి రథం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనతో స్వామివారి ఆలయం వద్ద దగ్ధమైన రథాన్ని అధికారులు, మంత్రులు, వివిధ రాజకీయ పార్టీ నేతలు చేరుకుని పరిశీలించారు. పోలీసులు అన్ని కోణాల్లో ఈ రధం దగ్ధం పై విచారణ చేస్తున్నారు.

antarvedi 07092020 2

అయితే వివిధ రాజకీయ పక్షాలు, హిందూ సంస్థలు, ఈ ఘటన పై ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయం వద్ద ఉన్న సీసీ కెమేరాలు ఎందుకు పని చేయకుండా ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనపై ప్రభుత్వం పూర్తి దర్యాప్తు చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన అంతర్వేది లక్ష్మీసనసింహస్వామివారి రథం కాలిపోవడంతో మాజీ మంత్రి, తెలుగుదేశం నేత గొల్లపల్లి సూర్యారావు, మాజీ మంత్రి చినరజాప్ప పరిశీలించారు. జరిగిన ఘటనపై జ్యూడిషియల్ విచారణ చేయాలనీ కోరారు. ఘటన వివరాలు, జరిగిన తీరు పై ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నివేదిక ఇస్తామని అన్నారు. ఇక వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు అయితే, ఈ ఘటన పై కుట్ర కోణం ఉందని నమ్ముతున్నట్టు చెప్పారు. గత ఏడాది కాలంలో ఒక పధ్ధతి ప్రకారం, హిందూ దేవాలయాల పై దాడులు జరుగుతున్నాయని, పిచ్చోడు మంట అంటించాడని ఒకసారు, తేనెతుట్టె అని ఒకసారి చెప్తున్నారని, జరుగుతున్న ఘటనల పై సీరియస్ గా రియాక్ట్ అవ్వాలని అన్నారు. ఇక ప్రభుత్వం, ఆలయ ఈవోని తప్పించింది.

Advertisements

Latest Articles

Most Read