ఒక పక్క ప్రత్యెక హోదా పై నిలదీశారు... దొలేరో నగరం గుట్టు విప్పి, అమరావతి ఏమి పాపం చేసిందని ప్రశ్నించారు... రాష్ట్ర బీజేపీ నేతలు, కేంద్ర బీజేపీ నేతలు చెప్తున్న కాకమ్మ కధల గుట్టు విప్పారు.. జీవీఎల్ లాంటి నేతలను, మహా మూర్తి లైవ్ లో కడిగిపారేస్తే, ఏమి చెయ్యాలో తెలియక నీది తెలుగుదేశం ఛానల్ అంటూ ఎదురు దాడి చేసారు. మా ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయం పై, మేము ప్రశ్నిస్తుంటే, మీకు మేము పచ్చ చానల్స్ అయ్యామా అంటూ మహా మూర్తి అడిగే ప్రశ్నలకు ఒక్క బీజేపీ నాయకుడు దగ్గర సమాధానం లేదు.. ఇక మహా మూర్తిని అడ్డుకోవటం తమ వళ్ల కాదని, ప్రతి రోజు ఆయన చేసే ర్యాగింగ్ తట్టుకోలేమని, మహా మూర్తి వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేమని బీజేపీ అంచనాకు వచ్చి, ఒక నిర్ణయం తీసుకుంది. అదే మహామేత వైఎస్ ఒకప్పుడు తీసుకున్న నిర్ణయం...

mahaa 11062018 2

ఆ రెండు పత్రికలు అని ఎలా వైఎస్, రెండు పేపర్లను చూడద్దు అన్నాడో, అలాగే ప్రజల గొంతుకుగా ఉన్న మీడియాపై బీజేపీ పార్టీ జులుం చూపించింది
. బీజేపీ ఇచ్చిన హామీలు నేరవేర్చని కారణంగా దాన్ని ప్రశ్నించినందుకు మహా న్యూస్ ని బాయ్ కాట్ చేసింది. ఐదు కోట్ల మంది ప్రజలు పక్షాన పోరాటం చేసినందుకు మీడియాకి దొరికిన ఒక అరుదైన గౌరవం ఇది. ఇక మీదట బీజేపీ నాయకులు, కార్యకర్తలు మహా న్యూస్ చర్చ కార్యక్రమాలకు మరియు ఇతర కార్యక్రమాలకు హాజరు కాకూడదని తీర్మానం చేసుకున్నారు విజయవాడ వేదికగా జరిగిన బీజేపీ రాష్ట్ర స్ధాయి సమావేశంలో మహా న్యూస్ పై ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు...ఏపీ హక్కుల కోసం ప్రజల తరపున పోరాటం చేస్తున్న మహా న్యూస్ ఛానెల్ ని బీజేపీ పార్టీ బాయ్ కాట్ చేయాలని తీర్మానించారు...వాళ్ళు ఇచ్చిన హామీలను నేరవేర్చలేక, ఐదు కోట్ల మంది ప్రజలను మోసం చేస్తూ ముందుకెళ్తున్న బీజేపీ ని ప్రశ్నించినందుకు మహా న్యూస్ కి బీజేపీ పార్టీ ఇచ్చిన గౌరవం ఇది..

mahaa 11062018 3

ప్రజల పక్షాన నిలబడి, ప్రతి జిల్లాలో ఢిల్లీతో డి ఆంధ్ర రెడీ కార్యక్రమంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రజల గొంతుకై పోరాటం చేయినందుకు బీజేపీ పార్టీ మహా న్యూస్ కి గొప్ప సన్మానం చేసింది...బీజేపీ పార్టీ చేస్తున్న తప్పులను, ఆంధ్రప్రదేశ్ కి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల తరపున ప్రసారం చేసినందుకు ఈవిధంగా ముర్కంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్యన్ని అపహాస్యం చేసినట్టే...మహా న్యూస్ డిబేట్స్ కి బీజేపీ నాయకులు వస్తే ఏపీ కి బీజేపీ పార్టీ ఇచ్చిన హామీలను ఎందుకు నేరవేర్చలేక పోయారని ప్రశ్నిస్తున్నారని , వాటికి వారి దెగ్గర సమాధానం లేకపోయేసరికి ఈవిధంగా మొహం చాటేస్తున్నారు... అయితే మహా న్యూస్ మాత్రం, వీరికి గట్టిగా సమాధానం ఇచ్చింది... బీజేపీ పార్టీ బెదిరింపులకు మేము బెధరం, అధరం, మేము ఇప్పుడు, ఎప్పుడు , ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాము అని చెప్పింది.

రాష్ట్రానికి, కేంద్రం చేస్తున్న అన్యాయానికి నిరసనగా, తన పుట్టిన రోజు నాడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అదే స్పూర్తితో, ఇప్పుడు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ తన పుట్టిన రోజు నాడే నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. హేతుబద్ధత లేని విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌పై అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ తన పుట్టిన రోజు నాడే నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చాలని కోరుతూ మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిరాహార దీక్ష చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.

narendramodi 11062018 2

ఈ మేరకు అనకాపల్లిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో అవంతి మాట్లాడుతూ.. ఈ నెల 12న (రేపు) తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోకుండా దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఏప్రిల్‌ 20న తన పుట్టిన రోజు నాడే విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో సీఎం చంద్రబాబు నిరాహార దీక్షలాగే, తానూ దీక్ష చేస్తున్నట్టు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ చెప్పారు.

narendramodi 11062018 3

ప్రత్యేక హోదా, లోటు భర్తీ, పోలవరం నిర్మాణం, రైల్వే జోన్ ఏర్పాటు, గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ-పెట్రో కెమికల్ కాంప్లెక్స్, అమరావతి నిర్మాణం, జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు, దుగరాజుపట్నం పోర్టు, శాసనసభ సీట్ల పెంపు, కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖపట్నం-విజయవాడల్లో మెట్రో రైలు, అమరావతికి రైలు-రహదారి అనుసంధానం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సాయం, పొరుగు రాష్ట్రం నుంచి విద్యుత్ బకాయిల వసూళ్లు, షెడ్యూల్ సంస్థల విభజన, గ్రేహౌండ్ సెంటర్ ఏర్పాటు ఇలా ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014’లో పేర్కొన్న 18 అంశాలపై, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, మన రాష్ట్రాన్ని మోసం చేసింది.

మాకు ఎదురు తిరిగాడు అనే కోపంతో, చంద్రబాబుని దించటానికి, రెండు నెలల క్రితం ఆపరేషన్ గరుడని, బీజేపీ మొదలి పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో అనేక మందిని కూడగట్టి, చంద్రబాబుని అన్ని వైపుల నుంచి నిరాధార ఆరోపణలతో, నిందించే ప్రయత్నం చేసి, ప్రజల్లో ఆ అబద్ధాలు, నిజం అనే ప్రచారం చేపిస్తుంది బీజేపీ.. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ, తిరుమల గొడవ... ఇప్పటికే పవన్ కళ్యాణ్, జగన్, ముద్రగడ, ఐవైఆర్, ఉండవల్లి లాంటి ఉద్దండులను ఈ ఆపరేషన్ గరుడలోకి తీసుకువచ్చిన బీజేపీ, ఇప్పుడు తాజాగా తెలంగాణా నాయకుడు మోత్కుపల్లిని కూడా, ఆపరేషన్ గరుడలోకి ఆహ్వానించింది.. ఈ విషయం పై తదుపరి ఆదేశాలు ఇవ్వటానికి, ఆపరేషన్ గరుడలో సీనియర్ మెంబెర్, ఈ రోజు మోత్కుపల్లి ఇంటికి వెళ్ళరు..

motkupalli 110692018 2

ఇంతకీ ఆ సీనియర్ ఎవరు అనుకుంటున్నారా ? మన A2 విజయసాయి రెడ్డి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ మోత్కుపల్లి ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ మీడియాను చూసి వాహనం దిగకుండానే విజయసాయిరెడ్డి వెళ్లిపోయారు. మోత్కుపల్లికి తదుపరి ఆదేశాలు ఇవ్వటం కోసమే విజయసాయి రెడ్డి అక్కడకు వెళ్లినట్టు తెలుస్తుంది. అయితే, అక్కడ మీడియా ఉండటం గమనించి అక్కడ నుంచి పరారయ్యాడు. మీడియాని చూసి వెళ్ళిపోయాడు అంటేనే, అక్కడ ఏ లెవెల్ లో కుట్ర ప్లాన్ చేసారో అర్ధమవుతుంది. కొన్ని రోజుల క్రితం మోత్కుపల్లిని, ముద్రగడ కలిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయసాయి రెడ్డి కలవటానికి వెళ్లారు.

motkupalli 110692018 3

ఇప్పటికే అన్ని వైపుల నుంచి, అస్త్రాలను చంద్రబాబు మీదకు వదిలామని, పెద్దగా ఉపయోగం ఏమి లేదని, అందుకే తెలంగాణా నేత నుంచి కూడా చంద్రబాబు పై విమర్శలు చేస్తే, బాగుంటుంది అని, మీరు కూడా రండి అంటూ, మోత్కుపల్లిని, ఆంధ్రప్రదేశ్ కు ఆహ్వానించారు ముద్రగడ.. దీంతో మోత్కుపల్లి కూడా నేను ఆంధ్రప్రదేశ్ రాష్టానికి వస్తానని, ఒక రధయాత్ర చేస్తానని, చంద్రబాబుని దించేలానే మీ ప్రయత్నంలో నేను భాగస్వామిని అవుతానని, ముద్రగడకు మాట ఇచ్చారని తెలుస్తుంది.. బహశా ఆ విషయంలోనే, విజయసాయి రెడ్డి, మోత్కుపల్లిని కలవటానికి వెళ్లి ఉంటారని తెలుస్తుంది. ఇదే విషయం ఒక టిడిపి సీనియర్ నాయకుడు వద్ద ప్రస్తావించి, స్పందన కోరగా, ఆయన మాట్లాడుతూ, "ఇందులో చెప్పటానికి ఏముంది, జోగి జోగి రాసుకుంటే బూడిద రాల్తుంది" అని సింగల్ లైన్ లో తేల్చేసారు...

మన రాష్ట్రంలో ఏడుపుగొట్టు గాళ్ళు ఎక్కువ... రాష్ట్రం నవ్వితే, వాళ్ళు ఏడుస్తారు... రాష్ట్రం ఏడిస్తే, వాళ్ళు నవ్వుతారు... ఇలాంటి వాళ్ళు, ఒకడికి ఇద్దరు తయారాయ్యారు... డయాఫ్రమ్‌వాల్‌ పూర్తయింది అనే సంతోషంలో ప్రజలు ఉంటే, అసలు ఆ డయాఫ్రమ్‌వాల్‌ ఎక్కడా అంటాడు ఒకడు... అదేమన్నా గొప్ప విషయమా అంటాడు ఇంకొకడు... అసలు, అదేంటో తెలుసుకోండి ముందు... డయాఫ్రమ్‌వాల్‌... ఇంటి నిర్మాణానికి పునాది ఎలాగో ప్రాజెక్టుకు డయాఫ్రమ్‌వాల్‌ అలాంటిది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత సంక్లిష్టతరమైన నిర్మాణం ఇది. ఎందుకంటే 194 టీఎంసీల నీరు నిల్వ ఉండే చోట నదీగర్భం నుంచి సీపేజ్‌ (లీకు) కాకూడదు. భవిష్యత్తులో భూకంపాలు వచ్చినా ప్రాజెక్టు తట్టుకోవాలి. అటువంటి డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణం పూర్తయ్యింది. చంద్రబాబు ఏ పని చేపట్టినా అది రికార్డు సృష్టించాల్సిందే.

polavaram 11062018 2

మొత్తం 1396.60 మీటర్లు పొడవు,1.5 మీటర్లు వెడల్పు ఉండే ఈ డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణం కూడా 412 రోజుల్లో పూర్తయ్యింది. మొత్తం 1.18 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను వినియోగించారు. పోలవరం వద్ద నదీ గర్భం లోతు 40 మీటర్ల నుంచి 93.50 మీటర్లు ఉంటుంది. అక్కడివరకూ తవ్వుకుంటూ వెళ్ళి రాయి తగిలాక ఇంకో రెండుమీటర్లు తవ్వి అక్కడి నుండి కాంక్రీట్‌ వేసుకుంటూ వచ్చారు. దీనికి ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ వాడడం మరో ముఖ్యాంశం. సిమెంటు, ఇసుక అందులో తక్కువ మోతాదులో కంకర వేసి బెంటోనైట్‌ మిశ్రమాన్ని కలపడాన్ని ప్లాస్టిక్‌ కాంక్రీట్‌గా వ్యవహరిస్తారు. 2017 ఫిబ్రవరి 1న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పనులను ప్రారంభించారు. తొలుత జులై 24 వరకు పని జరిగింది. ఆ తరువాత గోదావరిలో నీరు పెరగడం, వాతావరణం సహకరించక పోవడంతో పనులు నిలిపివేసి యంత్రాలను ఒడ్డుకు ఎక్కించారు.

polavaram 11062018 3

వరదలు తగ్గిన తరువాత 2017 అక్టోబరు 9న ప్రారంభించి నవంబరు 15 వరకు పని చేశారు. అనివార్య కారణాల వలన మరో 5 రోజులు పనులు నిలిచిపోవడంతో నవంబరు 20న తిరిగి ప్రారంభించి 2018 జూన్‌ తొమ్మిది నాటికి మిగిలిన పనుల్ని పూర్తి చేశారు. ఇందుకోసం ఎల్‌అండ్‌టీ బావర్‌ కంపెనీతో ట్రాన్స్‌స్ట్రాయ్‌ గుత్తేదారు ఒప్పందం కుదుర్చుకున్నారు. పశ్చిమజర్మనీ నుంచి ఆధునిక యంత్ర పరికరాలు గ్రాబర్‌లు, కట్టర్‌లు, భారీ క్రేన్‌లు తెప్పించారు. ఆ దేశానికి చెందిన నిపుణులే పోలవరంలో మకాం వేసి పనులు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, చంద్రబాబు వంటి నాయకుడి సంకల్పం కలిసిరావడంతో అసాధ్యమనుకున్నది సుసాధ్యమైంది. చంద్రబాబు సత్తా ఏమిటో మరోసారి రుజువయ్యింది.

Advertisements

Latest Articles

Most Read