విశాఖలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కార్యాలయంగల ఏకైక సంస్థ డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డిసిఐ)లో ప్రగతి పరుగులు తీస్తోంది. గతంలో సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైన లాభాలు ఈ ఏడాది రెట్టింపుకుపైగా పెరగడం విశేషం. దేశంలోని పోర్టులు, విదేశాల నుంచి పెద్ద ఎత్తున డ్రెడ్జింగ్‌ పనుల ఆర్డర్లను సాధిస్తూ శరవేగంగా డిసిఐ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది.. ఉద్యోగుల సమష్టి కృషి, పనుల ప్రగతి సాధన దిశగా అంకితభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 2018లో డిసిఐ ఆర్జించిన లాభం 16.64 కోట్లు. 2017లో కేవలం రూ.7.12 కోట్లే ఆర్జించింది. ఉద్యోగులు అత్యంత శ్రద్ధాసక్తులతో ఈ కృషిని సాధించారన్నది సర్వత్రా చర్చ జరుగుతోంది.

dredging 11062018 2

హాల్దియా (కోల్‌కతా) షిప్‌యార్డు పనులను, కొచ్చిన్‌ (కేరళ) నేవీ, షిప్‌యార్డు, పోర్టు పనులను, పరదీప్‌ (ఒడిశా) షిప్‌యార్డు పనులనూ ముమ్మ రంగా చేస్తోంది. విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌ (విపిటి) కూడా రూ.కోట్లతో బీచ్‌ నౌరిషింగ్‌ పనులు తాజాగా అప్పగించింది. విశాఖలోని గంగవరం పోర్టు పనులు, ముంబయి పనులను చేపట్టేందుకు సిద్ధ మవుతోంది. కోల్‌కతా పోర్టు ట్రస్ట్‌ నిర్వహణ (డ్రెడ్జింగ్‌) పనులు రూ.1119కోట్లు, కొచిన్‌ పోర్టు ట్రస్ట్‌ ప్రాజెక్టు ఛానెళ్ల నిర్వహణ పనులు రూ.88.51 కోట్లు 2018లో మంజూరయ్యాయి. పరదీప్‌ పోర్టుకు చెందిన పనులను 2017-18లో ఏడాదిపాటు రూ.67.15కోట్లతో చేపట్టింది. కొచ్చిన్‌ షిప్‌యార్డు ఐదేళ్ల ప్రాజెక్టులో భాగంగా 2015-16లోనే రూ.110కోట్లతో షిప్‌యార్డు మెయిన్‌టెనెన్స్‌ పనులను డిసిఐకి అప్పగించింది. మోంగ్లా పోర్టు (బంగ్లాదేశ్‌) పనులు జరుగు తున్నాయి.

dredging 11062018 3

ప్రభుత్వ రంగంలో లాభాలను ఆర్జించే 'మినీ రత్న' కేటగిరికి చెందిన డిసిఐను కేంద్రంలోని నరేంద్రమోడీ మంత్రి మండలి 2017 నవంబరు ఒకటిన 73.47 శాతాన్ని వ్యూహాత్మక అమ్మకానికి పెట్టింది. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విస్తృత స్థాయిలో ఉద్యమాలను చేపట్టడం, పనుల ప్రగతి ని కూడా ఏకకాలంలో ముందుకు తీసు కెళ్తూ లాభాల బాటలోకి నెట్టిన ఘనత ఉద్యోగులదనే చెప్పాలి. విశాఖ కేంద్రంగా గతేడాది నవంబరు 28 నుంచి 40 రోజులపాటు ఉద్యోగులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసనలు, ధర్నాలు ఆందోళనలను చేపట్టారు. కంపెనీ ప్రగతిని చూసి కేంద్రం వ్యూహాత్మక సేల్‌ని నిలిపివేయాలంటూ ఉద్యమాలను నిర్వహించారు.. డిసిఐకి ఆర్థికంగా నష్టం చేసే ఆర్డర్లను ప్రభుత్వాలు చేసినా సరే 'ప్రాఫిట్‌ మేకింగ్‌ కేటగిరీ -1 మినీ రత్నగా డిసిఐ ప్రభుత్వ రంగంలో 1976 నుంచి వెలుగొందుతోంది.

రాష్ట్రంలో అందరికీ పింఛన్లు ఇస్తున్నామని, ఒంటరి మహిళలకు కూడా పింఛను ఇవ్వనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారందరికీ పింఛన్లు ఇస్తున్నామన్నారు. నవ నిర్మాణ దీక్ష సందర్భంగా ఒక మహిళ 'అందరినీ ఆదుకుంటున్నారు.. నన్ను మాత్రమే వదిలేశారు' అని తనతో చెప్పిందన్నారు. అది నిజమేననిపించిందని, త్వరలోనే ఒంటరి మహిళకూ పింఛను ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అయితే పెళ్లయి, భర్త వదిలేసిన వారికే ఇస్తామని స్పష్టం చేశారు. ఏడు రోజులపాటు జరిగిన నవనిర్మాణ దీక్షలు, మహా సంకల్ప యాత్ర, గ్రామ దర్శిని కార్యక్రమాలు కొత్త అనుభూతిని ఇచ్చాయన్నారు. నవ నిర్మాణ దీక్షలు 16,375 గ్రామాల్లో నిర్వహించారని, ప్రతీ రోజూ 30 లక్షల నుండి 35 లక్షల వరకూ ఈ సభలకు ప్రజలు తరలివచ్చారన్నారు.

cbn 11062018 2

రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని గ్రామ సభల్లో పాల్గొని ప్రజలతో మమేకమయ్యానని, అభివృద్థి పనులపై ఆరా తీశానని తెలిపారు. ప్రభుత్వ పథకాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారన్నారు. 40 ఏళ్ళ నా రాజకీయ అనుభవంలో ఈ నాలుగేళ్ళలో చేసిన అభివృద్ధే చాలా తృప్తి నిచ్చిందన్నారు. రాష్ట్రమంతా సిమ్మెంట్‌ రోడ్లు వేయడం ఒక చరిత్ర అని, ఇంకా మిగిలిన వాటిని కూడా ఈ ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. 19 లక్షల ఇళ్లలో కొన్ని పూర్తి చేశామని, మిగిలినవి ఈ ఏడాది పూర్తి చేస్తామన్నారు. తాను పాదయాత్ర చేసిన సందర్భంగా తాగునీటి సమస్య, మైళ్ళ దూరం నీటి కోసం వెళ్ళే పరిస్థితులను గమనించానన్నారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదని, అన్ని నీటి వసతులూ కల్పించామన్నారు. రాష్ట్రంలో 7లక్షల 25వేల పంట కుంటలు తవ్వడం వల్ల 2 మీటర్ల మేర భూగర్భ జలాల్ని పెంచగలిగామన్నారు.

cbn 11062018 3

దీనివల్ల రూ.500 కోట్లు విలువైన కరెంట్‌ను ఆదా చేశామని, లక్షలాది ఎకరాలకు నీరిచ్చే వీలు కలిగిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అండర్‌ గ్రౌండ్‌ పనులు పూర్తయ్యాయని, ఇప్పటికే డయాఫ్రం వాల్‌ని పూర్తి చేశామన్నారు. మైక్రో ఇరిగేషన్‌లో 90 శాతం సబ్సిడీ ఇచ్చిన ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. బిజెపి, వైసిపి నాటకాలను ప్రజల ముందు పెడతామన్నారు. ఇసుక, మట్టి గురించి విమర్శలు చేసే జగన్‌, బొత్సా, విజయసాయిరెడ్డిలు రూ.45వేల కోట్ల గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. అవినీతి పరులకు తనను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్‌ చేసిన తప్పుకు ప్రజలు శిక్షించారని, అదే పరిస్థితి వైసిపి, బిజెపిలకు ఎదురవుతుందని చెప్పారు. విభజన హామీలపై తమ పోరాటం ఆగదని సిఎం అన్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం, కాకినాడలో దివీస్‌, ఫుడ్‌పార్కు వంటి పరిశ్రమలు రాకుండా అడ్డుపడుతూ రైతులను రెచ్చగొడుతున్నారన్నారు.

రాష్ట్రాల హక్కులపై మరో దాడికి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. రాష్ట్రాలకు కీలక ఆదాయ వనరుగా ఉన్న సహజవాయువును జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదించింది. త్వరలో జరగనున్న జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశంలో ఈ విషయాన్ని చర్చించాలని నిర్ణయించింది. జిఎస్‌టి కౌన్సిల్‌ సంయుక్త కార్యదర్శి ధీరజ్‌ రస్తోగి ఈ విషయాన్ని ధృవీకరించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక వర్క్‌ షాపులో మాట్లాడుతూ ఆయన 'జిఎస్‌టి పరిధిలోకి సహజవాయువును ప్రయోగాత్మకంగా తీసుకురావాలని భావిస్తున్నాం. విమాన ఇంధనాన్ని కూడా భవిష్యత్‌లో జిఎస్‌టిలోకి తెచ్చే అవకాశం ఉంది' అని చెప్పారు. ఈ నిర్ణయంతో జిఎస్‌టి బిల్లు ఆమోదం కోసం పెట్రో ఉత్పత్తులతో పాటు, మద్యం విక్రయాలను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురామని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన మాటను తప్పినట్టైంది.

center 11062018 2

కేంద్ర సర్కారు ఈ తీరుపట్ల పలు రాష్ట్ర్ర ప్రభుత్వాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని, రాష్ట్రా లకు కనీస సమాచారం ఇవ్వకుండా ఇటువంటి ప్రకటన ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. గత ఆర్థిక సంవత్సరంలో సహజవాయువు ద్వారా రాష్ట్ర ఖజానాకు 523 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తాజా ప్రతిపాదన అమలులోకి వస్తే ఈ మొత్తాన్ని నష్టపోవాల్సివస్తుంది. అసలే ఆర్థిక కష్టాలతో సతమతమౌతున్న రాష్ట్రానికి ఇది మరింత భారంగా మారనుంది. యనమల రామకృష్డుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సహజవాయువులను కూడా జిఎస్‌టిలోకి చేర్చడం సరికాదని వ్యాఖ్యానిరచారు.

center 11062018 3

వివిధ అరశాలపై పత్రికా ప్రకటనలు జారీ చేయడానికి మురదుగా జిఎస్‌టి కోసం ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం అనుమతి తీసుకోవాల్సి ఉరటురదని ఆయనగుర్తు చేశారు. ప్రధానంగా కృష్ణా, గోదావరి బేసిన్‌లోనున్న సహజవాయు నిక్షేపాల ద్వారా రాష్ట్రానికి కొరత రాయల్టీ నిధుల ఆదాయం లభిస్తోరది. తాజా నిర్ణయం రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉరదన్నారు. 'పెట్రో ఉత్పత్తులు చాలా కీలకమైనవి. కేంద్ర ప్రభుత్వంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలకూ వీటి ద్వారా వచ్చే ఆదాయం చాలా ముఖ్యమైనది. అయితే, సహజవాయువు చాలా భిన్నమైన అంశం.దీనిని జిఎస్‌టి పరిధిలోకి రావడానికి దాదాపుగా ఏకాభిప్రాయం ఉంది. అందువల్ల జిఎస్‌టిలోకి వచ్చే పెట్రో ఉత్పత్తుల్లో ఇది మొట్టమొదటిదైంది. భవిష్యత్‌లో ఈ జాబితా మరింత పెరగవచ్చు' అని జిఎస్‌టి కౌన్సిల్‌ కార్యదర్శి ధీరజ్‌ రస్తోగి అన్నారు.

అగ్రిగోల్డ్‌ టేకోవర్‌ మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో బాధితుల కష్టాలు తీరే అవకాశం కనుచూపు మేరలో కనబడటం లేదు. అగ్రిగోల్డ్‌ను టేకోవర్‌ చేయడానికి ముందుకొచ్చిన సుభాష్‌ చంద్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలోని జీటీవి ఎస్సెల్‌ గ్రూపు ఆస్తుల విషయంలో చేసిన గందరగోళ ప్రకటనలు మదింపు ప్రక్రియను మరింత ఆలస్యం చేస్తున్నాయి. ఆస్తులకంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయని, తాము అగ్రిగోల్డ్‌ను టేకోవర్‌ చేయలేమని ఈ నెల 4న హైకోర్టులో పిటిషన్‌ వేసి చేతులెత్తేసిన ఎస్సెల్‌ గ్రూపు 24 గంటలు గడవక ముందే మరలా యూ టర్న్‌ తీసుకుంది. ఈ నెల 5న తమ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి హైకోర్టును అనుమతి కోరడంతో కోర్టు సానుకూలంగా స్పందించింది.

agrigold 11062018 2

చర, స్థిరాస్తులను పూర్తిగా మదింపు చేయకుండానే ఆస్తులు తక్కువ, అప్పులు ఎక్కువని బాధితులకు నష్టం కలిగించే ప్రకటనలు గతంలో చేసింది. అగ్రిగోల్డ్‌ కేసును పర్యవేక్షిస్తున్న సిఐడి అదనపు డిజి ద్వారకాతిరుమలరావు ఆగ్రిగోల్డ్‌కు కోట్లాది రూపాయిల ఆస్తులున్నాయని, బాధితులు భయపడాల్సిన అవసరం లేదని గతంలో జరిగిన డిపాజిటర్ల సమావేశంలో ప్రకటించారు. అప్పులు ఎక్కువగా ఉన్నాయని ప్రకటించి, ఆ తరువాత తాము టేకోవర్‌ ప్రక్రియలో ఉంటామంటూ కోర్టుకు తెలియజేయడంపై బాధితులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కారణాలతో ఆస్తుల మదింపు, టేకోవర్‌ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడానికి ఎస్సెల్‌ గ్రూపు ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారని కొందరు బాధితులు ఆరోపిస్తున్నారు. ఎంత డిపాజిట్‌ చేస్తే అంత మేరకు మాత్రమే సుభాష్‌చంద్ర ఫౌండేషన్‌కు ఆస్తుల్ని బదలాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

agrigold 11062018 3

ప్రభుత్వం ముందుకు వచ్చి, ఆగ్రిగోల్డ్ బాధితులకు మేమే సాయం చేస్తాం, తక్కువ ఉన్న డిపాజిట్ దారులకు మేమే ఇస్తాం అనటంతో, ఈ ప్రక్రియని ఆలస్యం చెయ్యటానికి, మాకు వద్దు అని అంటున్న, ఎస్సెల్‌ గ్రూపు మళ్ళీ వచ్చి మేము తీసుకుంటాం అంటుంది. ఇవన్నీ చూస్తుంటే, ఇది కావాలని, ప్రభుత్వం ఏ రకమైన సహాయం చెయ్యకుండా, కొన్నాళ్ళ పాటు, అంటే ఎన్నికలు దగ్గర పడే దాక, ఆలస్యం చేసే ప్లాన్ లో భాగంగానే, ఎస్సెల్‌ గ్రూపు మళ్ళీ వచ్చినట్టు, ఈ ఎస్సెల్‌ గ్రూపు బీజేపీ ఎంపీది కావటం, ఇవన్నీ అనుమానాలను బలం చేకురుస్తున్నాయి. సుభాష్‌ చంద్ర ఫౌండేషన్‌కు చెందిన జీటీవి ఎస్సెల్‌ గ్రూపు అగ్రిగోల్డ్‌ను టేకోవర్‌ చేస్తామని గతేడాది సెప్టెంబర్‌లో ముందుకొచ్చింది. దీంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు. రూ.10 కోట్లు డిపాజిట్‌ చేసి సిఐడి ఆధ్వర్యంలో ఆస్తుల మదింపు కార్యక్రమంలోనూ కొంతకాలం పాల్గొంది. ఆగ్రిగోల్డ్‌ ఆస్తుల విషయంలో అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి, జైళ్లలో ఉన్న అగ్రిగోల్డ్‌ డైరక్టర్లతో భేటీ అవ్వడానికి కూడా ఎస్సెల్‌ గ్రూపునకు హైకోర్టు అనుమతులు మంజూరు చేసింది. తొమ్మిది నెలల తరువాత తాము టేకోవర్‌ చేయలేమని చెప్పి మరలా ఒక రోజు వ్యవధిలోనే టేకోవర్‌ ప్రక్రియలో ఉంటామంటూ మాట మార్చింది. దీంతో ఎస్సెల్‌ గ్రూపు ఆధ్వర్యంలో టేకోవర్‌ సాధ్యాసాధ్యాలపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read