జగన్, పవన్, బీజేపీతో పాటు, ముద్రగడ, మోత్కుపల్లి, ఐవైఆర్, ఉండవల్లి లాంటి వారితో కలిసి, చంద్రబాబు మీద దాడి ఎలా జరుగుతుందో చూస్తున్నాం. కేవలం తనకి ఎదురు తిరిగాడు అనే కసితో, రాష్ట్రానికి రావాల్సిన హక్కు గురించి అడిగినా, వాళ్ళ ఇగో దెబ్బతిని, బీజేపీ చేస్తున్న పనులు చూస్తున్నాం. జగన్ ని కేసులుతో లోబర్చుకుని, పవన్ ను కూడా లైన్ లో పెట్టి, బీజేపీ, చంద్రబాబు పై దాడి చేస్తుంది. అయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్, జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న యాత్రలు చూస్తుంటే, వినపడుతున్నవి అన్నీ పుకార్లు కాదని, నిజమే అని అర్ధమవుతుంది. మన రాష్ట్రానికి విభజన హామీలు నెరవేర్చకుండా, బీజేపీ ఎలా గొంతు కొస్తుందో చూస్తున్నాం. చంద్రబాబు, మోడీ లాంటి బలమైన నేతను డీ కొడుతుంటే, పవన్, జగన్ మాత్రం, మోడీని ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనటం లేదు.

pavanjagan 10062018 2

ముఖ్యమంత్రి చంద్రబాబుని టార్గెట్‌గా చేసుకునే పవన్‌ కల్యాణ్‌ విమర్శలు చేస్తున్నారు. అదే విధంగా జగన్ మోహన్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు. కుదిరితే ముఖ్యమంత్రి కావాలన్న ఆశతో పవన్‌ కల్యాణ్‌ ఉన్నందున అధికారపక్షంతో పాటు ప్రతిపక్షంపై కూడా విమర్శలు చేయవలసి ఉంటుంది. జగన్మోహన్‌రెడ్డి కంటే తానే మెరుగైన ప్రత్యామ్నాయం అని రుజువు చేసుకోవడానికి పవన్‌ కల్యాణ్‌ ప్రయత్నించాలి, కాని ఇక్కడ అదేమీ కనిపించటం లేదు. మొన్నటి వరకు జగన్ మోహన్ రెడ్డి అవినీతి పరుడు అని, ముఖ్యమంత్రి కుర్చీ కోసం జగన్ పడే ఆరాటాన్ని విమర్శించిన పవన్, ఇప్పుడు మాత్రం, అసలు ఆ ప్రస్తావనే తేవటం లేదు సరి కదా, తాను కూడా జగన్ లాగే, ముఖ్యమంత్రి అయిపోతున్నాను అని, ఈ జిల్లాలో ఇన్ని సీట్లు వస్తున్నాయి అంటూ ప్రకటనను చేస్తున్నారు.

pavanjagan 10062018 3

అయితే దీని వెనుక, బీజేపీ హస్తం చాలా స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇద్దరినీ కోఆర్డినేట్ చేస్తున్న బీజేపీ, ఇద్దిరినీ అవగాహనతో కలిసి పని చెయ్యమని చెప్పినట్టు తెలుస్తుంది. దీని కోసం, వైసీపీ ఎంపీ వరప్రసాద్‌ రంగంలోకి దిగారని, జగన్, పవన్ మధ్య, సయోధ్య కుదిరించారని సమాచారం. ఇందులో భాగంగానే, ఇరువురు ఒక ఒప్పందానికి వచ్చారు. మీ జోలికి నేను రాను – నా జోలికి మీరు రావద్దు, అలాగే బీజేపీ జోలికి వెళ్ళద్దు, అందరం కలిసి చంద్రబాబుని మాత్రమే టార్గెట్ చేద్దాం అనే అవగాహనకు వచ్చారు. అందులో భాగంగానే, జగన్, పవన్ నోటి వెంట, చంద్రబాబు నామస్మరణ తప్ప వేరే పేరు రావటం లేదు. అలాగే, పవన్, జగన్ కలిసి పని చేసే అవకాసం కూడా లేకపోలేదని అంటున్నారు. ఎవరికి వారు పోటీ చేస్తే అది చంద్రబాబుకి చాలా ఈజీ గెలుపు అయిపోతుంది అని, అందుకే కలిసి పోటీ చెయ్యాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అందరూ కలిసి, అన్ని వైపుల నుంచి, చంద్రబాబుని దింపటం కోసం, చాలా శ్రమ పడుతున్నారు.

అందరూ ప్రకటనలు మాత్రమే ఇస్తారు.. చంద్రబాబు చేసి చూపిస్తారు అనే దానికి, ఇదే ఒక ఉదాహరణ... డీఎస్సీ ప్రకటన రాగానే, ఇది ప్రకటనల వరుకే అంటూ, కొంత మంది ఎద్దేవా చేసారు... కాని చంద్రబాబు మాత్రం, ఒక పధ్ధతి ప్రకారం ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో 10,351 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఆగస్టు 24 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో డీఎస్సీ-2018 పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్లు రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. . ఈసారి పరీక్షల నిర్వహణను ఏపీపీఎస్సీకి అప్పజెప్పినట్లు చెప్పారు. ఈ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం రాగానే ఏపీపీఎస్సీ అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటిస్తుందన్నారు. పరీక్షలు ఆన్‌లైన్‌లోనే ఉంటాయన్నారు.పిల్లలకు సంగీతం, నృత్యం నేర్పించడానికి వీలుగా ఆయా పోస్టులను తొలిసారిగా భర్తీచేస్తున్నట్లు గుర్తుచేశారు.

ఈసారి ఉపాధ్యాయులుగా ఎంపికైన వారితో ముఖ్యమంత్రి నేరుగా సమీక్షించి ఉపాధ్యాయ వృత్తిలో అంకితభావాన్ని తెలియజేసేలా ప్రతిజ్ఞ చేయిస్తారని చెప్పారు. జూలై ఆరు నుంచి ఆగస్టు ఎనిమిదో తేదీ వరకూ పరీక్ష ఫీజు చెల్లించాలి. జూలై ఏడో తేదీ నుంచి ఆగస్టు తొమ్మిదో తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు 15 నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 24, 25, 26 తేదీల్లో రాతపరీక్షలు ఉంటాయి. ఆగస్టు 27న ప్రాథమిక కీ విడుదల చేసి, ఆ రోజు నుంచి సెప్టెంబరు ఏడో తేదీ వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. సెప్టెంబరు 10న తుది కీ, 15న ఫలితాలు విడుదల చేస్తారు. ఈ నోటిఫికేషన్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 2,061, లాంగ్వేజ్‌ పండిట్లు 251, పీఈటీలు 24, ఎస్జీటీలు 2,290, మునిసిపల్‌ పోస్టులు 1,448, మోడల్‌ స్కూల్‌ టీచర్లు 929, సంగీతం 58, కొత్తగా ఏర్పాటుచేసినవి 3,290 పోస్టులు భర్తీ చేయనున్నారు.

టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 2014లో పదివేల టీచర్‌ పోస్టులు భర్తీ చేశామని మంత్రి గుర్తు చేశారు. విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, దీనిలో భాగంగానే పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, వర్చువల్‌ తరగతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది పాఠ్యపుస్తకాల పంపిణీలో జాప్యం లేదన్నారు. ఈ నెల 12న పాఠశాలలు పునఃప్రారంభం నాటికి 90శాతం పుస్తకాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇంటర్‌ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచే మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామన్నారు. మోడల్‌ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు.

అగ్రి గోల్డ్‌, విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీల నేరాల కంటే వైకాపా అధ్యక్షుడు జగన్‌ చేసిన ఆర్థిక నేరాలు తీవ్రమైనవని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అగ్రి గోల్డ్‌ ఆస్తుల్లానే జగన్‌ ఆస్తుల్నీ వేలం వేయాలని డిమాండు చేశారు. ‘అగ్రి గోల్డ్‌కు ఒక రూలు? జగన్‌కు మరో రూలా?’ అని ధ్వజమెత్తారు. ఐదు ఎంపీ పదవుల్ని చూపించి, రాష్ట్ర ప్రయోజనాల్ని కేంద్రానికి జగన్‌ తాకట్టు పెట్టారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు నమ్మక ద్రోహం చేసిన భాజపాకు, దానికి మద్దతిస్తున్న వైకాపాకు, ఇతర నాయకులకూ కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. అసమర్థులు, అవినీతిపరులకు అధికారమిస్తే ఆంధ్రప్రదేశ్‌ కోలుకోలేని దెబ్బతింటుందని, మరో బీహార్‌లా మారుతుందని పేర్కొన్నారు. శనివారం సాయంత్రం అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు.

cbn 10062018 2

‘అగ్రిగోల్డ్‌ ఆస్తులన్నీ న్యాయస్థానం ద్వారా వేలం వేస్తున్నాం. ఆ సంస్థ వాళ్లు అప్పులు చేసి ఆస్తులు కొన్నారు. కానీ అప్పులు తీర్చలేదు. దీంతో వారి వ్యక్తిగత ఆస్తులూ వేలం వేస్తున్నాం. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ విషయంలో అది ఎందుకు వర్తించదు? అతడిదీ మోసమే. ప్రజలు కూడా ఆలోచించాలి. నీరవ్‌ మోదీ అప్పులు చేశారు. తీర్చకుండా చేతులెత్తేశారు. అగ్రిగోల్డ్‌, నీరవ్‌ మోదీ కంటే జగన్‌దే ఎక్కువ నేరం. అవినీతితో ఆస్తులు పోగేశారు. అయినా ఎందుకు కోర్టులో ఇతర కేసుల్లో జరిగినట్లు జరగడం లేదు. ఎవరు కారణం? ఆయన కేసులన్నీ నీరుకార్చడం లేదా? ఎవరీ పని చేస్తున్నారు?' అని చంద్రబాబు అన్నారు.

cbn 10062018 3

'రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీపై పోరాడుతున్నాం. కానీ వైసీపీ నాయకుడు.. నాడు బీజేపీకి వ్యతిరేకంగా పోటీచేశారు. ఇప్పుడు ఐదుగురు ఎంపీలను అడ్డం పెట్టుకుని కేంద్రంతో బేరాలాడి కేసుల మాఫీకి కుమ్మక్కయ్యారు. రాష్ట్రానికి ద్రోహం చేశారు. ఎన్నికలు రాకుండా లగ్నం చూసి రాజీనామాలు ఆమోదించుకుంటారు. ఇదో నాటకం-బూటకం. కాంగ్రెస్‌ మోసం చేసినందుకు ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు నమ్మక ద్రోహం చేసిన బీజేపీకీ అంతకంటే ఎక్కువ బుద్ధి చెబుతారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. శనివారమిక్కడ సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్థిక కష్టాలు, కుమ్మక్కు రాజకీయాలతో సృష్టించిన అడ్డంకులన్నింటినీ అధిగమించి ఈ నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం వైపు నడిపించామని తెలిపారు. ఉద్యోగులు, ప్రజలు దీనికి పెద్దఎత్తున సహకరించారంటూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు.

ఉండవల్లిలోని ప్రజాదర్బార్ లో న్యాయ విభాగం ఆత్మీయ సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ``విభజన కష్టాలున్నా, లోటు బడిజిట్ లోనూ అన్ని వర్గాలకు న్యాయం చేసేముందుకు నా శాయశక్తులా కృషిచేస్తున్నఆనం పేర్కొన్నారు. 2019లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ విజయానికి మీ శక్తి వంచన లేకుండా పాటు పడాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో 2004 నుంచి 2014 వరకూ అన్ని వ్యవస్థలను కుప్పకూల్చిందని ఆరోపించారు. 2014 లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలను క్రమపద్ధతిలో నిలపడానికి శ్రమించానన్నారు. న్యాయవాద వర్గానికి ఉన్న సమస్యలను వీలైనంతలో పరిష్కరించడానికి శ్రద్ధ చూపుతున్నామన్ని పేర్కొన్నారు.

cbn 10062018 2

ఈ సందర్భంగా న్యాయవాద వర్గానికి చేకూర్చే పలు ఆర్ధిక ప్రయోజనాలను ఆయన ప్రకటించారు. ప్రధానంగా న్యాయవాదులకు మరణ ప్రయోజనాన్ని బార్ కౌన్సిల్ ప్రకటించిన రూ. 4 లక్షలకు అదనంగా మరో రూ. 4 లక్షలు రాష్ట్రప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటుగా ఇచ్చి ఆదుకుంటామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ స్టైఫండ్ ను రూ. 5 వేలకు, పుస్తకాల కొనుగోలుకు రూ. 20 వేలు బార్ కోడ్ నమోదుకు రూ. 8 వేలుకు పెంచి అందిస్తామన్నారు. దీనికోసం కోట ఇరవై లక్షలకు పైగా ఖర్చు చేయడానికి వెనకాడమన్నారు.బీసీ న్యాయవాదు లకు స్టైఫండ్ ను వేయి నుంచి రూ. 5 వేలకు, పుస్తకాల కొనుగోలుకు రూ. 20 వేలు బార్ కోడ్ నమోదుకు రూ. 8 వేలుకు పెంచి అందిస్తామన్నారు. న్యాయవాదులకు జర్నలిస్టులకు మాదిరే అన్ని రకాల వైద్య బీమా వర్తిస్తుందని , ఆ మేరకు వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు.

cbn 10062018 3

ఈ సందర్భంగా చంద్రబాబు ఈ మధ్య రిలీజ్ అయిన ఒక సినిమా అంటూ, కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘1995 - 2004 మధ్య రాష్ట్రంలో రెడ్‌అలర్ట్‌.. నేను హైదరాబాద్‌లో హెలికాప్టర్‌ ఎక్కానంటే.. నేరుగా ఏదో ఒక కార్యాయానికి వెళ్లేవాడిని. మొన్నీ మధ్య వచ్చిన సినిమా 2004లోనే నేను చూపించా.. కార్యాలయాలకు వెళ్లి దుమ్ము దులిపిస్తే.. వారి ముఖంపైనే పడేది. మురుగు కాల్వల్లో దింపి కష్టం ఎలా ఉంటుందో తెలియజేశా. సచివాలయంలో ఉమ్మి వేస్తే బకెట్లతో నీళ్లు తెప్పించి కడిగించా.. అన్నీ చేస్తే 2004లో అంతా కలిసి నాపై పడ్డారు అంటూ నవ్వుతూ అన్నారు. ‘ఇప్పుడు కొంత మంది లాలూచీ పడి భాజపాతో చేతులు కలిపారు. శుక్రవారం కోర్టుకు వచ్చి బోనులో నిలబడే వ్యక్తి బయటకు వచ్చి నన్ను తిడతారు.. న్యాయవాదులుగా వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కార్యాలయాలకే పరిమితం కాకుండా 10 నిమిషాలు రాష్ట్రాభివృద్ధికి కేటాయించాలి. మీ దగ్గరకు వచ్చే కక్షిదారులతోపాటు సొంత ఊళ్లకు వెళ్లినప్పుడు అసలేం జరుగుతుందో వివరించే బాధ్యత తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.

Advertisements

Latest Articles

Most Read