బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌, జగన్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో అన్ని రకాలుగా సహకరించి గెలిపించుకున్న జగన్ మోహన్ రెడ్డి పై, తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చెయ్యటం చూస్తుంటే, రాష్ట్రంలో మరో సరికొత్త రాజకీయం మొదలైందనే అనుకోవాలి. నెల గడిచింది, మరో వారంలో రెండో నెల పూర్తవుతుంది, అప్పుడే ప్రజల్లో జగన్ ను గెలిపించి తప్పు చేసామా అనే భావన వచ్చింది అంటూ, రాం మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. నిన్న తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన, ఈ వ్యాఖ్యలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి వీరంగం చేస్తున్నాడు, మనం పత్రికల్లో చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడిపోతున్నారు, కొద్ది రోజుల్లోనే జగన్ తన విశ్వరూపం చూపించి, ప్రజలను భయపెడుతున్నారు అంటూ రాం మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

rammadhav 25072019 2

మరో పక్క రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఈ రోజు ఇదే తరహా వ్యాఖ్యలు చేసారు. కేవలం జగన్ వైఖరి వల్లే అమరావతికి రుణం ఇచ్చే విషయంలో బ్యాంకులు వెనక్కు వెళ్లిపోతున్నాయని అన్నారు. కేవలం రెండు నెలల్లోనే జగన్ ఒక విఫల సియంగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. జగన్ చెప్పే నీతి మాటలకు, చేసే పనులకు ఎక్కడ పొంతన లేదని అన్నారు. తన తండ్రి గురించి జగన్ ఎప్పుడూ గొప్పగా చెప్పుకుంటూ, రాజకీయ వారసుడిని అని చెప్పుకుంటారని, రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ, జగన్ లా ప్రవర్తించ లేదని, ఎప్పుడూ పోలీస్ పాలన చెయ్యలేదని అన్నారు. అసెంబ్లీలో కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవరిస్తూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. గ్రామ వాలంటీర్ల ద్వారా రాష్ట్రంలో అరాచకం జరిగే ప్రమాదం ఉందని అన్నారు.

rammadhav 25072019 3

అయితే బీజేపీ నేతలు అన్ని వైపుల నుంచి జగన్ ప్రభుత్వం పై, ఆయన విధానాల పై విరుచుకు పడుతున్నా, జగన్ వైపు నుంచి, ఆయన ప్రభుత్వం, పార్టీ వైపు నుంచి, కనీస స్పందన లేదు. ఎన్ని విమర్శలు చేసినా, కనీసం వారికి కౌంటర్ ఇవ్వటం కాని, అలా కాదు ఇలా అని కాని చెప్పే సాహసం చెయ్యటం లేదు. తెలుగుదేశం నేతలు ఏమి చెయ్యకపోయినా వారి మీద పడిపోయే జగన్, బీజేపీ నేతలు అంత ఇదిగా తిడుతున్నా, విమర్శలు చేస్తున్నా, కనీసం స్పందించటం లేదు. అలాగే వాళ్ళ పార్టీ నేతలు కూడా, అసలు బీజేపీ నాయకుల విమర్శలకు కౌంటర్ ఇవ్వటం లేదు. మరి జగన్ మోహన్ రెడ్డికి బీజేపీ అంటే భయమో, లేక అది వారి పార్టీ విధానమో కాని, వైసిపీ అభిమానులు మాత్రం, బీజేపీ అంతలా తిడుతుంటే, జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారో అంటూ ఆలోచనలో పడ్డారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, బహుసా కోర్ట్ లలో ఇదే మొదటి ఎదురు దెబ్బ అయ్యి ఉంటుంది. జగన్ అనాలోచితంగా, కేవలం చంద్రబాబుని టార్గెట్ చేసుకుని తీసుకున్న నిర్ణయాలతో, ఈ రోజు ఆయాన ప్రభుత్వానికి హైకోర్ట్ లో మొట్టికాయలు పడే పరిస్థితి వచ్చింది. సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తి కంపెనీలతో జరిగిన ఒప్పందాల్లో చంద్రబాబు అవినీతి చేసారని, ఆయన్ను జైలుకి పంపిస్తా అంటూ జగన్ చేసిన ఛాలెంజ్ ఇప్పుడు కోర్ట్ లో, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేలా చేసింది. కేంద్రం చెప్పినా, బిజినెస్ అనలిస్ట్ లు చెప్పినా, ఫిచ్ రేటింగ్స్ చెప్పినా, క్రిసిల్ రేటింగ్ హెచ్చరించినా, అంతర్జాతీయ సంస్థలు హెచ్చరించినా, అక్కడ చంద్రబాబుని ఎదో చేసేయాలి అని తపనలో ఉన్న జగన్ మోహన్ రెడ్డికి ఈ రోజు హైకోర్ట్ లో ఎదురు దెబ్బ తగిలింది.

ppa 25072019 2

విద్యుత్ పీపీఏలను(పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్) మళ్ళీ సమీక్షించాలని జగన్ ప్రభుత్వం జారీ చేసిన, జీవో నెం. 63ను హైకోర్ట్ నాలుగు వారాల పాటు సస్పెండ్‌ చేసింది. అంతే కాదు విద్యుత్ ఒప్పందాల పై సంప్రదింపులకు రావాలని, వివిధ సంస్థలకు రాసిన లేఖలను కూడా హైకోర్ట్ సస్పెండ్ చేసింది. ఈ విషయం పై తదుపరి విచారణను ఆగష్టు 22కు వాయిదా వేస్తూ కోర్ట్ నిర్ణయం తీసుకుంది. దీంతో హైకోర్ట్ లో జగన్ ప్రభుత్వానికి తగిలిన మొట్టమొదటి ఎదురు దెబ్బగా ఇది నిలుస్తుంది. వారం రోజుల క్రితం ట్రిబ్యునల్ కు వెళ్ళిన గ్రీన్ కో కంపెనీకి అనుకూలంగా, ట్రిబ్యునల్ తీర్పు ఇస్తూ, ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హైకోర్ట్ వంతు వచ్చింది. జగన్ ప్రభుత్వ నిర్ణయం పై 40 విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి.

ppa 25072019 3

ఈ 40 కంపెనీలు, 14 పిటీషన్లు వేసాయి. విద్యుత్ ఉత్పత్తి కంపెనీల తరపున సుప్రీం కోర్టు న్యాయమూర్తి ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. వీటి పై జస్టిస్ ఎం.గంగారావు నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ల పై విచారణ జరిపింది. విద్యుత్ ఒప్పందాల పై ప్రభుత్వం సమీక్ష చేస్తూ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, కోర్ట్ కు తెలిపాయి. ఇది విషయం పై కేంద్రం కూడా, జగన్ ప్రభుత్వానికి రెండు సార్లు లేఖ రాసి హెచ్చరించింది. ఇది సరైన విధానం కాదని, ఇది రాష్ట్ర పరిధిలోని అంశం కాదని చెప్పినా, జగన్ మొండిగా ముందుకు వెళ్లారు. కేంద్రాన్ని కూడా జగన్ ముందుకు వెళ్ళటంతో, ఇప్పుడు ఆయన అవగాహనా లోపంతో తీసుకున్న నిర్ణయంతో, హైకోర్ట్ లో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. మరి ఇప్పటికైనా జగన్ ఆగుతారా, లేకపోతె కోర్ట్ ని కూడా ధిక్కరించి ముందుకు వెళ్తారో చూడాలి.

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చిన 50 రోజులకే, అప్రజాస్వామిక చర్యలతో చెలరేగిపోతుంది. ఎందుకు అసహనమో తెలియదు కాని, 151 మంది బలం ఉన్నా కూడా, జగన్ ప్రతి నిత్యం అసహనంతో ఉంటున్నారు. అసెంబ్లీలో కేవలం 23 మంది ఉన్న టిడిపి సభ్యులను ఎదుర్కోలేక, వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ఇప్పటికి అనేకసార్లు లెగిసి, నేను మాట్లాడిన తరువాత, ఇంకా ఏమి ఉంటుంది, చంద్రబాబుకి అవకాసం ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ, తాను చెప్పాల్సింది చెప్పేసి, చర్చను ముగిస్తున్నారు. సభా నాయకుడే కోరటంతో, స్పీకర్ కూడా ఏమి చెయ్యలేని పరిస్థితి. దీంతో తెలుగుదేశం పార్టీ సభ్యులు బయటకు వచ్చి తాము చెప్పాలి అనుకున్నది చెప్తూ, జగన్ అబద్ధాలను ఎండ గడుతున్నారు. సరిగ్గా ఇక్కడే మూడు టీవీ చానల్స్ కు పెద్ద చిక్కు వచ్చి పడింది.

assembly 25072019 2

రెండు రోజుల క్రితం 45 ఏళ్ళకే, 2 వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తున్నారు అని అడిగినందుకు, ముగ్గురు తెలుగుదేశం సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసారు. ఈ సమయంలో వారిని తీసుకొచ్చి బయట పడేసారు. దీంతో వారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు వచ్చి, తమ వాదన వినిపించారు. ఈ సందర్భంలో ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 చానల్స్ వారు మాట్లాడింది టీవీల్లో లైవ్ ఇచ్చారు. అయితే శాసనసభ జరుగుతుంటే, బయట మీడియా పాయింట్ వద్ద మాట్లాడేవి లైవ్ ఇవ్వకూడదు అనే నిబంధన ఉంది. నిజానికి ఈ నిబంధన పెట్టింది అప్పట్లో రాజశేఖర్ రెడ్డి. అప్పట్లో తెలుగుదేశం సభ్యులకు అవకాసం ఇవ్వకపోతే, వారు బయటకు వచ్చి మాట్లాడే వారు. అది ప్రజల్లోకి వెళ్ళేది. అందుకే, అలా కాదు అని ఈ రూల్ తెచ్చారు. కాని, అంత కఠినంగా అమలు చెయ్యలేదని చెప్పాలి.

assembly 25072019 3

తరువాత వచ్చిన చంద్రబాబు కూడా, ఈ నిభందనను పెద్దగా పట్టించుకోలేదు. ప్రతిసారి అసెంబ్లీ జరుగుతున్న టైంలో, అసెంబ్లీ కంటే, సాక్షి టీవీలో, బయట వారి సభ్యులు మీడియాతో మాట్లాడేది చూపించేవారు. అయితే చంద్రబాబు మాత్రం, అవి పెద్దగా పట్టించుకోలేదు. అందరి వాదన ప్రజల్లోకి వెళ్తే మంచిదే కదా అని అనే వారు. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం మాత్రం, ఒక 5 నిమిషాలు వారు మీడియాతో మాట్లాడింది చూపించినందుకు, ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 ఛానెల్స్ ని అసెంబ్లీ లోపలకి అనుమతించ లేదు. దీంతో వారు షాక్ అయ్యారు. ఈ నిబంధన ఉన్నా, మేము అంత పెద్ద నేరం ఏమి చేసామని అడుగుతున్నారు. అసెంబ్లీ అనేది జగన్ ఇష్టం కాదని, ప్రతి వార్తా ఛానెల్ కు అక్కడ జరుగుతుంది చూపించే హక్కు ఉంది అని అంటున్నారు. చిన్న నిబంధన సాకుతో, ఏకంగా మూడు ప్రధాన టీవీ చానల్స్ ను జగన్ అసెంబ్లీలోకి వెళ్ళకుండా బ్యాన్ చెయ్యటం పై, ఆయన నిజ స్వరూపం ఏంటో బయటపడుతుందని, ప్రతిపక్షాలు అంటున్నాయి.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి షాక్ లు ఇవ్వటం చాలా మామూలు విషయం అయిపొయింది. మొన్నటి వరకు చంద్రబాబు ఉన్నా, ఇప్పుడు జగన్ ఉన్నా, ఇదే పరిస్థితి. కాకపొతే అప్పుడు చంద్రబాబు, తాను మోడీ, అమిత్ షాను డీ కుంటే, రాజకీయంగా నష్టపోతాను అని తెలిసినా, ఎదురు తిరిగారు. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం, అప్పట్లో మెడలు వంచుతా అన్న వ్యక్తి, ఇప్పుడు మాత్రం, అధికారం రాగానే, మనం మోడీతో పెట్టుకోలేం, అమిత్ షా పవర్ ఫుల్ మ్యాన్ అంటూ చేతులు ఎత్తేసారు. అంతే కాదు, చంద్రబాబు పోరాటాలు చేస్తే, ఈయన మాత్రం, సార్, ప్లీజ్ సార్ ప్లీజ్ అంటూ మోడీని బ్రతిమలాడి, ఆయన మనసు కరిగే దాకా, ప్లీజ్ ప్లీజ్ అంటూ అడుగుతూ ఉంటానని, ఎదో ఒక రోజు ఇస్తారేమో చూద్దాం అంటూ జగన్ మోహన్ రెడ్డి తన వైఖరి ప్రకటించారు.

gadkari 25072019 2

పోరాడితేనే ఏమి ఇవ్వని మోడీ, షా, సార్, ప్లీజ్ సార్ ప్లీజ్ అంటే ఇస్తారా ? ఈ రోజు కూడా అదే జరిగింది. వైసిపీ ఎంపీ అవినాశ్ రెడ్డి, కేంద్రాన్ని ఒక ప్రశ్న అడిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ప్రత్యేకంగా పన్ను రాయతీలు ఇచ్చే ఉద్దేశం ఏమన్నా ఉందా ? మా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది అంటూ ప్రశ్న వేసారు. ప్రధాని ప్రత్యెక హోదా ఇస్తాం అని చెప్పి ఇవ్వలేదని, కనీసం మా రాష్ట్రానికి పన్ను రాయతీలు అయినా ఇవ్వండి, మా రాష్ట్రంలో పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, కనికరించింది అంటూ ప్రశ్న వేసారు. అయితే కేంద్రం మాత్రం, ఇది కుదరదు అని తేల్చి చెప్పింది. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, మాకు మీ రాష్ట్రానికి పన్ను రాయతీలు ఇచ్చే ఉద్దేశం ఏమి లేదు అంటూ, సమాధానం ఇచ్చారు.

gadkari 25072019 3

మా ప్రభుత్వం ఏమైనా విధానపరమైన నిర్ణయం తీసుకుంటే, అన్ని రాష్ట్రాలకు అమలు అయ్యేలా నిర్ణయం తీసుకుంటాం కాని, మీ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏమి ఇవ్వలేం అంటూ తేల్చి చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రత్యెక పరిస్థితుల్లో ఏర్పడిన రాష్ట్రం అని కేంద్రం మంత్రి మర్చిపోయారు. ఆనాడు ఇచ్చిన హామీలు ఏమి మంత్రిగారికి గుర్తు లేదు. అయితే వైసిపీ సభ్యడు అడిగిన ప్రశ్నతో మనకు ఏమి ఇవ్వరు అని తెలిసిపోయింది. అయితే ఇదే సందర్భంలో, ఆనాడు చంద్రబాబు నాయుడు, విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మెడ్ టెక్ జోన్ పై మాత్రం, కేంద్రం మంత్రి ప్రశంసలు కురిపించారు. విశాఖపట్నంలో నెలకొల్పిన మెడిటెక్ జోన్ బాగా పని చేస్తోందని కితాబిచ్చారు. విశాఖ మెడ్ టెక్ జోన్ విషయంలో, మీరు ఏమైనా ప్రతిపాదనలతో వస్తే, దాని పై ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read