జగన్ మోహన్ రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయంతో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుంది. అవగాహన లేకపోవటమే, లేక మొండిగా అనుకున్నది చెయ్యటమో కాని, రాష్ట్రం మాత్రం నష్టపోతుంది. తాజగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక బిల్లు తీసుకొచ్చింది. అదే పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించే బిల్. ఏదైనా పరిశ్రమ పెడితే, దాంట్లో 75 శాతం స్థానికులకే ఇవ్వాలి అనే చట్టం చేసారు. ఇది వినటానికి బాగానే ఉంటుంది కాని, ప్రాక్టికల్ గా మాత్రం అసలు వర్క్ అవుట్ అవ్వదని జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. జగన్ నిర్ణయం పై నిన్న జాతీయ మీడియాలో చర్చ జరిగింది. టైమ్స్ నో ఛానల్ లో జరిగిన చర్చలో, ఈ నిర్ణయం పై అందరూ విస్తుపోయారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రావని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుబడులు, కొత్త కంపెనీల గురించి మర్చిపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు.

jobs 247072019 2

ఇవన్నీ చెప్పుకోవటానికి బాగుంటాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే మూర్ఖపు పని వల్ల, రేపు హైదరాబాద్, ముంబై, బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లో కూడా, ఇలాంటి రూల్ పెడితే, అక్కడ పని చేసే ఆంధ్రులు ఏమై పోతారని, విశ్లేషకులు అడుగుతున్నారు. ఇలాగే ట్రంప్ ఆలోచిస్తే, అమెరికాలో పని చేస్తున్న లక్షలాది భారతీయుల పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారు. సమాజాన్ని చీల్చీ ఇలాంటి నిర్ణయాలు రాజకీయ లబ్ది కోసం తీసుకోవటం మంచి కదాని అన్నారు. మెరిట్ బేసిస్ మీద కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగాలు తీసుకుంటాయి కాని, నువ్వు పలనా ఊరి వాడివా, పలానా కులం వాడివా అని చూసి ఎవరూ ఉద్యోగాలు ఇవ్వరని గుర్తు చేస్తున్నారు. గ్లోబలైజేషన్ అంటే ఏంటో జగన్ మోహన్ రెడ్డికి తెలియదు ఏమో అని అంటున్నారు.

jobs 247072019 3

ఒక పరిశ్రమ వచ్చి పెట్టుబడి పెట్టాలంటే, ఎంతో కష్టపడాలని, ఎన్నో ఇన్సెంటివ్స్ ఇవ్వాలని, అప్పుడు కాని ఒక కంపెనీ వచ్చి పెట్టుబడి పెట్టదని, అలాంటిది ఏమి లేని ఆంధ్రప్రదేశ్ లో, ఇలాంటి ఆంక్షలు పెడితే ఒక్క కంపెనీ కూడా వచ్చి పెట్టుబడి పెట్టదని అంటున్నారు. జగన్ మోహన్ రెడ్డికి ఇలనాటి ఐడియాలు ఎవరు ఇస్తున్నారో కాని, వారికి సెల్యూట్ చెయ్యాలని అంటున్నారు. కొద్ది రోజుల క్రిందట జరిగిన క్యాబినెట్ సమవేసలో ఐఏఎస్ అధికారి ఉదయ లక్ష్మి కూడా, ఈ విషయం పై వ్యతిరేకత వ్యక్తం చెయ్యగా, జగన్ ఆమె పై అసహనం వ్యక్తం చేసారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా జాతీయ మీడియా, ఏకి పెడుతుంది. చూద్దాం జగన్ నిర్ణయం సరైనదో, లేక ఈ మేధావులు, విశ్లేషకులు చెప్పేది కరెక్ట్ అనేది.

జగన్ మోహన్ రెడ్డి అవగాహన లోపం, తన సహజ లక్ష్యణం అయిన కక్ష తీర్చుకునే ధోరణితో, ఇటు రాష్ట్రానికే కాదు, అటు దేశానికి కూడా తీవ్ర నష్టం చేసే పనులు చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి ఇచ్చిన సూచనల మేరకు, దేశాలు అన్నీ థర్మల్ విద్యుత్ వదిలి, సౌర, పవన విద్యుదుత్పత్తి వైపు వెళ్తున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఈ రంగంలో పెట్టుబడలును ప్రోత్సహించింది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కూడా, వీటికి ప్రాధాన్యత ఇచ్చింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో, చంద్రబాబుని ఎదో ఒక కేసులో ఇరికించాలి అని చూస్తున్న జగన్, అన్ని రంగాల్లో సమీక్షలు, ఎంక్వైరీలు వేస్తున్నారు. అయితే విద్యుత్ రంగంలో చేసుకున్న ఒప్పందాల పై సమీక్షకు మాత్రం, అనాలోచితంగా చేస్తున్నారు.

crisil 24072019 2

అటు కేంద్రం కాని, ఇటు వివిధ సంస్థలు కాని, అలా చెయ్యటం తప్పు, దాని వల్ల పెట్టుబడి దారులు వెళ్ళిపోతారు, భారీగా జరిమానాలు కట్టాలి అని హెచ్చరిస్తున్నా, జగన్ మాత్రం,వితండవాద ప్రవర్తనతో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపధ్యంలోనే ప్రముఖ రేటింగ్‌, మార్కెట్‌ విశ్లేషణ సంస్థ ‘క్రిసిల్‌ రేటింగ్స్’ కూడా జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. జగన్ ప్రభుత్వం చేస్తున్న నిర్ణయం వల్ల, సౌర, పవన విద్యుదుత్పత్తి రంగానికి కోలుకోలేని దెబ్బ తగులుతుందని, ‘క్రిసిల్‌’ పేర్కొంది. దీని పై మంగళవారం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. జగన్ ప్రభుత్వ నిర్ణయంతో, పునరుత్పాదక విద్యుదుత్పత్తి సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతాయని, దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా పెట్టుబడులు రావని హెచ్చరించింది.

crisil 24072019 3

జగన్ నిర్ణయంతో విసుగు చెంది, ఈ కంపెనీలు కోర్ట్ కు వెళ్ళితే, పరిస్థితి చేయి దాటిపోతుందని హెచ్చరించింది. పరిష్కారానికి సుదీర్ఘ సమయం పడుతుంది. కంపెనీలకు డిస్కమ్‌ల నుంచి చెల్లింపులు ఇంకా ఆలస్యమవుతాయి. ఇప్పటికే నిధులు లేక ఇబ్బంది పరిస్థితి ఉందని హెచ్చరించింది. ఈ చర్యలతో పునరుత్పాదక విద్యుత్తు రంగం దెబ్బతింటుందని, ఇవన్నీ ఆలోచించి, దీని పై తగిన విధంగా ముందుకెళ్లాలని జగన్ ప్రభుత్వాన్ని క్రిసిల్‌ హెచ్చరించింది. ఒక వేళ అలా కుదరదు, మా ఇష్టం అంటే ఈ రంగం పై పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోతారని, అదే కనుక జరిగితే 2022 నాటికి దేశంలో మొత్తం 175 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నేరవేరదని హెచ్చరించింది. మరి ఇప్పటికైనా జగన్ గారు, తగ్గుతారో లేదో చూడాలి.

నిన్న అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో, 45 ఏళ్ళకే, 2 వేలు పెన్షన్ అని జగన్ హామీ ఇచ్చారు కదా, అది ఎప్పటి నుంచి ఇస్తున్నారు అని అడిగినందుకు, సరైన సమాధానం రాకపోవటంతో, మాకు మాట్లాడే అవకాసం ఇవ్వాలి అని కోరినందుకు, తెలుగుదేశం శాసనసభాపక్ష డిప్యూటీ లీడర్లగా ఉన్న ముగ్గురిని సభ నుంచి బడ్జెట్‌ సమావేశాలు ముగిసేదాకా జగన్ ప్రభుత్వం సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే కేవలం ప్రశ్న అడిగితేనే సస్పెండ్ చేస్తారా అంటూ నిన్న మిగతా తెలుగుదేశం ఎమ్మెల్యేలు నిరసన తెలియచేసి వాక్ అవుట్ చేసారు. అచ్చెంనాయుడు ఆయన స్థానంలో నుంచున్నా కూడా, ఎందుకు సస్పెండ్ చేసారో చెప్పాలని, నిన్న స్పీకర్ ను కలిసి, సస్పెన్షన్ ఎత్తేయాలని కోరారు. అయినా ప్రభుత్వం ఏమి స్పందించలేదు.

cbn 24072019 2

దీంతో ఈ రోజు అసెంబ్లీ ప్రారంభానికి ముందు, తెలుగుదేశం నేతలు మెరుపు ధర్నా చేసారు. చంద్రబాబు కూడా ఈ ధర్నాలో పాల్గునటంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నేలకుంది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో అలెర్ట్ అయిన పోలీసులు, మీడియాను అసెంబ్లీ నుంచి బయటకు గెంటేసారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ప్రాంగణంలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇదే మార్గంలో మిగతా నేతలు వస్తారని, జగన్ కూడా ఇటే వస్తారాని, అక్కడ నుంచి వెళ్ళిపోవాలని పోలీసులు హెచ్చరించారు. అయినా తెలుగుదేశం నేతలు అసెంబ్లీ మొదలయ్యే వరకు, అక్కడే ఆందోళన చేసారు. ఎందుకు సస్పెండ్ చేసారో కనీసం చెప్పకుండా సస్పెండ్ చేసారని, ప్రశ్న అడిగినందుకు సస్పెండ్ చెయ్యటం అన్యాయమని చంద్రబాబు అన్నారు.

cbn 24072019 3

తమ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేయడం అప్రజాస్వామిక చర్య అని చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో ఊరు ఊరు తిరిగి మీరు ఇచ్చిన హామీలనే గుర్తు చేస్తే, అన్యాయంగా బయటకు నెట్టేస్తారా అని నిలదీశారు. జగన్ మోహన్ రెడ్డికి అసహనం పెరిగిపోయిందని, పోడియం వద్ద కు వెళ్లని టీడీపీ సభ్యులనూ సస్పెండ్‌ చేశారని అన్నారు. ఇది ఇలా ఉంటె, ఈ రోజు కూడా ఉదయం ఉంచి తెలుగుదేశం పార్టీ ఎంత అడిగినా మైక్ ఇవ్వలేదు. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం 12500 అని జగన్ ప్రకటించారు. అయితే ఇప్పుడు 12500 కాదని, 6500 అని, కేంద్రం ఇచ్చే 6 వేలు అదనం అని చెప్తున్నారు. దీని పై చంద్రబాబు లెగిసి నుంచుని మైక్ ఇవ్వమని అడిగినా మైక్ ఇవ్వలేదు. దీంతో నిరసన తెలియచేస్తూ, సభ నుంచి తెలుగుదేశం పార్టీ వాక్ అవుట్ చేసింది.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఇస్తున్న భద్రత విషయంలో, కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అందిరి నాయకులకు ఇస్తున్న ఎస్పీజీ, ఎన్ ఎస్ జీ భద్రత విషయంలో కేంద్ర హోం శాఖ సమీక్ష జరిపింది. ఈ సమీక్షలో పులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కు ఇస్తున్న బ్లాక్ క్యాట్ కమెండో సెక్యూరిటీని పూర్తిగా తొలగించారు. అఖిలేష్ యాదవ్ విషయంలో సమీక్ష జరిపి, ఆయనకు జెడ్ ప్లస్ రక్షణ ఇచ్చే అవసరం లేదని కేంద్ర హోం శాఖ తేల్చి చెప్పింది. అఖిలేష్ సియం అయిన తరువాత, ఆయనకు 22 మందితో NSG కమాండోల బృందంతో భద్రత కలిగించారు. అయితే ఇప్పుడు సమీక్ష జరిపి ఆయనకు షాక్ ఇచ్చారు. అయితే అఖిలేష్ తండ్రి, ములాయంకు మాత్రం జెడ్ ప్లస్ భద్రత కొనసాగుతుంది.

security 24072019 2

ఇలా అందరికీ సమీక్ష జరిపి, దేశంలో మొత్తం, 24 మంది నేతలకు వీఐపీల భద్రతా కవర్ నుంచి కేంద్రం ఉపసంహరించుకుంది. ఇక మన రాష్ట్రానికి వస్తే, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు భద్రత విషయంలో ఎలా ప్రవరిస్తున్నారో చూసాం. ఆయనకు పూర్తిగా భద్రత తొలగించారు. అయితే, చంద్రబాబు జెడ్ ప్లస్ భద్రత కేంద్ర పరిధిలోది కావటంతో, దాంట్లో ఎలాంటి మార్పు చెయ్యలేదు. దీంతో ఇప్పటికే జగన్, మోడీతో క్లోజ్ గా ఉండటం, ఢిల్లీలో కూర్చుని విజయసాయి రెడ్డి పుల్లలు పెడుతూ ఉండటంతో, కేంద్రం కూడా చంద్రబాబుకి జెడ్ ప్లస్ భద్రత తొలగిస్తుందని అందరూ భావించారు. కాని, కేంద్ర హోం శాఖ సమీక్షలో, చంద్రబాబుకి జెడ్ ప్లస్ భద్రత కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.

security 24072019 3

ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న రాజకీయ వైరం, పర్సనల్ స్థాయిలో ఉండటం, జగన్ ప్రభుత్వం కక్ష సాధింపులు, అలాగే నక్సల్స్ నుంచి ముప్పు, ఎర్ర చందనం మాఫియా నుంచి ముప్పు, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని, చంద్రబాబుకి జెడ్ ప్లస్ భద్రత ఉండాల్సిందే అనే కేంద్రం నిర్ణయం తీసుకుంది. చంద్రబాబుతో పాటు, కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్, అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాతో పాటుగా మరో 12 మందికి ఎన్‌ఎస్‌జి భద్రత కొనసాగించనున్నారు. ఇక మరో పక్క జగన్ ప్రభుత్వం తనకు భద్రత పూర్తిగా తొలగించటం పై చంద్రబాబు ఇప్పటికే కోర్ట్ కి వెళ్లారు. ఈ పిటీషన్ కోర్ట్ లో విచారణ దశలో ఉంది. భద్రతా పరమైన అంశం కాబట్టి ఓపెన్ కోర్ట్ లో విచారణ జరపాలెం అని ప్రభుత్వం చెప్పటంతో, ఈ కేసు విచారణ ఎంత వరకు వచ్చిందో తెలియాల్సి ఉంది.

Advertisements

Latest Articles

Most Read