ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందామురి బాలకృష్ణ పై ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది. చంద్రబాబు వియ్యకుండు అయిన బాలకృష్ణ, ఆయన బంధువులు, అమరావతి రాజధాని ప్రకటన చేసేకంటే ముందే, అమరావతి ప్రాంతంలో 500 ఎకరాలు కొన్నారంటూ ఆరోపణలు చేసారు. చంద్రబాబు వియ్యంకుడిగా, బాలక్రిష్ణకు ముందే చెప్పి, అక్కడ భారీగా భూములు కొన్నారని, ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, ఆరోపించారు. నిన్న మంత్రి బొత్సా సత్యన్నారాయణ మాట్లాడుతూ, అమరావతిలో అతి పెద్ద స్కాం జరిగింది అని, దాన్నే ఇన్ సైడర్ ట్రేడింగ్ గా చెప్తూ, ఈ స్కాంను బయటకు తెస్తామని అన్నారు. బొత్సా ప్రెస్ మీట్ పెట్టగానే, వైసీపీ నేతలు, మీడియాకు ఈ లీకులు ఇచ్చారు. బాలకృష్ణ 500 ఎకరాలు కొన్నారంటూ లీకులు ఇచ్చారు.

balayya 28072019 2

ఇదే విషయాన్ని కొన్ని పత్రికలు ప్రధానంగా ఈ రోజు ప్రచురించాయి. బాలకృష్ణ, ఆయన బంధువులు, 500 ఎకరాలు అమరావతిలో కొన్నారని, రాజధాని ప్రకటన కంటే ముందే, వీళ్ళు కొన్నారంటూ, బొత్సా ప్రెస్ మీట్ వివరాలు చెప్తూ, ఇది కూడా రాసారు. ఒక ఇంగ్లీష్ పత్రికల్లో కూడా ఈ వార్త ప్రచురించింది. దీంతో ఇది నిజమేనేమో అని కొంత మంది నమ్మే పరిస్థితి. కాని బాలకృష్ణ పై మాత్రం, ఎప్పుడూ ఎలాంటి మచ్చ లేదు. తన తండ్రి సియంగా ఉన్నప్పుడు కాని, బావ సియంగా ఉన్నప్పుడు కాని, ఎప్పుడు పలనా అవినీతి చేసారు అనే ఆరోపణలు ఈ 40 ఏళ్ళ కాలంలో ఎప్పుడూ రాలేదు. ఈ రోజు వచ్చిన వార్తా పై, వెంటనే నారా లోకేష్ ట్విట్టర్ లో ఈ వార్తను ఖండించారు. ఈ వార్తా అటాచ్ చేస్తూ, జగన్ మోహన్ రెడ్డి గారు, అధికారంలో ఉన్నది ఇప్పుడు మీరే, ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న మీరు, బాలకృష్ణ గారు, ఆయన బంధువులు అమరావతిలో 500 ఎకరాలు కొన్నారని, నిరూపించండి అంటూ జగన్ మోహన్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి లోకేష్ ఛాలెంజ్ చేసారు.

balayya 28072019 3

ఇది లోకేష్ ట్వీట్ "వైకాపా నాయకులు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాం అనుకుంటున్నారు. వాళ్ళ ఫేక్ బతుకు మారలేదు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అసత్యాలతో కాలం నెట్టుకొస్తున్నారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని దెబ్బతియ్యడానికి ఇన్ సైడ్ ట్రేడింగ్ అంటూ బురద జల్లుతున్నారు. తండ్రి అధికారాన్నీ, శవాన్నిపెట్టుబడిగా పెట్టి ఎదిగిన చరిత్ర మీ నాయకుడిది. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఏ రోజూ అటు వైపు కూడా చూడకుండా స్వఛ్చమైన మనస్సు, నీతి, నిజాయితీతో ఎదిగారు మా బాలా మావయ్య. అటువంటి వ్యక్తి రాజధానిలో భూములు కొన్నారని ఆరోపణలు కాదు, దమ్ముంటే నిరూపించండి. లేక రాజధాని రైతులకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి."

పేదవాడికి రూ.5 కే కడుపు నిండా భోజనం పెట్టటం కోసం, చంద్రబాబు అన్న క్యాంటీన్లను తీసుకొచ్చారు. ఎంతో పరిశుభ్రమైన వాతావరణంలో, క్వాలిటీ భోజనం, 5 రూపాయలకే పేదలకు అందించి, వారి కడుపు నింపారు. అయితే, ప్రభుత్వం మారటం, జగన్ రావటంతో, ఇప్పటికే తాత్కాలిక ఏర్పాట్లలో సాగుతున్న అన్న క్యాంటీన్లు మూత పడ్డాయి. అంతే కాదు, చాలా చోట్ల అన్న క్యాంటీన్ భావనలకు ఉన్న రంగులు మార్చేస్తున్నారు. "అన్న" అనే పేరు కూడా లేపెసారు. సరి ఎన్ని చేసినా, ప్రజలకు టైంకు భోజనం పెడితే చాలు అని అందరూ అనుకున్నారు. కాని ఇప్పుడు వస్తున్న వార్తలు చూస్తుంటే, ప్రతి రోజు 5 రూపాయిలకే భోజనం అందదేమో అనే భయంతో పేదలు ఉన్నారు. తాజాగా వస్తున్న వార్తలు చూస్తుంటే, వీరు బాధలో అర్ధముందేమో అనిపిస్తుంది.

annacanteen 28072019 2

అసలకే అన్న క్యాంటీన్లు ఎత్తేస్తారా, లేకపోతే మరో ప్రత్యామ్న్యాయంతో వస్తారా అనేది తెలియటం లేదు. ఏదైనా ఇప్పటి వరకు వస్తున్న వార్తలు అయితే, మరో మూడు రోజులు మాత్రమే అన్న క్యాంటీన్ లు ఉంటాయి. ఆగష్టు 1 నుంచి, ఉంటాయో ఉండవో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే దీనికి సంబంధించి, అన్న క్యాంటీన్లకు భోజనం కాంట్రాక్టు చేస్తున్న అక్షయపాత్రకు , ఈ విషయంలో మౌఖిక ఆదేశాలు వెళ్ళాయి. ఈ నెల ఒకటవ తేది నుంచి, సరఫరా నిలిపివెయ్యలని, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ డైరెక్టరేట్‌ నుంచి మౌఖిక ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ ఆదేశాలను ఆయన పట్టణాలు, నగరాల్లో ఉన్న కమీషనర్లు అక్షయపాత్రకు కూడా తెలిపారు. అయితే తరువాత నుంచి ఏమి చేస్తారు అనేది మాత్రం ఎక్కడా క్లారిటీ లేదు.

annacanteen 28072019 3

అయితే వేరే పేరుతొ, వేరే మెనూతో, ఇలా మొత్తం మార్చేసి, మళ్ళీ కొత్తగా, జగన్ స్టైల్ లో వస్తుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే అప్పటి వరకు భోజనం పెట్టకుండా ఆపటం పై మాత్రం విమర్శలు వస్తున్నాయి. నిజానికి జూన్ నెల నుంచి భోజనాల సంఖ్య తగ్గిస్తూ వచ్చారు. జూలై నెలకు మరింత తగ్గించారు. ఆగష్టు నెల వచ్చేసరికి, ఏకంగా భోజనమే బంద్ అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన ఈ 5 రూపాయిల భోజనం, వలస కూలీలు, కార్మికులు, పనుల మీద వచ్చే పేదవర్గాలకు ఆకలి తీర్చాయి. హోటల్ కు వెళ్లి తినాలి అంటే, 80 నుంచి వంద రూపాయల పైన అవుతుంది. అంత ఖర్చు పెట్టలేక, చాలా మంది పస్తులు ఉండేవారు. వీరి బాధలు గ్రహించి, చంద్రబాబు 5 రూపాయలకే ఉదాయం టిఫిన్, మధ్యానం భోజనం, రాత్రి భోజనం, 5 రూపాయలకే లభించేలా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల రక్షణ, భద్రత కోసం, చంద్రబాబు నాయుడు హయంలో, 2018లో ప్రత్యేకంగా ‘శక్తి’ టీమ్‌లను ఏర్పాటు చేసారు. ఈ మహిళా శక్తి బృందాలు, మహిళలకు రక్షణగానే కాకుండా, ప్రజలకు వివిధ నేరాల్ ఆపై అవగాహన కూడా కలిపిస్తూ ఉంటారు. వీరికి ప్రత్యేకంగా ఇన్నోవా వాహనాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారినా, ఈ వ్యవస్థ కొనసాగుతుంది. అయితే ఇప్పుడు వైజాగ్ లో ఈ శక్తి టీమ్స్ చేసిన పనితో, సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వారికి ఇచ్చిన విధులను గాలికి వదిలేసి, టిక్ టాక్ చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు, వైజాగ్ శక్తి టీం పోలీసులు. టిక్ టాక్ కు అలవాటు పడి, అది వ్యసనంగా మారటంతో, విధులు కూడా పక్కన పడేసి, డ్యూటీలో ఉండగానే, యునిఫారం ఉండగానే టిక్ టాక్ చేసుకుంటూ, పంచ్ డైలాగులు, జబర్దస్త కామెడీతో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

shakti 2707209 2

ఏకంగా వారికి ఇచ్చిన పోలీస్ వాహనంలోనే కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఈ మహిళా ఖాకీల పై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. యునిఫారంలో ఉండగానే, ఇలాంటి చేష్టలు ఏమిటి అంటూ, విమర్శలు వస్తున్నాయి. అయితే దీని పై పోలీస్ ఉన్నతాధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారు, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి. ఇప్పటికే ఈ టిక్ టాక్ వ్యసనంలో పడి తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగాలు పోగొట్టుకున్న వారిని చూసాం. అక్కడలా ఇక్కడ ప్రభుత్వం కూడా, వీరి పై చర్యలు తీసుకుంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది. తెలంగాణాలో ఇప్పటికే ఈ జాడ్యం చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు చుట్టుకుంది. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విధుల్లో ఉన్న పోలీసుల దాకా పాకింది.

shakti 2707209 3

ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో టిక్‌టాక్‌ వ్యవహారం ముందుగా వెలుగులోకి వచ్చింది. వారిని ఉద్యోగంలో నుంచి తొలగించారు. తరువాత, కరీంనగర్ డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఉద్యోగుల టిక్‌టాక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసారు. శుక్రవారం గాంధీ ఆసుపత్రిలో టిక్‌టాక్ చేసిన జూనియర్ డాక్టర్లను కూడా సస్పెండ్ చేసారు. ఇలా చివరకు డాక్టర్లు, పోలీసులు, కూడా సోషల్ మీడియా పిచ్చలో పడి ప్రభుత్వ సేవ, ప్రజల సేవ మరిచి, టిక్ టాక్ లలో విచిత్రమైన పనులు చేస్తూ, కాలక్షేపం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఇలాంటి వాటి పై ఖటినంగా ఉండాలి. ఇలాంటి వారిని ఉపేక్షించ కుండా, వెంటనే సస్పెండ్ చేస్తే కాని, వేరే వారికి ఇది పాక కుండా, ఆగుతుంది.

కాపులకు రిజర్వేషన్ ఇచ్చే అంశం పై, గత ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబుని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో చూసాం. అటు ముద్రగడ కాని, ఇటు జగన్ మోహన్ రెడ్డికి కాని, 5 ఏళ్ళు చంద్రబాబుని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. చంద్రబాబు వచ్చిన ఏడాదిలోనే రత్నాచల్ ఎక్ష్ప్రెస్ తగలుబెట్టి మరీ రాద్ధాంతం చేసారు. అటు తరువాత ముద్రగడ చేసిన ఆమరణ దీక్ష కాని, తరువాత చేసిన ఆందోళనలు కాని, దీనికి తోడు జగన్ మోహన్ రెడ్డి పార్టీ, ప్రతి నిమిషం ఈ విషయంలో చంద్రబాబుని ఇబ్బంది పెట్టటం కాని, అన్నీ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి. ముద్రగడ చేసే ప్రతి దీక్షకు, జగన్ పార్టీ మద్దతు పలికింది. ఇన్ని ఇబ్బందుల్లో కూడా, రాజకీయంగా నష్టపోతాం అని తెలిసినా, ఆ రోజు చంద్రబాబు కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించి, కేంద్రానికి పంపించారు.

kapu 28072019 2

అప్పుడు కూడా చంద్రబాబు గేమ్ ఆడుతున్నారు అంటూ, కేంద్రం ఆమోదించక పోయినా, అటు ముద్రగడ కానీ, ఇటు జగన్ కానీ గేమ్ ఆడారు. తరువాత కేంద్రం అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వటంతో, అందులో జనాభా ప్రకారం, 5 శాతం కాపులకు రిజర్వేషన్లు ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది. జగన్ మోహన్ రెడ్డి వచ్చారు. అయితే ఈ కాపు రిజర్వేషన్లు కుదరవు అంటూ, అప్పట్లో చంద్రబాబు ఇచ్చిన 5 శాతం ఎత్తేసారు. దీనికి సంబంధించి నిన్న ఉత్తర్వులు ఇచ్చారు. కాపులకు 5 శాతం కోటా సాధ్యపడదని ప్రభుత్వం ఈ సందర్భంగా తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి పూర్తీ క్లారిటీతో శనివారం ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.

kapu 28072019 3

ఇది ఇలా ఉంటే, మరి ప్రతిపక్షంలో ఉండగా, కాపుల రిజర్వేషన్ల అంశం పై, చంద్రబాబుని అడుగడుగునా ఇబ్బంది పెట్టిన జగన్, అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే, చంద్రబాబు ఇచ్చిన రిజర్వేషన్ ఎత్తేసారు. చాలా మంది కాపు యువత కూడా, పవనన్నకు ప్రాణం ఇస్తాం, జగనన్నకు ఓటు వేస్తాం అంటూ మొనట్టి ఎన్నికల్లో ప్రచారం చేసారు కూడా. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే, కాపులకు షాక్ ఇచ్చారు. చంద్రబాబు కంట్లో నలుసుగా ఇబ్బంది పెట్టిన ముద్రగడ గారు, ఇప్పటి వరకు ఈ విషయం పై నోరు తెరవలేదు. అదే చంద్రబాబుని అయితే రైళ్ళు తగలుబెట్టెలా ఉద్యమాలు చేసారు. మరి ఇది జగన్ ప్రభుత్వానికి వర్తించదా ?చంద్రబాబు మా పొట్ట కొట్టారు అని, పళ్ళెం, గరిట తీసి వాయించిన ముద్రగడ గారు, ఇప్పుడు జగన్ నిర్ణయం పై ఎలా స్పందిస్తారో ?

Advertisements

Latest Articles

Most Read