సోమవారం రాత్రి, హైదరాబాద్ లో, డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ పై, జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కొడుకు వెంకటకృష్ణ ప్రసాద్‌ దాడి చేసిన సంగతి తెలిసిందే. విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ పై, కాలుతో తన్నారు అనే అభియోగాల పై, అతన్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే ఆ గొడవకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ వీడియోలో, వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను భార్య , ఆ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ ను, "కేసీఆర్ తో చెప్పి, నిన్ను సస్పెండ్ చేపిస్తా" అనే మాట మాట్లాడుతూ ఉండటం కనిపించింది. ఆ వీడియోలో , మరో మహిళ కూడా ఉన్నారు. నా చేయి పట్టుకున్నావ్ నువ్వు అంటూ, ఆ మహిళ అనటంతో, నేను మీ చేయి పట్టుకోలేదు అంటూ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ సమాధానం ఇస్తున్నారు.

udayabhanu 30072019 1 2

ఇదే సమయంలో అక్కడే ఉన్న వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను భార్య, ఆడవాళ్ళ చెయ్య పట్టుకున్నావ్ అని చెప్పి, "కేసీఆర్ తో చెప్పి, నిన్ను సస్పెండ్ చేపిస్తా" అంటూ వార్నింగ్ ఇప్పించారు. దానికి ఆ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ సమాధానం ఇస్తూ, చెప్పుకోండి మ్యాడం, నేనేమి తప్పు చెయ్యలా, చెప్పుకోండి అనే మాటలు వినిపించాయి. పూర్తీ వివరాల్లోకి వెళ్తే, హైదరాబద్ మాదాపూర్‌లోని ఖానామేట్‌ మీనాక్షి టవర్స్‌ దగ్గర, సోమవారం రాత్రి ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజగోపాల్‌రెడ్డి విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ సమయంలో, నోవాటెల్‌ హోటల్‌ నుంచి మీనాక్షి టవర్స్‌ వైపు రాంగ్‌ రూట్‌లో వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కొడుకు, వెంకటకృష్ణప్రసాద్‌ వేగంగా కార్ నడుపుకుంటూ వచ్చారు. దీనిని గమనించిన కానిస్టేబుల్‌, ట్రాఫ్ఫిక్ ఇన్‌స్పెక్టర్‌ కారును ఆపారు.

udayabhanu 30072019 1 3

దీంతో ఆగ్రహానికి గురైన వెంకటకృష్ణప్రసాద్‌, నన్నే ఆపుతావా అంటూ, ట్రాఫిక్‌ పోలీసులను దుర్భషలాడుతూ ఇన్‌స్పెక్టర్‌ కాలుపై తన్నాడని, పోలీసులు తెలిపారు. అయితే అప్పటికే అక్కడ గుమికూడిన ప్రజలు, రాంగ్ రూట్ లో వచ్చింది కాక, మళ్ళీ ఎదురు పోలీసులనే కొడతారా అంటూ, రివర్స్ అయ్యారు. పోలీసులకు క్షమాపణ చెప్పాలని కృష్ణ ప్రసాద్ ను కోరారు. అయితే, తాను తాను వైసీపీ ఎమ్మెల్యే కొడుకునని బెదిరించారు. దీంతో ఎంత చెప్పినా తాను మాట వినకపోవటంతో, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి, కృష్ణప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై 304, 337, 109 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. పోలీసులు వాదన ఇలా ఉంటే, ఈ రోజు బయటకు వచ్చిన వీడియోలో, మళ్ళీ పోలీసులనే ఎమ్మెల్యే భార్య బెదిరించటం, ఉద్యోగం పీకిస్తా అని చెప్పటంతో అందరూ అవాక్కయ్యారు. పూర్తీ వీడియో ఇక్కడ చూడవచ్చు https://www.facebook.com/TeluguRising.Tr/videos/437689783625790/

మన రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రభుత్వాధి నేత, జగన్ మోహన్ రెడ్డి పై అక్రమాస్తుల కేసులు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన అఫిడవిట్ లో తెలిపిన వివరాలు ప్రకారం మొత్తం 31 కేసులు ఉన్నాయి. అందులో అక్రమాస్తులకు సంబంధించి 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులు ఉన్నాయి. దాదపుగా 16 నెలలు జైల్లో కూడా గడిపి వచ్చారు జగన్ మోహన్ రెడ్డి. తరువాత కోర్ట్ ఆయనకు కండీషనల్ బెయిల్ ఇచ్చింది. ఈ కేసుల్లో జగన్ మోహన్ రెడ్డి A1 కాగా, విజయసాయి రెడ్డి A2 గా ఉన్నారు. మొన్నటిదాక ప్రతి శుక్రవారం జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి కోర్ట్ విచారణకు వెళ్ళే వారు. అయితే, ఆయన ప్రభుత్వంలో బిజీ అయిన దగ్గర నుంచి, ప్రతి శుక్రవారం కోర్ట్ కు వెళ్ళటం లేదు. అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కసారి కూడా విచారణకు వెళ్ళలేదు.

jagan 31072019 2

జగన్ మోహన్ రెడ్డి అంటే ప్రభుత్వ బాధ్యతలు ఉంటాయి కాబట్టి వెళ్ళటం లేదు, మరి విజయసాయి రెడ్డి కూడా ఎందుకు విచారణ హాజారుకావటం లేదో తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే, జగన్ మోహన్ రెడ్డి కండీషనల్ బెయిల్ పై బయట ఉండటంతో, ఆయన విదేశాలకు వెళ్ళాలి అంటే ముందుగా కోర్ట్ పర్మిషన్ తీసుకోవాలి. కోర్ట్ ఒకే అంటేనే జగన్ బయటకు వెళ్ళగలరు. అదీ కాక, కోర్ట్ కొన్ని షరతులు కూడా విదిస్తుంది, వాటిని కూడా ఒప్పుకోవాలి. ఈ నేపధ్యంలో జగన్ మోహన్ రెడ్డి తాను విదేశాలకు వెళ్ళాలి పర్మిషన్ ఇవ్వండి అంటూ సిబిఐ కోర్ట్ లో అర్జీ పెట్టుకున్నారు. దీని పై సిబిఐ కోర్ట్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. జగన్ మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళటానికి అనుమతులు ఇస్తూనే, కొన్ని షరతలు కూడా పెట్టింది.

jagan 31072019 3

ఆగస్టు ఒకటో తేది నుంచి ఆగష్టు 25వ తేదీ మధ్య జెరూసలెం, అమెరికా వెళ్లేందుకు జగన్ మోహన్ రెడ్డికి , సిబిఐ కోర్ట్ అనుమతి ఇచ్చింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీఆర్‌ మధుసూదన్‌రావు అనుమతి ఇచ్చారు. అయితే జగన్ మోహన్ రెడ్డి పర్యటన సమయంలో, సెల్‌ఫోన్‌, ల్యాండ్‌ ఫోన్‌, ఈమెయిల్‌, ఫ్యాక్స్‌ నంబర్లను కోర్టుకు, సీబీఐకి సమర్పించాలని షరతు పెట్టారు. మరో పక్క ఇదే కేసులో A2 గా ఉన్న విజయసాయి రెడ్డి కూడా, తాను కూడా విదేశాలకు వెళ్ళాలని కోర్ట్ ని కోరటంతో, విజయసాయి రెడ్డికి కూడా విదేశాలకు వెళ్లేందుకు కోర్ట్ అనుమతి ఇచ్చింది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి సెప్టెంబరు 30లోగా 50 రోజులపాటు అమెరికా, మలేషియా, సింగపూర్, ఆస్ట్రే లియా తదితర దేశాల్లో పర్యటించడానికి అనుమతి ఇచ్చింది. ఇదే సందర్భంలో ఆయనకు కూడా షరతులు ఇచ్చింది. రూ.2 లక్షల పూచీకత్తుతో బాండు సమర్పించాలని, పర్యటన వివరాలను, టెలిఫోన్‌ నంబర్‌ను కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని, వచ్చాక పాస్‌పోర్టును కూడా ఇచ్చేయాలని షరతు విధించారు.

ఎన్నికల ఫలితాలు తరువాత దాదపుగా కనుమరుగు అయిన పవన్ కళ్యాణ్, గత రెండు మూడు రోజుల నుంచి, తన పార్టీ వ్యవహారాల్లో బిజీ అవుతున్నారు. ఎన్నో సమస్యలు ఉన్నా, పవన్ మాత్రం, జగన్ మోహన్ రెడ్డికి టైం ఇస్తాను అంటున్నారు. నిన్న పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పవన్ పాల్గుని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కొన్ని జాతీయ పార్టీలు తన వద్దకు వచ్చాయని, తముతో కలిసి పని చెయ్యాలని కోరుతున్నాయని అన్నారు. వారితో కలిసినా, లౌకిక పంథాను వదలనని పవన్ కళ్యాణ్ అన్నారు. అంతే కాదు, తాను జగనసేన పార్టీని విలువలు కోసం పెట్టానని, ఆ పార్టీని వేరే పార్టీలో విలీనం చేసే ప్రసక్తే లేదని అన్నారు. అయితే, పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన పై, విశ్లేషణలు మొదలయ్యాయి.

pk 30072019 2

పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పని చెయ్యటానికి సిద్ధమవుతున్నట్టు ఆయన మాటలు చూస్తూ అర్ధమవుతుంది అని అంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ హటావో అనే పిలుపు ఇచ్చారు. బీజేపీ పై ఎప్పుడూ సానుకూలంగా ఉంటూ వచ్చారు. అప్పుడప్పుడు విమర్శలు చేసినా, మోడీ, అమిత్ షా పేరు కూడా ఎత్తకుండా, పవన్ రాజకీయం నడిపారు. చాలా సందర్భాల్లో తనకు మోడీ ఎంతో ఇష్టమైన నాయకుడు అని పవన్ కళ్యాణ్ చెప్పారు. అంతే కాదు పవన్ పనిగట్టుకుని, నేను ఎవరితో కలసినా, లౌకికవాదం వీడను అంటే, దాని అర్ధం ఆయన బీజేపీతో కలిసి వెళ్ళటానికి నిర్ణయం తీసుకున్నారని అర్ధమవుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మొనోహర్, చిరంజీవిని కలిసిన సంగతి తెలిసిందే.

pk 30072019 3

చిరంజీవి, బీజేపీలో చేరతారని, ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపధ్యంలో, పవన్ కళ్యాణ్, చిరంజీవిని కలవటం, ఆ తరువాత, నేను జాతీయ పార్టీతో కలిసి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పటం చూస్తుంటే, పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ప్రయాణం చెయ్యటం, ఖాయంగా కనిపిస్తుంది. అయితే, పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు ప్రధాన ఎజెండాగా, ప్రత్యెక హోదా పెట్టుకున్నారు. తన వల్లే ప్రత్యేక హోదా సజీవంగా ఉందని చెప్పుకునే వారు. మరి ఇప్పుడు బీజేపీ, అసలు హోదా లేదు అని తేల్చి చెప్పింది. అలాంటిది, పవన్ ఆ పార్టీలోకి ఎలా వెళ్తారు అనే వాదన కూడా వినిపిస్తుంది. మరో పక్క, కొన్ని రోజుల క్రిందట పవన్ మాట్లాడుతూ, ప్రత్యెక హోదా పై జనాల్లో అసలు ఏమి లేదని, తాను ఒక్కడినే పోరాటం చేస్తే ఏమి లాభం అని చెప్పిన విషయాలు ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. అంటే పవన్ , బీజేపీతో కలిసి వెళ్ళే ఆలోచన ఉంది కాబట్టే, మొన్నటి దాక, తానె ప్రత్యేక హోదా ప్రతినిధిని అని చెప్పుకున్న పవన్, ఇప్పుడు మాత్రం, హోదా సెంటిమెంట్ ప్రజల్లో లేదు అని చెప్పేసారు. ఏది ఏమైనా, మన రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు చూడబోతున్నాం.

కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రతిపక్షంలో ఉండగా ఎన్నో హామీలు ఇచ్చారు, మాట తప్పరు, మడం తిప్పరు అని చెప్తారు, ఇక మన జీవితాలు మారిపోతున్నాయి, సంతోషమే సంతోషం అని భావించిన వివిధ వర్గాల ప్రజలు, రాష్ట్రంలో పోరాట బాట పడే పరిస్థితి వచ్చింది. ఇసుక లేక కూలి పని చేసుకునే వారి దగ్గర నుంచి, చిరు ఉద్యోగులు దాకా, మా జీవితాలు మార్చేస్తాడని నమ్మి జగన్ కు ఓటు వేశాం, ఇప్పుడు కనీసం పనులు లేక, ఉద్యోగ భద్రత లేక, రోడ్డున పడ్డాం అంటూ, రోజుకి ఒక వర్గం ప్రజలు, ఆందోళనలు చేస్తూ, ఉద్రిక్త పరిస్థితులు ఉండటం, మనం చూస్తున్నాం. ఈ రోజు వంతు, ఏపీలో ఏఎన్ఎంలది. తమకు కొత్తగా వస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల, తమ ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తూ, వారు ఈ రోజు ధర్నా చేసారు.

dharna 30072019 2

తమకు ఉద్యోగ భద్రత కలిగించాలని, కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. కొత్తగా వస్తున్న గ్రామ సచివాలయ పోస్టుల్లో ముందుగా తమకే ప్రాధాన్యం ఇవ్వాలని, తమ ఉద్యోగాలను ముందుగా క్రమబద్ధీకరించిన తరువాతే, కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఈ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచామని, ప్రతి రోజు ఆందోళన చేస్తున్నామని, అసెంబ్లీ జరుగుతున్నా సరే, మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదని వారు ఆందోళన చేసారు. ఈ రోజు డీఎంహెచ్‌వో కార్యాలయాల ముట్టడికి ఏఎన్‌ఎంలు ప్రయత్నించారు. అయితే ఏఎన్‌ఎంలు చేసిన ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, వారిని ఈడ్చి అవతల పడేసారు. ఆడవాళ్ళు అని కూడా చూడకుండా, విచక్షణ లేకుండా ప్రవర్తించారు.

dharna 30072019 3

దీంతో కొంత మందికి గాయాలు కూడా అయ్యాయి. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తాము ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, తమ కళ్లల్లో జగన్ ప్రభుత్వం కారం కొట్టిందని ఏఎన్‌ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరి ఆందోళన పై చంద్రబాబు స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు, ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఉన్న ఉద్యోగాలు ఊడబీకి, కొత్త వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తూ, ఇదే ఉద్యోగ కల్పన అంటూ ప్రచారం చేస్తున్న వీరిని ఏమనాలో అర్ధం కావటం లేదని అన్నారు. పెర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఎందుకు ఇచ్చారని నిలదీశారు. తమ సమస్యలు చెప్పుకుందామని వస్తే ఇంటి చుట్టూ 144 సెక్షన్ పెట్టుకుంటారా? ఇది సీఎం ఇల్లా లేక లోటస్ పాండ్ లాంటి ప్రైవేటు రాజభవనమా?" అంటూ చంద్రబాబు ట్వీట్ చేసారు. ఒక్కరి ఉద్యోగం కూడా తియ్యటానికి వీలు లేదని, హామీ నిలబెట్టుకోవాలని చంద్రబాబు కోరారు.

Advertisements

Latest Articles

Most Read