అమరావతిలో రైతులను, వైసీపీ నేతలు, ఎలా హేళన చేస్తూ ప్రకటనలు చేస్తూ ఉన్నారో చూసాం. అమరావతి రైతులు, బ్రోకర్లుని, వారి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అని, వారు పైడ్ ఆర్టిస్ట్ లు అని, ఇలా ఇష్టం వచ్చినట్టు, అమరావతి రైతుల పై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసారు. ఇక అమరావతిని భ్రమరావతి అని, మరో పక్క ఎడారి అని, మరో పక్క స్మశానం అని, ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మాటలు వింటూ వచ్చాం. ఇదే కోవలో, ఎమ్మెల్యే రోజా, ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అమరావతి రైతులు పైడ్ ఆర్టిస్ట్ లు అని, అలాగే మహిళలను ముందు పెట్టి, వెనుక ఉండి హడావిడి చేస్తున్నారు అని, రోజా ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే, ఎమ్మెల్యే రోజా, ఈ రోజు అమరావతి ప్రాంతంలో ఉన్న, నీరుకొండ SRM యూనివర్సిటీలో జరుగుతున్న, సమ్మిట్ లో పాల్గొనెందుకు, రోజా ఇక్కడకు వచ్చారు. ఒక పక్క 65 రోజులుగా ఇక్కడ నిరసనలు చేస్తుంటే, కనీసం అమరావతి రైతుల వద్దకు ఒక్కరు కూడా రాలేదు.

roja 20022020 2

రోజా రాకను తెలుసుకొని యూనివర్సిటీ వద్దకు భారీగా రైతులు చేరుకున్నారు. యూనివర్సిటీ ప్రాంతాలు ఉద్రిక్తంగా మారడంతో సమ్మిట్ నుంచి మధ్యలోనే, రోజాను పంపించేసారు పోలీసులు . రోజాను బయటకు రాకుండా అడ్డుకోవాలని యూనివర్సిటీని అన్ని వైపులా రైతులు దిగ్బంధించారు. యూనివర్సిటీ వద్ద రైతులు గ్రామాల నుంచి భారీగా చేరుకుంటుండంతో రోజాను హై సెక్యూరిటీ మధ్య బయటకు తీసుకొచ్చి పోలీసులు పంపించారు. అయితే ఇదే సందర్భంలో, రోజా వాహనంలో కాకుండా, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాహనంలో, రోజాను పోలీసులు తరలించారు. అయితే, ఇదే విషయం తెలుసుకున్న రైతులు, రోజాని అడ్డుకున్నారు. నేలపాడు srm యూనివర్సిటీ వద్ద నుండి
గుంటూరు వైపు వెళ్తుండగా పెద పరిమి వద్ద రోజా వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు.

roja 20022020 3

వాహనాన్ని ముందుకు వెళ్లకుండా మహిళలు, రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు జై అమరావతి అని అనాలని, మా పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కోరారు. అయితే రోజా మాత్రం ఇందుకు ససేమీరా అని చెప్పి, కారులో అలాగే కూర్చున్నారు. మేము జై అమరావతి అని చెప్పమంటే, ఆమె ఫోన్ లో వీడియో గేమ్ లు ఆడుకుంటూ, కూర్చున్నారు అని, కనీసం మాతో మాట్లాడటం లేదని రైతులు వాపోతున్నారు. రోజా జై అమరావతి అని చెప్పే దాకా, మేము ఇక్కడ నుంచి వెళ్ళం అని చెప్పారు. పోలీసులు భారీగా చేరుకొని, మహిళలను తోసేసే ప్రయత్నంలో, ఒక మహిళకు తీవ్ర గాయాలు అవ్వటంతో, ఆమెతో కలిసి ర-క్తం కారుతూ ఉన్న కాలుతోనే, రోజా కారు ముందే ధర్నా చేస్తున్నారు. పోలీసులు అందరినీ అక్కడ నుంచి తప్పించి, రోజాని క్షేమంగా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read