వైఎస్ఆర్ వారసుడిని అని చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ తెగువ మాత్రం చూపించలేక పోతున్నారు. రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండగా, ఈనాడు, ఆంధ్రజ్యోతి తమ ప్రభుత్వం పై ఎక్కి తొక్కుతున్నాయని, వాటిని కాంగ్రెస్ పార్టీ వారు ఎవరూ చూడద్దు అని చెప్పారు కాని, ఏ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని, వాటిని బ్యాన్ చెయ్యటానికి చూడలేదు. తన సాక్షి ఛానల్ స్థాపించుకుని, కాంగ్రెస్ పార్టీ చెప్పాలి అనుకున్నది చెప్పేవారు. అదే సమయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పై రాజకీయంగా విమర్శలు చేస్తూ ఎదుర్కునే వారు. అయితే ఇప్పుడు ఆయన కొడకు జగన్ మోహన్ రెడ్డి మాత్రం అందుకు బిన్నం. తన చేతిలో ఒక టీవీ, ఛానల్ ఉన్నా, దానితో ప్రతిపక్షం పై, ప్రతి రోజు విషం చిమ్ముతున్నా సరే, మిగతా ఛానెల్స్ విషయంలో జగన్ తట్టుకోలేకపోతున్నారు. తన ప్రభుత్వం పై చిన్న చిన్న విమర్శలు చేసే సోషల్ మీడియా వ్యక్తులను కూడా ఉపెక్షించలేని స్థితిలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి,

jagan 130892019 2

ఇప్పుడు తన ప్రభుత్వం పై వ్యతిరేక కధనాలు, తన ప్రభుత్వ లోపాలు ఎత్తి చూపే ఛానెల్స్ పై కక్ష తీర్చుకునే పనిలో ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి ధైర్యంగా ఎదుర్కుంటే, జగన్ మాత్రం వాళ్ళని ఎదుర్కోలేక, ఆ ఛానెల్స్ ని బ్యాన్ చేసారు. తాజాగా జరిగిన చలో ఆత్మకూరు ఘటన, ప్రభుత్వానికి విపరీతమైన చెడ్డ పేరు తెచ్చి పెట్టింది. చివరకు ప్రత్యర్ధులు తమ ఇంటికి వెళ్ళకుండా గోడ కట్టారు అంటే, ఆ చిన్న గోడ కూడా తీపించలేని వ్యవస్థలో మనం ఉన్నాం అంటూ ఆ టీవీ ఛానెల్స్ ప్రచారం చేసాయి. అలాగే వైసిపీ మనుషులే కొట్టి, మళ్ళీ బాదితుల పై కేసులు పెట్టటాన్ని కూడా ఈ ఛానెల్స్ బాగా చూపించాయి. చలో ఆత్మకూరు సందర్భంగా, హోం మంత్రి బాధితులను పైడ్ ఆర్టిస్ట్ లు అనటం, అలాగే చంద్రబాబు ఇంటికి తాళ్ళు కట్టటం, ఇవన్నీ ప్రజల్లోకి బాగా వెళ్లి, ప్రభుత్వం ఎంత భయపడుతుందో అనే అభిప్రాయాన్ని కలిగించాయి. చివరకు ప్రభుత్వం దిగి వచ్చి, ఆ బాధితులు నిజమే అని ఒప్పుకోవాల్సిన పరిస్థితి కలిగింది.

jagan 130892019 3

దీంతో ఇక ఆ ఛానెల్స్ పని పట్టటానికి సిద్ధం అయ్యారు. ముందుగా తన పై పూర్తీ ఫోకస్ పెట్టిన ఏబీఎస్ ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానెల్స్ ను రెండు రోజుల నుంచి బ్యాన్ చేసారు. అలాగే ఏపి ఫైబర్ నెట్ లో కూడా వీటిని తొలగించారు. జగన్ అధికారంలోకి రాగానే, ఏబీఎన్ ఛానెల్ ని, 651 నెంబర్ కి మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పూర్తిగా బ్యాన్ చేసారు. అయితే, రెండు రోజుల ముందు, మంత్రులు, కేబుల్ ఆపరేటర్లకు ఆదేశాలు ఇచ్చి, ఆ రెండు ఛానెల్స్ ఆపేయమని చెప్పటంతో, చాలా మంది ఆపేశారు. అలా చేస్తే ఇబ్బందులు వస్తాయి, ట్రాయ్ నిబంధనలు అడ్డు వస్తాయి అని కొంత మంది చెప్పగా, నీ కేబుల్ లో నుంచి రేపటి నుంచి, ఏపి ఫైబర్ నెట్ వస్తుంది అంటూ బెదిరించారు. దీంతో, వారు కూడా బ్యాన్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తానికి, జగన్ మోహన్ రెడ్డి యువకుడు, ధీటుగా ఎదుర్కుని సమాధానం చెప్తాడు అనుకుంటే, సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిన చిన్న పిల్లకాయలను నుంచి ఛానెల్స్ వరకు బ్యాన్ చేసుకుంటూ వెళ్తూ, తన వైఖరిని తానే బయట పెట్టుకుంటున్నాడు. రాను రాను ప్రశ్నించే గొంతుని, పాలకులు తట్టుకేలక పోతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read