అందరూ అనుకున్నట్టే, లోకేష్ పాదయాత్ర మొదటి రోజు గడిచిందో లేదో కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టింది ఏపి ప్రభుత్వం. అయితే ఇది లోకేష్ పైన కాదు,  అచ్చెన్నాయుడు పైన. నిన్న లోకేష్ పాదయత్ర సభలో,  అచ్చెన్నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా, ఆయన వైసీపీ చేస్తున్న అరచాకలకు, వారికి వంత పాడుతున్న పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని, రూల్స్ పాటించకుండా తమని ఇబ్బంది పెడుతున్న పోలీసుల అంతు చూస్తామని అన్నారు. అలాగే నిన్న లోకేష్ కు ఇచ్చిన సెక్యూరిటీ పై కూడా  అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. 500 మంది భద్రత ఇచ్చామని చెప్తున్నారని, ఎక్కడున్నారని, వారంతా దె** తిని పడుకున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. దీని పైన పోలీసులు  అచ్చెన్నాయుడు పై కేసు నమోదు చేసారు.  అచ్చెన్నాయుడు రెచ్చగొట్టే ప్రసంగం చేసారు అంటూ, పోలీసులు కేసులు పెట్టారు. దీంతో తెలుగుదేశం నేతలు మండి పడుతున్నారు. నోరు తెరిస్తే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు పోలీసులని బూతులు తిడుతున్నా కేసులు ఉండవు అని, తమ ఆవేదన చెప్తుంటే, తమ పై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read