గాడిదలు కాస్తున్నావా , దొబ్బెయ్.. అంటూ రెండు రోజుల క్రితం అసెంబ్లీలో వైసిపీ మంత్రులు ఈ మాటలు అనటం విన్నాం. ఈ రోజు మరింత ముందుకెళ్ళి బూతులు కూడా తిడ్తున్నారు. నీ యమ్మ అంటూ ప్రతిపక్ష సభ్యులని తిడుతున్నారు. ఈ రోజు అసెంబ్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్యూస్షన్ హావర్ జరుగుతున్న సమయంలో, రేపల్లె ఎమ్మేల్యే అనగాని సత్య ప్రసాద్ అడిగిన ప్రశ్నలు, మంత్రి పేర్ని నాని సమాధానం ఇస్తున్న సమయంలో, ఈ దుమారం రేగింది. మంత్రి ప్రకటన పై టిడిపి నేతలు అభ్యంతరం చెప్పటంతో, తన పని తాను చేసుకుంటున్న అచ్చెన్నాయుడు పై పెర్ని నాని బూతులు మాట్లడారు. ఇక్కడే మన టెక్కలి ఎమ్మెల్యేగా ఉన్న అచ్చెన్నాయుడుని అక్కడి ప్రజలు అసహ్యించుకుంటున్నారు, నీ యమ్మ, ఇతన్ని ఎందుకు అసెంబ్లీకి పంపించామా అనుకుంటున్నారు అంటూ, బూతులు మాట్లాడారు. నీయమ్మ అని పేర్ని నాని అనగానే, జగన్ మోహన్ రెడ్డి పకపకా నవ్వుతూ ఆ మాటలని ఎంజాయ్ చేసారు.

దీని పై అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. తన పని తాను చేసుకుంటుంటే, తనను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారని, తాను ఏమన్నా సభలో రౌడీయిజం చేశానని అని, బయటకు రా నీ అంతు చూస్తాం అంటున్నారని, బాధ పడ్డారు. తాను ఎక్కడైనా తప్పుడు పనులు చేస్తే, చెప్పండి, నేను అసెంబ్లీకి రాను అని చెప్పారు. మంత్రి మాట్లాడిన బూతులకు తెలుగుదేశం పార్టీ క్షమాపణ కోరింది. అయితే ఈ దశలో సభలో గందరగోళం ఏర్పడింది. వరుస పెట్టి వైసిపీ నేతలు మాట్లాడుతూ, ఎంతో అద్భుతమైన బడ్జెట్ ప్రవేశ పెట్టమని, ఈ చర్చ చెయ్యకుండా ఉండేదుకు, తెలుగుదేశం పార్టీ గొడవ చేస్తుందని ఆరోపించారు. అక్కడ నీ యమ్మ అంటూ కవ్వించింది వైసిపీ మంత్రి అయితే, తెలుగుదేశం సభ్యులనే ఎదురు తిడుతున్నారు. ఇన్ని బూతులు తిడుతున్నా, జగన్ మాత్రం, పకపకా నవ్వారు కాని, అది తప్పు అని మాత్రం, ఖండించలేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read