భావితరాల భవిష్యత్‌ తలచుకొని, రాష్ట్రపౌరుడిగా తీవ్రమైన ఆందోళనకు లోనవుతు న్నానని, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధకలుగుతోందని, మున్ముం దు ప్రజలు ప్రశాంతంగా బతికే పరిస్థితులు ఉంటాయా అన్న అనుమానం తనను కలచివేస్తోందని టీడీపీ శాసనసభాపక్షనేత, మాజీమంత్రి, కింజారపు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 151స్థానాలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేస్తాడని భావించానని, కానీ రాష్ట్రాన్ని భూస్థాపితం చేయాలన్నవిధంగా, 8మాసాలనుం చి ఏపీని గొడ్డలితో నరికినట్లుగా వ్యవహరిస్తున్నాడని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. భవిష్యత్‌లో ఎవరువచ్చినా బాగుచేయలేని విధంగా రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముక్కలు చేశాడన్నారు. రాష్ట్ర శాసనసభ జరిగిన తీరుచూస్తుంటే వైసీపీ కార్యాలయాన్ని తలపిస్తోం దని, బీ.ఏ.సీ సమావేశం నిర్వహించకుండా సభను నిర్వహించారన్నారు. తొలుత బీ.ఏ.సీ సమావేశంలో మూడురోజులు నిర్వహిస్తామని చెప్పినప్పుడు, సభలో చర్చించేది అతిముఖ్యమైన బిల్లుల గురించి కాబట్టి, సమయం సరిపోదని టీడీపీ పక్షాన చెప్పడం జరిగిందన్నారు.

అవేమీ లెక్కచేయకుండా ఒకగంటలోనే మూడురాజధానుల బిల్లుని ఆమోదించి, మండలికి పంపారన్నారు. మొట్టమొదటిసారి మండలిలో జరిగిన నిర్ణయంపై అసెంబ్లీలో చర్చించారని, చరిత్రలో ఎన్నడూలేనివిధంగా మండలిరద్దుపై అజెండా ఇవ్వడం జరిగిం దన్నారు. నేడు శాసనసభ ఆరంభమయ్యేముందు బీ.ఏ.సీ సమావేశం ఉంది రావాలంటూ తనకు ఫోన్‌చేశారని, ఒకహెలికాఫ్టర్‌ పంపితే మీరుకోరి నట్లుగా వెంటనే హాజరవు తానని తాను చెప్పడం జరిగిందని మాజీమంత్రి తెలిపారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకం గా మండలిరద్దుకు పూనుకున్న ప్రభుత్వం, ఆఘమేఘాలపై అసెంబ్లీని నిర్వహించింద న్నారు. సర్వాధికారాలున్నాయన్న అహంకారంతో మండలిపై వైసీపీ ప్రభుత్వం మూకు మ్మడి దాడికి పాల్పడిందన్నారు. శాసనమండలి ఈ 8నెలల్లో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చి న ఎలాంటి ప్రజోపయోగ నిర్ణయాలను అడ్డుకుందోచెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. 6 రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలులు ఉన్నాయంటున్న జగన్‌, దేశంలో ఎన్ని రాష్ట్రాలకు మూడు రాజధానులున్నాయో చెప్పాలన్నారు. 7 మాసాల్లో 32బిల్లులు మండలికి వస్తే దేన్ని తిరస్కరించలేదని, కేవలం మూడురాజధానులపేరుతో రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటున్న ప్రభుత్వఏకపక్ష చర్యనే పెద్దలసభ అడ్డుకుందన్నారు.

తను తీసుకున్న నిర్ణయాలను మండలి వ్యతిరేకిస్తుందన్న అక్కసుతోనే జగన్‌ మండలి రద్దుకు పూనుకున్నాడని, తద్వారా ఆయన బడుగు, బలహీనవర్గాలవారి వేదిక లేకుండా చేశాడన్నారు. తొలిశాసనసభ సమావేశాల్లో దేశానికి ఆదర్శంగా ఉంటానని, ఏపీ శాసనసభ దేశానికి ఆదర్శంగా ఉండాలని చెప్పిన జగన్‌, టీడీపీకి చెందిన సభ్యుల్ని భయపెట్టి, ప్రలోభపెట్టి సిగ్గులేకుండా తనపార్టీలోకి తీసుకున్నాడని మాజీమంత్రి మండిపడ్డారు. ఓడిపోయినవారికి రాజకీయవేదికగా మండలి మారుతుందని చెబుతున్న స్పీకర్‌, ఇతరసభ్యులు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. తన ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి బడుగు, బలహీనవర్గాలవారు పనికిరారన్న జగన్మోహన్‌రెడ్డి, సలహాదారులు గా తనసామాజికవర్గం వారికే ప్రాధాన్యత ఇచ్చాడన్నారు. మొత్తంసభ్యుల్లో 50శాతానికి పైగా బడుగు, బలహీనవర్గాల సభ్యులున్న మండలిని రద్దుచేయాలనుకుంటున్న జగన్‌, ఆయాసామాజి కవర్గాలను తన అధికారంతో తొక్కేశాడన్నారు.

పదవులు పోతాయని తెలిసినా లెక్కచేయకుండా, అధికారపార్టీ ప్రలోభాలకు లొంగకు ండా, ప్రజలపక్షాననిలిచి, రాష్ట్రంకోసం పోరాటం చేసిన తెలుగుదేశం, ఇతర అనుబంధ విభాగాల మండలిసభ్యులందరి కాళ్లకు నమస్కారం చేస్తున్నామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు రాష్ట్రాభివృద్ధిని, అభివృద్ధి వికేంద్రీకరణను అడ్డుకున్నారని చెప్పడం సిగ్గుచేటన్నారు. గడచిని 5ఏళ్లలో టీడీపీ ప్రభుత్వం, జిల్లాలవారీగా అభివృద్ధి వికేంద్రీకరణను చేపట్టిందని, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు సాగునీటిప్రాజెక్టులతోపాటు, పరిశ్రమల్ని తీసుకొచ్చిన విషయాన్ని వైసీపీ సభ్యులు, మంత్రులకు తెలియకపోవడం వారిఅజ్ఞానానికి చిహ్నమన్నారు. టీడీపీ హాయాంలో ప్రారంభమైన అనేకపనుల్ని, డబ్బుపిచ్చితో వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందన్నా రు. 7నెలల్లో వైసీపీ ప్రభుత్వంవచ్చాక పశ్చిమగోదావరి జిల్లాకు ఏంచేసిందో మంత్రి ఆళ్లనాని చెప్పాలని, టీడీపీసభ్యులను ఆయనే స్వయంగా తీసుకెళ్లి, తమప్రభుత్వం ఆ జిల్లాకు ఏంచేసిందో చూపి, దాన్ని నిరూపించగలిగితే, తాను రాజకీయసన్యాసం తీసుకుంటానని అచ్చెన్నాయుడు సవాల్‌విసిరారు. టీడీపీపాలనలో పశ్చిమగోదావరిలో జరిగిన అభివృద్ధిని నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read