రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత, అమరావతి లాంటి ప్రతిష్టాత్మిక ప్రాజెక్ట్ కు రుణాలు ఇస్తాం అని చెప్పిన బ్యాంకులు కూడా, వెనక్కు వెళ్ళిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమరావతి విషయంలో, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు, రుణం ఇవ్వటానికి, అమరావతిలో క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తామని, పర్మిషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటంతో, రాష్ట్రం దాని పై ఏమి స్పందించక పోవటంతో, ప్రపంచ బ్యాంక్ ఇచ్చే రుణం ఆగిపోయిన సంగతి తెలిసిందే. తరువాత ఇదే వరుసలో ఎసియన్‌ డెవలప్‌మెంటు బ్యాంకు కూడా అమరావతి నుంచి తప్పుకుంది. నిన్న కాక మొన్న, స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురుపించింది. మీకు రుణం ఇవ్వాలంటే, మీకు తీర్చే శక్తి ఉండాలి కదా, మీ పరిస్థితి బాగోలేదు అని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే కొత్త రుణాలు ఇవ్వటానికి బ్యాంకులు ముందుకు రావటం లేదనే విషయం ఇక్కడ స్పష్టం అవుతుంది.

adb 18102019 2

అయితే కొత్త రుణాలు సంగతి తరువాత, ఇప్పటికే ఇచ్చిన రుణాల పై, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో, కేంద్రం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాశక్తిలో వచ్చిన కధనం ప్రకారం, విశాఖ- చెన్నై పారిశ్రామిక క్యారి డార్‌ నిర్మాణానికి ఎసియన్‌ డెవలప్‌మెంటు బ్యాంకు రుణం ఇచ్చింది. అయితే ఈ రుణం పక్కదారి పట్టిందనే విషయం ఇప్పుడు గుర్తించారు. ప్రభుత్వం పనులు చేపించుకుని, బిల్లులు ఇవ్వకపోవటంతో, పనులు చేసిన కాంట్రాక్టర్ లు, ఇక మా వల్ల కాదు అంటూ, మేము ఇక పనులు చెయ్యలేం అంటూ నోటీసులు ఇస్తున్నారు. దీంతో కేంద్రం కూడా ఈ విషయం పై అసంతృప్తితో ఉంది. రాష్ట్రంలో నిర్మిస్తున్న విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు ఏషియన్‌ డెవలప్‌మెరట్‌ బ్యారకు దాదాపు 2600 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసిన విషయం తెలిసిందే.

adb 18102019 3

అయితే ఇందులో, 960 కోట్ల రూపాయలు ఇప్పటికే విడుదల చేసింది. అయితే నిబంధనలు ప్రకరం, ఇప్పటికే విడుదల చేసిన నిధులలో ఐదు వందల కోట్ల రూపాయల వరకు పనులు జరగాలన్నది లక్ష్యం. అయితే ఇప్పటికే, 350 కోట్ల రూపాయల పనులను కాంట్రాక్టర్లు పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా, ఆ 350 కోట్ల పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు మాత్రం కొన్ని నెలలుగా చెల్లిరచలేదని ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక సమావేశరలో గుర్తిరచారు. దీని పై పరిశీలన చేయగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా చెల్లించకపోవడంతో పాటు, విడుదల చేసిన మొత్తాన్ని కూడా ఇతర అవసరాలకు మళ్లిం చినట్లు తేలింది. దీంతో అటు పని చేసిన కాంట్రాక్టర్లతో పాటుగా, ఇటు కేంద్రం కూడా రాష్ట్రం పై అసహనం వ్యక్తం చేస్తుంది. వెంటనే ఇది కరెక్ట్ చెయ్యాలని, కేంద్రం ఆదేశించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read