ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్‌ల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో సమర్పించిన ఒక పత్రంలో సిబ్బంది చేసిన చిన్న పొరపాటు కొద్దిసేపు పార్టీ వర్గాలను గందరగోళపరిచింది. కుప్పం నుంచి పోటీ చేస్తున్న చంద్రబాబు, మంగళగిరి అభ్యర్థి లోకేశ్‌లు తమ ఓటు హక్కు ఎక్కడుందో తెలియజేస్తూ అధికారిక పత్రాన్ని నామినేషన్‌ పత్రాలతో జతపర్చారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో నివసిస్తున్న వారు అక్కడే ఓటు నమోదు చేసుకున్నారు. దీన్ని ధ్రువీకరిస్తూ తాడేపల్లి తహసీల్దార్‌ కార్యాలయం మంజూరుచేసిన పత్రాలలో తండ్రి అనే కాలమ్‌ వద్ద భర్త అని ఆంగ్లంలో ఉంది. దీన్ని గమనించకుండానే అధికారులు సంతకం చేసేశారు.

jenda 24032019

చంద్రబాబునాయుడు నారా.. భర్త ఖర్జూరనాయుడు నారా అని ఒక పత్రంలో, లోకేశ్‌ నారా.. భర్త చంద్రబాబునాయుడు అని మరో పత్రంలో ఉన్న పొరపాటు అధికారుల దృష్టికి ఆలస్యంగా వచ్చింది. వారు స్పందించి సంబంధిత ధ్రువపత్రాలను మళ్లీ మంజూరు చేశారు. గుమాస్తా తప్పిదంగా గుర్తించామని, దీని వల్ల నామినేషన్ల ఆమోదానికి ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు తెలిపారు. అయితే ఈ పొరపాటును గుర్తించిన వైసీపీ, ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియా టీం, ఇదేదో పెద్ద స్కాం అయినట్టు, దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయటం మొదలు పెట్టారు. ప్రజా సమస్యలు ఏమి లేక, ఇలాంటివి ప్రచారం చేస్తూ, ఆనందం పొందుతున్నారు.

jenda 24032019

మంగళగిరి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి, మంత్రి నారా లోకేష్ స్తిర, చర ఆస్తులు, అప్పుల వివారాలను ఎన్నికల అధికారులకు తెలిపారు. తన భార్యా, కుమారుడి పేరిట ఉన్న ఆస్తుల వివరాలను అఫిడవిట్ లో ఆయన వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రిట్నరింగ్ అధికారికి ఆయన తన ఆస్తులు, అప్పుల వివరాలతో కూడిన అఫిడవిట్‌ను సమర్పించారు. తనపై ఎలాంటి కేసులు లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన దగ్గర 253 కోట్ల 68 లక్షల విలువైన ఆస్తులు ఉన్నాయని లోకేశ్ అఫిడవిట‌్‌లో పేర్కొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read