అది 2017వ సంవత్సరం. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు దగ్గర ఒక ప్రై-వే-టు ట్రా-వె-ల్స్ బస్సు ఘో-ర ప్ర-మా-దా-ని-కి గురయ్యింది. 9 మంది ప్రా-ణా-లు కూడా కోల్పోయారు. దీంతో అప్పట్లో ఇది రాజకీయంగా కూడా ర-చ్చ అయ్యింది. అప్పటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి, ఆ రోజు మధ్యానమే హైదరాబాద్ నుంచి వచ్చారు. నేరుగా మృ-త-దే-హా-లు ఉన్న హాస్పిటల్ కు వెళ్ళారు. అయితే అక్కడ నుంచి నేరుగా పో-స్ట్ మా-ర్టం గదిలోకి వెళ్ళిపోయారు. అక్కడ డాక్టర్ ల దగ్గర ఉన్న నివేదికలు లా-క్కు-న్నా-రు. సార్, ఇది మీకు సంబంధించింది కాదు, మీకు వేరే ఇస్తాను అని చెప్పినా, వినకుండా లా-క్కు-న్నా-రు. అక్కడే ఉన్న అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు. మీరు అంటే చాలా గౌరవం ఉంది, మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు అంటూ, జగన్ చేతిలోని పేపర్స్ తిరిగి లా-క్కు-న్నా-రు. దీంతో జగన్ భ-గ్గు-మ-న్నా-రు. నిన్ను జైలుకి తీసుకుపోతా అంటూ కలెక్టర్ అహ్మద్ బాబు పై చేసిన సీన్, ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. జగన్ తో పాటుగా, మిగతా నేతలు కూడా కలెక్టర్ తో పాటు, అక్కడ ఉన్న డాక్టర్స్ పై ప్రవర్తించిన తీరు అందరికీ గుర్తుంది. తరువాత దీని పై కేసు నమోదు అయ్యింది. కేసు కొట్టేయాలని అప్పట్లోనే జగన్ హైకోర్టుకు వెళ్ళినా, కోర్టు ఒప్పుకోలేదు. అయితే అప్పట్లో, ఇప్పటి లాగా క-క్ష రాజకీయాలు లేవు కాబట్టి, అప్పటి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. పోలీసులు కూడా ఎందుకు వచ్చింది అనుకున్నారో ఏమో, అప్పట్లో కూడా ఈ కేసు విషయంలో, సరిగ్గా ముందుకు వెళ్ళలేదు. ఈ కేసులో ఏ1గా ఉన్న జగన్ కు నోటీసులు కానీ, విచారణ కానీ, స్టేషన్ బెయిల్ కానీ, కోర్టులో హాజరు పరచటం కానీ ఏది జరగలేదు. జగన్ మినహా మిగతావారికి నోటీసులు ఇచ్చారు, కొంత మంది సాక్ష్యులను విచారణ చేసారు.

collector 05112020 2

అలాగే అప్పటి వీడియో ఆధారాలు సేకరించారు. అయితే కీలకమైన కలెక్టర్ అహ్మద్ బాబు స్టేట్మెంట్ మాత్రం నమోదు చేయలేదు. ఆయన అందుబాటులో లేరని రాసారు. తరువాత పాదయాత్రలో జగన్ ఉన్నారు కాబట్టి, నోటీసులు ఇవ్వలేక పోయాం అని రికార్డులలో రాసారు. ఇక తరువాత ఈ కేసు ప్రజాప్రతినిధుల పై ఉన్న కేసులకు సంబంధించి ప్రత్యెక కోర్టుకు చేరుకుంది. అయితే ఈ కేసు చూసిన కోర్ట్ విస్తుపోయింది. ఏ1 గా ఉన్న వారికి నోటీస్ ఇవ్వకుండా, విచారణ లేకుండా, స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా, చార్జ్ షీట్ ఎలా వేసారు అంటూ, ప్రశ్నించటంతో, చార్జ్ షీట్ వెనక్కు తీసుకున్నారు. అయితే ఈ లోపు జగన్ అధికారంలోకి వచ్చారు. తరువాత నుంచి సీన్ మారిపోయింది. ఆ ఫిర్యాదు రాజకీయ ఒత్తిళ్ళతో చేసింది, వీడియోకి కంప్లైంట్ కి సంబంధం లేకుండా ఉంది, అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభిప్రాయం తీసుకున్నారు. మి-స్టే-క్ ఆ-ఫ్ ఫ్యా-క్ట్ అంటూ కేసుని తేల్చేసారు. ఇదే విషయం చెప్పి, నందిగామ ఇన్స్పెక్టర్ డీఎస్పీకి లేఖ రాసారు. జగన్ ఎవరినీ ఏమి అనలేదు అని, అధికారుల పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కేవలం డ్రైవర్ మద్యం తాగారా లేదా ని తెలుసుకోవటానికే వచ్చారని రాసారు. డీఎస్పీ కూడా అనుమతి ఇవ్వటంతో, ఇదే విషయాన్ని ఆగష్టు 28న కోర్టుకు చెప్పి, కేసు క్లోజ్ చేసారు. మరి ఆ రోజు నిజంగా జగన్ మంచి ఉద్దేశంతోనే చేసారా అంటే, ఏమో, ఇక అధికారులు చెప్పిన తరువాత ఏమి చేస్తాం. 

Advertisements

Advertisements

Latest Articles

Most Read