రాష్ట్రంలో విమానశ్రయాలు రెండేళ్లుగా ప్రయాణికుల రద్దీతో కళకళలాడాయి. ఈ ఏడాది ఏప్రిల్ మొదలు ఆగస్టు వరకూ వివిద
విమానాశ్రయ నుంచి మొత్తం 17 లక్షల 42 వేల 291 మంది ప్రయాణించారు. గన్నవరం,తిరుపతి, విశాఖ నుంచి రోజురోజుకూ రద్దీ పెరుగుతూ వస్తోంది. తాజాగా కడప విమానాశ్రయం నుంచి సేవలు ప్రారంభించడంతో అక్కడ నుంచి రద్దీ పెరుగుతూ వస్తోంది.

గతే ఏడాది ఏప్రియల్-ఆగస్టు మధ్య కడప నుంచి 2373 మంది ప్రయాణిస్తే, ఈ ఏడాది ఇదే సమయానికి ఏకంగా 11 వేల 962మంది ప్రయాణించారు. ఈ క్రమంలో అక్కడ ప్రయాణికుల వృద్ధి 404 శాతం పెరిగినట్టు కనిపిస్తోంది. కేంద్ర విమానయాన శాఖ తెరపైకి తెచ్చిన ఉడాన్ పథకంలో భాగంగా దేశంలో ఉన్న 70 విమానాశ్ర యాలను కలుపుతూ తక్కువ ధరకు విమాన సౌకర్యం కల్పించిన నేపథ్యంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి విమానాలు నడిపేందుకు ముందుకొచ్చిన విమానయాన సంస్థలకు కేంద్రం ప్రత్యేక రాయితీ ప్రకటించింది.

అక్టోబర్ నుండి కడప నుంచి విజయవాడ, చెన్నెలకు ఇక్కడ నుంచి విమానాలు నడపనుంది. విశాఖపట్నం నుంచి ప్రస్తుత విమాన సేవలు పరిశీలిస్తే, విజయవాడ, ముంబయి, దిల్లీ, హైదరాబాద్, భువనేశ్వర్, పోర్టుబ్లయర్, చెన్నె, కోల్కతా, సింగపూర్,రాయపూర్, జగదల్ పూర్, అహ్మదాబాద్,సింగపూర్, కౌలాలంపూర్, అగర్తలా, కొలంబో, తిరుపతి, అహ్మదాబాద్, కోయంబతూర్, లకు విమానాలు నడుస్తున్నాయి.. విశాఖ నుంచి, విమాన సంస్థలు నడిపేవి, జెట్ ఎయిర్వేస్, ఎయిరిండియా,ఎయిర్ ఆసియా, సిల్క్ ఎయిర్ (సింగపూర్), శ్రీలంకన్ ఎయిర్లైన్స్

విజయవాడ విమానాశ్రయం నుంచి.
దిల్లీ, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూర్, చెన్నె తిరుపతి, పుదుచ్చేరి. విజయవాడ నుంచి, విమాన సంస్థలు నడిపేవి, , ఎయిరిండియా, స్పైస్ జెట్, అలయెన్స్ ఎయిర్, ట్రూజెట్...

తిరుపతి నుంచి, విమానసేవలు....విజయవాడ, హైదరాబాద్, దిల్లీ, విశాఖపట్నం, బెంగళూర్... విమానసంస్థల్లు-ఎయిరిండియా, అలయెన్స్ ఎయిర్, స్పైస్ జెట్, ట్రూజెట్

రాజమహేంద్రవరం నుంచి-చెన్నై, హైదరాబాద్, బెంగళూర్... విమాన సంసలు - జెట్ ఎయిర్ వేస్, స్పైస్ జెట్, ట్రూజెట్

కడప విమానాశ్రయం నుంచి విమానసేవలు హైదరాబాద్, చెన్నై, విజయవాడ (అక్టోబర్ నుంచి ఆరంభం)... విమానసంస్థలు-ట్రూజెట్

Advertisements

Advertisements

Latest Articles

Most Read