మన దేశంలో అజిత్ ధోవల్‌ అనే తెలియని వారు ఉండరు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా తరువాత, సెంటర్ లో అంత కీలక వ్యక్తీ అజిత్ ధోవల్‌. రియల్ జేమ్స్ బాండ్ గా ఆయనకు పేరు ఉంది. జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ ధోవల్‌ ఉన్నారు. ఇది ఒక పదవే అయినా, ఆయన మాత్రం ఒక పెద్ద వ్యవస్థగా ఎదిగారు. మోడీ, అమిత్ షా తీసుకునే ప్రతి నిర్ణయం, అమలు చెయ్యటం వెనుక అజిత్ ధోవల్‌ ఉంటారు. ఆర్టికల్ 370 రద్దు వెనుక, తరువాత ఎక్కడా గొడవలు జరగకుండా చూడటంలో, అజిత్ ధోవల్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దేశ అంతర్గత బాధ్రతే కాకుండా, పొలిటికల్ ఇంటలిజెన్స్ విషయంలో కూడా అజిత్ ధోవల్‌ కీలక పాత్ర పోషిస్తూ, మోడీ, షా లకు, దగ్గర వ్యక్తీగా ఉంటున్నారు. అయితే, ఇంత పవర్ఫుల్ అజిత్ ధోవల్‌ విషయంలో, జగన్ చేసిన ఒక నియామకం, ఆయన ఆగ్రహానికి గురయ్యేలా చేసిందని తెలుస్తుంది. ఈ కారణంగానే, అమిత్ షా కూడా, జగన్ పై ఆగ్రహంగా ఉన్నారని, అందుకే అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదని, ఢిల్లీలో టాక్.

ajitdoval 15122019 2

ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ చీఫ్ గా మనీష్ కుమార్ సిన్హాను నియమించటమే దీనికి కారణం. మనీష్ కుమార్ సిన్హా గతంలో సిబిఐలో పని చేసారు. రెండేళ్ళ క్రితం జరిగిన సిబిఐ వర్సెస్ సిబిఐ గొడవలో, మనీష్ కుమార్ సిన్హా, అమిత్‌షాకు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోబాల్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. కీలక వ్యవస్థలేవీ ఈ దేశంలో తమ పని తాము చేయలేకపోగా, చేస్తున్న వారికి అడ్డుపడ్డాయని ఆయన అజిత్‌ దోవల్‌ ను టార్గెట్ చేస్తూ, అఫిడవిట్ వేసారు. సిబిఐ వర్సెస్ సిబిఐ కేసులో, మనీశ్‌ కుమార్‌ను నాగపూర్‌కి ట్రాన్స్ఫర్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే తన బదిలీ చెల్లదు అంటూ కోర్ట్ కు వెళ్లి, పైన చెప్పిన విధంగా అఫిడవిట్ వేసారు, మనీశ్‌ కుమార్‌ సిన్హా.

ajitdoval 15122019 3

మొత్తంగా 34 పేజీల అఫిడవిట్‌ లో, కేంద్రంలోని పెద్దల పై అనేక ఆరోపణలు చేసారు. నాగపూర్‌నుంచి డిప్యుటేషన్ పై, ఆంధ్రప్రదేశ్ వచ్చారు. దీంతో, మనీశ్‌ కుమార్‌ సిన్హాకు, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పదవి కట్టబెట్టారు జగన్. అజిత్‌ దోబాల్‌ పై సంచలన ఆరోపణలు చేసి, సుప్రీం కోర్ట్ కు వెళ్ళిన మనీశ్‌ కుమార్‌ సిన్హాకు, జగన్ మోహన్ రెడ్డి కీలక పదవి ఇవ్వటం పై, అజిత్‌ దోబాల్‌ తో పాటుగా, అమిత్ షా కూడా ఆగ్రహంగా ఉన్నారు. తాము శిక్షించిన వ్యకిని చేరదియ్యతమే కాక, కీలక పదవి ఇవ్వటం పై, ఢిల్లీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు. తమ పై ఆరోపణలు చేసిన వారికే, కీలక పదవి ఇస్తారా అంటూ, అమిత్ షా కూడా ఆగ్రహంగా ఉన్నారని, జగన్ కు ఢిల్లీలో లభిస్తున్న అవమాలనాలకు, ఇది కూడా ఒక కారణంగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్‌ ప్రకాశ్‌ కారణంగానే ఎంకే సిన్హాను ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా నియమించారని ప్రచారం జరుగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read