అమరావతి రాజధానిలోని భూములను పేదల ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం రెండు వేల నుండి నాలుగు వేల ఎకరాల భూమిని సిద్ధం చేశారు. నవరత్నాల పథకంలో భాగంగా ఇళ్లు లేని పేదవారికి సెంటు భూమి చొప్పున రాష్ట్రంలో 25 లక్షల మంది పేదవారికి ఉగాది నాటికి ఇంటి పట్టాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్రిష్ణా, గుంటూరు జిల్లాలలోని పేదవారందరికి సరిపడ ఇంటి స్థలాల భూమి లేక పోవటంతో రాజధాని ప్రాంతంలోని శాఖమూరు, పెనుమాక, కృష్ణాయపాలెంతో పాటు మరి కొన్ని ప్రాంతాలలో పేదవారి ఇంటి స్థలాల కోసం భూమిని రెవిన్యూ శాఖ గుర్తించింది. రాజధానిలో ఇంటి స్థలం తీసుకోనేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని లబ్ధిదారుల నుండి అంగీకార పత్రం ఇవ్వాలని వారిని కోరుతున్నారు. అయితే విజయవాడలో నివాసముంటున్న తమకు రాజధానిలో ఇంటి స్థలం ఇవ్వటం ఏమి టని వారు ప్రశ్నిస్తున్నారు. ఇంటి స్థలం రాజధానిలో ఇస్తే కూలీ పనుల కోసం విజయవాడ వెళ్లి రావటానికి చాలా ఖర్చలు అవుతాయన్నారు.

amaravatifarmers 20202020 2

గత టీ.డీ.పీ ప్రభుత్వం కాలంలో తమకు ఇళ్లును కేటాయించారని, ఆ సమయంలో ఇంటికి 25 వేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకు ప్రభుత్వానికి చెల్లించామన్నారు. అప్పుడు ఇంటి కోసం అప్పు తెచ్చి ప్రభుత్వానికి డబ్బులు కట్టామని, వాటి గురించి ప్రస్తుత ప్రభుత్వం పట్టించు కోకుండ రాజధానిలో ఇంటి స్థలం ఇస్తామంటే ఉపయోగం ఏమి ఉంటుందని లబ్దిదారులు ప్రశ్నిస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వం రైతుల నుండి 34 వేల ఎకరాల భూమిని సేకరించింది. ఈ భూములలో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ , మంత్రులు, యం. ఎల్.ఏ లు, ఐఎయస్, ఐపియస్, ఉన్నతాధికారులు, ఉద్యోగుల భవనాలను నిర్మిస్తున్నారు. వీటితో పాటు కార్పొరేట్ సంస్థలకు, విద్యా సంస్థ లకు, వైద్యశాలలకు గత ప్రభుత్వం భూములను కూడా కేటాయి చారు. ముఖ్యంగా రహదారులు, పార్కుల నిర్మాణం తో పాటు రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు పాట్లును అభివృద్ది చేసి ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది.

amaravatifarmers 20202020 3

అయితే సార్వతిక ఎన్నికలలో వైసిపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని తరలి ంపుతో పాటు మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. దీంతో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని 65 రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల అభివృద్ది ,రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చామని రాజ ధాని ప్రాంత ప్రజలు, రైతులు అంటున్నారు. నిన్న కృష్ణాయపాలెంలో, భూములు సర్వే కోసం, వచ్చిన అధికారులను, అక్కడ రైతులు అడ్డుకున్నారు. ఒక పక్క మేము ఇక్కడ ఆందోళన చేస్తుంటే, మా భూములు వేరే వారికి ఇవ్వటం ఏమిటి అని నిలదీసారు. దీంతో, దాదాపుగా 426 పై, 7 సెక్షన్ ల కింద ఈ రోజు కేసులు నమోదు చెయ్యటం సంచలనంగా మారింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read