ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీరు చూస్తుంటే, త‌న వీపు త‌న‌కి క‌న‌ప‌డ‌దే సామెత అతికిన‌ట్టు స‌రిపోతుంది. ప్ర‌తీస‌భ‌లోనూ విప‌క్షాల‌పైనా, మీడియాపైనా ఏడుస్తూనే కాలం గ‌డిపేస్తుంటారు. ఈటీవీ, ఏబీఎన్, టివి5తో ఏ మీడియా సంస్థ‌లేని మీ బిడ్డ యుద్ధం చేస్తున్నానంటాడు. సాక్షి ఎవ‌రిది? ఎన్టీవీ ఎవ‌రి ప‌క్షం? టీవీ9 ఎవ‌రి చుట్ట‌మో మాత్రం చెప్ప‌డు. సొంత బాబాయ్ ని ఇంట్లోనే గొడ్డ‌లితో త‌మ్ముడు న‌రికేశార‌నే ఆరోప‌ణ‌ల‌పై సీబీఐ ద‌ర్యాప్తు చేస్తోంది. ఈ గుండె-గొడ్డ‌లిపోటు క‌థ‌ల‌న్నీ ముందుగా తెలిసిన వ్య‌క్తి జ‌గ‌న్ రెడ్డి అని ఏబీఎన్ ఆర్కే ఉతికి ఆరేస్తున్నాడు. సీబీఐ గొడ్డ‌లి వేటు విచార‌ణ‌లన్నీ త‌న ఇంటి చుట్టూ తిరుగుతుంటే, ఒక క‌న్నుని మ‌రో క‌న్ను ఎందుకు పొడుషుకుంటుంది అని అమాయ‌కంగా ప్ర‌శ్నిస్తాడు. జ‌న‌స‌మీక‌ర‌ణ చేసి స‌భావేదిక‌ల‌పై నుంచి త‌న గొడ్డ‌లిపోటు సంగ‌తి మాట్లాడ‌దు.  చంద్ర‌బాబు పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోటేనంటూ సెటైర్లు వేస్తాడు. ఇప్పుడు జ‌నంలోనూ మార్పు వ‌చ్చేసింది. సొంత బాబాయ్ ని చంపేసి..చంద్ర‌బాబుపైకి నెట్టేసి సాక్షిలో నారాసుర ర‌క్త‌చ‌రిత్ర అని రాసిన సంగ‌తి జ‌నాలు ప‌ట్టేశారు. ఇప్పుడు గొడ్డ‌లిపోటు కూడా త‌న ఇంటిదేన‌ని తెలిసిన జ‌గ‌న్ రెడ్డి, చంద్ర‌బాబుని వెన్నుపోటు అనే అర్హ‌త కూడా లేద‌ని ప్ర‌జ‌లు ముక్త‌కంఠంతో ఖండిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read