తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో ఉ-ద్రి-క్త పరిస్థితి నెలకొంది. లక్ష్మీ నరసింహ స్వామి వారి రధం దగ్ధం ఘటనకు నిరసనగా, ఈ రోజు హిందూ సంఘాలు ఆందోళనకు సిద్ధపడటం, పోలీసులు అడ్డుకోవటంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇదే సమయంలో కాలిపోయిన రధాన్ని పరిశీలించేందుకు ఈ రోజు ఆలయానికి వచ్చిన ముగ్గురు మంత్రుల తీరు పై, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆలయ పరిసరాల్లో ని-ర-స-న-ల-తో హోరెత్తించారు. ఈ క్రమంలోనే, కొందరు ని-ర-స-న-కా-రా-లు మంత్రుల కాన్వాయ్ పైకి రాళ్ళు రు-వ్వా-రు. దీంతో అప్రమ్మతమైన పోలీసులు, ముగ్గురు మంత్రులైన వెల్లంపల్లి, విశ్వరూప్, వేణుని సురక్షితంగా గుడి లోపలకు తీసుకు వెళ్ళారు. ఈ సమయంలోనే కొందరు ఆలయం లోపలకు వెళ్లేందుకు ప్రయత్నం చేసారు. మంత్రులను లోపలకు పంపిన తరువాత ఆలయ ద్వారాన్ని మూసేసినా, అక్కడ ఉన్న వారు శాంతించలేదు. బారికేడ్ లను విరగొట్టి మరీ, కల్యాణోత్సవం షెడ్డు వైపుకు దూసుకువెళ్ళారు. వీళ్ళను కంట్రోల్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేసినా, భారీగా తరలివచ్చిన వారిని నిలువరించలేక పోయారు. వైసిపీ ప్రభుత్వం పై వ్యతిరేకంగా నినాదాలు చేసారు.

antarvedi 080920202 1

ఒకేసారి ఎక్కువ మంది రావటంతో, ఒక్కసారిగా ఏమి జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం కనిపించింది. ప్రభుత్వం ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని, కానీ ప్రతి సారీ ఎదో ఒకటి జరుగుతూనే ఉందని అన్నారు. పోలీసుల విచారణ తీరు పైనా, అనుమానం వ్యక్తం చేసారు. నిస్పాక్షికంగా పోలీసులు విచరణ చేసి ఎంతటి వారు ఉన్నా, వదిలి పెట్ట కూడదని అన్నారు. అయితే 15 వ తేదీ లోపు, జరిగిన ఘటన పై పూర్తి నివేదిక తెచ్చుకుని, బాధ్యుల పై చర్యలు తీసుకుంటామని, అప్పటి వరకు టైం ఇవ్వాలి అని చెప్పటంతో, హిందూ సంఘాలు శాంతించాయి. అప్పటి వరకు ఆగి చూస్తాం అని, ప్రభుత్వం ఏమి చేస్తుందో చూస్తాం అని అన్నారు. దీని పై స్పందించిన వెల్లంపల్లి, ఎవరు బాధ్యలు ఉన్న వదిలి పెట్టం అని, ఇప్పటికే అధికారుల పై చర్యలు తీసుకున్నాం అని, విచారణ జరిగిన తరువాత, ఎవరు బాధ్యులు అయితే వారి పై చర్యలు తీసుకుంటాం అని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read