మహిళలపై అత్యా-చార, వేధింపుల కేసు-ల్లో ముద్దాయిలుగా ఉన్న వారికి టికెట్లు ఇచ్చి వైసీపీ...మహిళల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ద్వజమెత్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ....ఎస్సీ మహిళపై అత్యా-చార కేసులో ముద్దాయిగా ఉండి రెండు నెలల జైలు శిక్ష అనుభవించిన గోరంట్ల మాధవ్‌కి హిందూపురం ఎంపీ టికెట్‌, వర-కట్న వేధింపుల కేసులో ముద్దాయిగాఉన్న మార్గాని భరత్‌కి జగన్‌ రాజమండ్రి ఎంపీ టికెట్‌ ఇచ్చారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మద్యం సేవించి మహిళా ఎంపీడీవో ఇంట్లోకి వెళ్లి ఆమె కుటుంసభ్యులను బెదిరించారు. ఆయనపై ఆ మహిళా అధికారి కేసు పెడితే గంటలో బయటకు వచ్చారు. ఆయనపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? దాచేపల్లిలో కాసుమహేష్‌రెడ్డి అనుచరుడు నరేందర్‌రెడ్డి మైనర్‌ బాలికపై అత్యా-చారాం చేస్తే చంద్రబాబు గారు స్పందించేవరకు అతనిపై కేసు నమోదు చేయలేదు. ఇప్పటికి అతనిపై చార్జ్‌సీట్‌ ఎందుకు వేయలేదు. ఒంగోలులో వైసీపీ కార్యకర్త మై-నర్‌ బాలికపై అత్యా-చారం చేస్తే హోంమంత్రి కనీసం పరామర్శించలేదు.

anuradha 09122019 2

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మహిళలపై అత్యా-చారాలు, వేదింపు-లకు సంబందించి 12,653 కేసులు నమోదయ్యాయి. రాయలసీమ ముద్దుబిడ్డను ముఖ్యమంత్రి జగన్‌ అని చెప్పుకుంటున్నారు. కానీ రాయలసీమల్లోనే 9 అత్యా-చారాలు జరిగితే జగన్‌ ఏం చేస్తున్నారు. మద్యాహ్న బోజన మహిళా కార్మికులను వైసీపీ నేతలు వేధిస్తున్నారు. వైయస్‌. రాజశేఖర్‌రెడ్డి అయేషా-మీరా కేసు ను పక్కదారి పట్టించి నిందితులను కాపాడేందుకు ప్రయత్నించలేదా? ఈ కేసుల్లో వెనక్కి తగ్గితే నాకు 25 లక్షలు ఇస్తామని వైయస్‌ చెప్పారని అయేషా మీరా తల్లే స్వయంగా కోర్టులో కోర్టులో సాక్ష్యం చెప్పింది. వాకపల్లి గిరిజనులపై అత్యా-చారం జరిగితే రాజశేఖర్‌రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు. ఇసుక కొరతతో 40 వేల మంది మహిళలు రోడ్డునపడితే ఏ రోజైనా వైసీపీ నేతలు వారిని పరామర్శించారా? ఎమ్మార్వో వనజాక్షి చింతమనేని ప్రభాకర్‌పై కేసు కూడా పెట్టలేదు. కానీ వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేశారు. అసెంబ్లీ లో బూతులు మాట్లాడి, డబుల్‌-మీనింగ్‌ డైలాగ్‌లతో అసెంబ్లీ గౌరవాన్ని కించపర్చేలా వ్యవహిరించిన రోజా మహిళల గురించి నీతులు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. మహిళా అధికారులను జైలుకి పంపిన ఘనత జగన్‌ది. జగన్‌ వల్లే తాను జైలుపాలయ్యాయని ఓ మహిళా ఐఏయస్‌ అధికారి జగన్‌ని కోర్టులోనే తిట్టంది.

anuradha 09122019 3

మహిళా మంత్రులచేత పోర్జరీ సంతకాలు చేయించుకుని వారిని రోడ్డున పడేసిన ఘనత కూడా జగన్‌దే. అలాంటి వ్యక్తి, ఆ పార్టీ నేతలు మహిళల గురించి మాట్లాడుతారా? టీడీపీ హయాంలో దాచేపల్లిలో బాలికపై అత్యా-చారం జరిగితే చంద్రబాబు నాయుగు గారు నిందితుడు పారిపోకుండా 24 గంటల్లోనే ఉ-రి వేసికునేలా చర్యలు తీసుకున్నారు. మహిళల భద్రతపై జగన్‌కి ఎమ్మెల్యే రజనీ సెల్యూట్‌ చేయటం విడ్డూరంగా ఉంది. చిలకలూరిపేట ని.యోవర్గంలోనే ఎమ్యెల్యే రజనీ వల్ల ఓ దళిత కుటుంబం ఆత్మ-హ-త్యకు పాల్పడింది. ముందు ఆమె ముందు ఆమె తన నియోజకర్గంలో పరిస్థితి చక్కదిద్దుకుని తర్వాత మహిళల గురించి మాట్లాడాలి. సోషల్‌మీడియాలో మహిళపై అసభ్యకంగా రాసేవాటిపై చర్యలు తీసుకుంటామని అంటున్నారు. వైసీపీ కార్యకర్తలు నాపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఫించన్‌ పెంపు, అమ్మఒడిపై మాయమాటలు చెప్పి మహిళలను మోసం చేసిన చరిత్ర జగన్‌ది. ముఖ్యమంత్రి చీఫ్‌ కెమెరామెన్‌ భార్యను చంపిన కేసులో నిందుతుడు. జగన్‌ అలాంటి వ్యక్తికి ఉద్యోగమిచ్చి లక్షలు రూపాయలు జీతాలిస్తున్నారు. మహిళల గురించి వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు, అసెంబ్లీలో అసత్యాలు మాట్లాడినట్లు ప్రజల్లో మాట్లాడితే ప్రజలు వారి నాలుక తెగకోస్తారని అనురాధ హెచ్చరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read