రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రమవుతోన్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సర్వీసులన్నింటిని ఎస్మా (ఎసెన్షియల్ సర్వీస్ మెయిన్టనెన్స్ ఆక్ట్ -1977) పరిధిలోకి తీసుకొస్తూ శుక్రవారం ప్రత్యేక ఉత్తర్వులను జారీచేసింది. దీని ప్రకారం ప్రజలకు వైద్యసేవలు, ఇతర సదుపాయాలు అందించేందుకు నిరాకరించినా, పనిచేయటానికి ఆసక్తి కనబర్చకపోయినా వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఆరు నెలల పాటు ఈ చట్టం రాష్ట్రం అమలులో ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని వైద్యసేవలు, డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది (మెడికల్), మందుల కొనుగోలు, నిర్వ హణ, రవాణా, అమ్మకం, మందుల తయారీ, ఆంబులెన్స సర్వీసులు, మంచినీరు, విద్యుత్ సరఫరా, రక్షణ-భద్రతపరమైన అంశాలు, ఆహారం, బయోమెడికల్ వేస్ట్ నిర్వహణలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ సేవలన్నీ శుక్రవారం సాయంత్రం నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఆ జీవోలో స్పష్టం చేసింది.

అయితే ఇది ఇలా ఉంటే, కొంత మంది డాక్టర్లు, ప్రభుత్వ ఉత్తర్వులు స్వాగిస్తూనే, తాము ప్రజలకు సేవ చేయటానికి ఎప్పుడూ రెడీగానే ఉంటామని, ప్రభుత్వ సూచనలకు అనుగుణంగానే నడుచుకుంటామని అంటున్నారు. అయితే ఇదే సందర్భంలో, కనీసం సేఫ్టీ కిట్లు, మాస్కులు, లాంటివి, విరివిగా సప్లై చెయ్యాలని, అలాగే తమ పై దాడులు జరగకుండా, చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందని అంటున్నారు. మరో పక్క, ఇదే విషయం పై, పతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. ఆయుధం లేకుండా, యుద్ధం చెయ్యమంటారా అంటూ, పవన్ కళ్యాణ్, డాక్టర్లకు కిట్లు లేకపోవటం పై ప్రశ్నించారు. అలాగే, ఈ డాక్టర్లుకి కూడా కావాల్సిన మాస్కులు, ప్రొటెక్షన్ కిట్ లు ఇవ్వడంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది అని, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రజల్ని ఆర్థిక సాయం అడుగుతున్నారు అంటే, ఎంత దౌర్భాగ్యమో అంటూ, తెలుగుదేశం ఆరోపిస్తుంది. ఈ విమర్శలు నడుమ, ప్రభుత్వం, వైద్య సిబ్బంది పై, ఎస్మా ప్రయోగించింది.

ఇది ఇలా ఉంటే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కు చేరింది. శుక్రవారం రాత్రి 10.30 గంటల నుంచి శనివారం ఉదయం 10 వరకు కొత్తగా 16 కరోనా కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో కొత్తగా 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా...ఇప్పటివరకు 27 కరోనా కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో కొత్తగా 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా... మొత్తం కేసులు 23కు చేరాయి. గుంటూరు జిల్లాలో కొత్తగా 3 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు 23 కరోనా కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్తగా 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా... మొత్తం కేసులు 4కు చేరాయి. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఇవాళ ఒక్కో కరోనా కేసు నమోదైంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read