ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం రోజు రోజుకీ దిగాజారి పోతుంది. అసలకే లోటుతో ప్రారంభం అయిన రాష్ట్రం, గత ప్రభుత్వం కూడా 5 ఏళ్ళలో లక్ష కోట్ల వరకు అప్పు చేసింది. అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వచ్చిన తరువాత, ప్రజలకు పంచె పధకాలు ఎక్కవ కావటంతో, ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అదే సమయంలో ఆదాయం తగ్గిపోతూ వస్తుంది. ముందు ఆరు నెలలు ఇసుక లేక పనులు లేక, ఎక్కడికక్కడ నిర్మాణాలు ఆగిపోవటంతో ఆదాయం తగ్గిపోయింది. గత 4-5 నెలల నుంచి క-రో-నా రావటం పూర్తిగా చతికల పడింది. అయితే ఈ 15 నెలల్లోనే ప్రభుత్వం లక్ష కోట్ల అప్పు చేసిందని కాగ్ రిపోర్ట్ లు చెప్తున్నాయి. తగ్గిపోతున్న ఆదాయం ఓక వైపు, పెరిగిపోతున్న ఖర్చులు ఒక వైపు, అప్పులు మరో వైపు, ఇలా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రానికి, అక్టోబర్ 11 గండం ఉంది అంటూ ఒక ప్రముఖ పత్రిక ఆసక్తికర కధనం ప్రచురించింది. ఈ నెలలో ఇప్పటికే ప్రభుత్వం 5 వేల కోట్లు అప్పు చేసింది. నెల మొదటిలో 3 వేల కోట్లు, రెండో వారంలో మరో 2 వేల కోట్లు అప్పు చేసారు. తరువాత 2400 కోట్లు ఓడీ కూడా తీసుకున్నారు. అయితే ప్రభుత్వ ఖర్చులు, తీర్చాల్సిన బాకీలు చూసుకుంటే, అక్టోబర్ 11 నాటికి ప్రభుత్వానికి 14 వేల కోట్లు కావలసిన అవసరం ఉంది.

అయితే ఆదాయం ఆ స్థాయిలో వచ్చే అవకాసం లేకపోవటంతో, ప్రభుత్వం దీన్ని ఎలా అదిగమిస్తుంది అనేది చూడాలి. ఈ స్థాయిలో అప్పులు కూడా పుట్టే అవకాసం లేదు. మరి ఈ పరిస్థితి నుంచి బుగ్గన ఎలా గట్టేక్కిస్తారో చూడాలి. ఇక ఖర్చులు విషయానికి వస్తే, అక్టోబర్ 11 నాటికి ఉద్యోగాలకు పెట్టిన పెండింగ్ జీతాలు , వడ్డీతో సహా ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు , పెన్షన్లు, అలాగే సామాజిక పెన్షన్లు, అప్పుల రీ పేమెంట్లు, ఓడి పేమెంట్ ఇలా అనేక ఖర్చులు ప్రభుత్వం ముందు ఉన్నాయి. అయితే ఇందులో ప్రభుత్వానికి ఉన్న ప్రత్యామన్యాయం, మళ్ళీ కోర్టుకు కానీ, పై కోర్టుకు కానీ వెళ్లి, ఉద్యోగులకు పెండింగ్ జీతాల ఇవ్వటానికి టైం అడగటం. అలాగే కేంద్రం నుంచి ఎక్కువ అప్పు తెచ్చుకోవటానికి అనుమతి తెచ్చుకోవటం. అయితే ఆ పత్రికలో వచ్చిన కధనం పై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించ లేదు. మరి ప్రభుత్వం ఈ విషయం పై క్లారిటీ ఇస్తుందా, లేదా అనేది చూడాలి. ఏది ఏమైనా ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగి, అపులు పెరిగాయనేది మాత్రం కాగ్ రిపోర్ట్ లు చూస్తే అర్ధం అవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read