ఒక పక్క ఎస్మా ప్రయోగిస్తాం అని ప్రభుత్వం బెదిరిస్తున్నా, మేము కేసులు కైనా సిద్ధమే, ప్రాణాలు ముఖ్యం అంటున్నారు డాక్టర్లు. ఇప్పటికే మాస్కులు అడిగినందుకు, ఒక డాక్టర్ ను, ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు, అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, తమ విధులు బహిష్కరించినిరసన వ్యక్తం చేశారు. తమకు ఎన్ 95 మాస్కులు, పీపీఈ కిట్స్ ఇవ్వాలని, అవి లేకుంటే వైద్యం చేయలేమని అంటున్నారు. అయితే వీరి డిమాండ్ల పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే, కనీస సౌకర్యాలు లేని కారణంగా కరోనా విధుల్లో పాల్గొనలేమని తమకు మినహాయింపునివ్వాలని కోరుతూ ప్రకాశం జిల్లా కనిగిరిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంఈవోకు వినతిపత్రం సమర్పించారు. కరోనా కట్టడికి స్వచ్ఛందంగా ముందుకొచ్చిన తమకు సౌకర్యాల కల్పిచంకపోవటం విచారకరమన్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తుంటే... ప్రభుత్వం కనీసం శానిటైజర్లు కూడా ఇవ్వకపోవటం దారుణమన్నారు. పైగా రాత్రి వేళల్లో డ్యూటీలు వేస్తున్నారని మండిపడ్డారు.

అనంతపురం జూనియర్ డాక్టర్లు భయపడటానికి కారణం, నిన్న జరిగిన సంఘటన. అనంతపురం జిల్లాలో లేపాక్షికి చెందిన పదేళ్ల బాలుడికి తొలుత కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. ఆ ఆతర్వాత మక్కా వెళ్లి వచ్చిన హిందూపురానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడిలో వ్యాధి లక్షణాలు కనిపించగానే... స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి అనంతపురానికి మార్చారు. అయితే అప్పటికే వృద్ధుడికి ఆస్తమా ఉన్నందున క్షయవ్యాధి వార్డుకు పంపించి...సాధారణ రోగులతోపాటు చికిత్స చేస్తూ వచ్చారు. వ్యాధి తీవ్రత పెరగటంతో ఈ నెల 4న వృద్ధుడు మృతి చెందాడు. ఆ తర్వాత నమూనాలు తీయించి వైరాలజీ ల్యాబ్‌కు పంపగా...కరోనా వ్యాధితోనే చనిపోయినట్లు నిర్ధారణ అయింది. ఈ పరిణామంతో క్షయవ్యాధి వార్డులో వైద్యం అందించిన వైద్యులు, నర్సులు, స్వీపర్లు...మొత్తంగా 24 మందిని క్వారెంటైన్‌కు పంపారు. వారిలో ఇద్దరు వైద్యులు, ఇద్దరు నర్సులకు వైరస్‌ సోకినట్లు బుధవారం తేలింది.

ఈ నెల 4వ తేదీన మృతి చెందిన హిందూపురానికి చెందిన వృద్ధుడు... అప్పటిదాకా చికిత్స పొందిన క్షయవ్యాధి వార్డులో వైద్యం చేయించుకున్న కల్యాణదుర్గానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు తర్వాత చనిపోయాడు. వైద్యం అందించిన బృందాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకున్న అధికారులు... వారిని మాత్రమే క్వారెంటైన్‌కు పంపించారు. వారి కుటుంబీకులు, స్నేహితులు, వీరితో కలిసిన ఇతరుల గురించి ఆలోచించలేదు. వైరస్ సోకిన హౌస్‌ సర్జన్‌తోపాటు 40 మంది కలిసి ఉన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వీరందర్నీ పరీక్షిస్తే తప్ప ఎవరెవరు వైరస్ బాధితులో తెలిసే అవకాశం లేదు. అలాగే సిబ్బంది కుటుంబీకులు, సన్నిహితులపైనా దృష్టి పెట్టాలనే అభిప్రాయం ఆసుపత్రి వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read