త‌న‌ను అరెస్టు చేయ‌కుండా ఆదేశాలు ఇవ్వాల‌ని వైఎస్ అవినాశ్ రెడ్డి వేసిన పిటిష‌న్‌ని తెలంగాణ హైకోర్టు కొట్టేయ‌డంతో అరెస్టు త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని అని తేలిపోయింది. దీంతో సీబీఐ త‌న‌ని అరెస్టు చేయ‌కుండా చూడాల‌ని అన్న సీఎం జగన్ రెడ్డి పీక మీద కూర్చున్నాడు అవినాష్ రెడ్డి. త‌న అరెస్టు ఆప‌క‌పోతే అన్నావ‌దిన‌ల‌ని కూడా చూడ‌కుండా సీబీఐ ఎదుట మీ హ‌స్తం కూడా బ‌య‌ట‌పెడ‌తాన‌ని బ్లాక్ మెయిల్ చేస్తుండ‌డంతో బెంబేలెత్తిన జ‌గ‌న్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ బ‌య‌లుదేరాడ‌ని ప్ర‌చారం బ‌య‌ట‌కొచ్చింది. జ‌గ‌న్‌తోపాటు త‌మ్ముడు అవినాష్ రెడ్డి కూడా త‌న ఇంట్లోనే ఉన్నాడు. మోదీ కాళ్లు ప‌ట్టుకుని అయినా అరెస్టు ఆపుతాన‌ని హామీ ఇచ్చిన జ‌గ‌న్ ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు ఆరంభించాడు. సీఎం మోదీ, షాల చుట్టూ తిరుగుతుంటే.. జగన్ నివాసంలో అవినాష్ రెడ్డి బ‌స చేశాడు. పూర్తి నిరాశ, నిస్పృహలో ఉన్న అవినాష్ రెడ్డి ఎవ్వ‌రితోనూ మాట్లాడ‌టంలేదు. ఢిల్లీలోని జగన్ నివాసంలో ఎంపీలు, పార్టీ నేతలని కూడా అవినాష్ రెడ్డి ప‌ల‌క‌రించ‌డంలేదు. ఇది ఇలా ఉంటే ఢిల్లీలో కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల్ని వేడుకుని ఎలాగైనా అరెస్టు ఆపిస్తాన‌ని త‌మ్ముడికి మాటిచ్చాడ‌ట జ‌గ‌న్. తాను అరెస్టు అయితే మిమ్మ‌ల్ని వ‌ద‌ల‌నంటూ గ‌ట్టిగానే వార్నింగ్ ఇవ్వ‌డంతో అవినాష్ రెడ్డి కంటే జ‌గ‌న్ రెడ్డి తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నార‌ని తాడేప‌ల్లి ప్యాలెస్ నుంచి గుస‌గుస‌లు బ‌య‌ట‌కొచ్చాయి. మ‌రోవైపు సీబీఐ ఎంపీ అవినాష్‍రెడ్డికి 41A నోటీసులు ఇవ్వనుంద‌ని స‌మాచారం. విచారణ తర్వాత అవినాష్‍రెడ్డిని, ఆయ‌న తండ్రికి కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. అవినాష్‍రెడ్డి అరెస్ట్ ను ఆపలేమని హైకోర్టు తేల్చి చెప్పేయ‌డంతో అవినాష్‍రెడ్డి, భాస్కర్‍రెడ్డిని కస్టడీలోకి తీసుకోవ‌డం ఇక లాంఛ‌న‌మే అంటున్నారు న్యాయ‌నిపుణులు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read