త‌న బాబాయ్ హ‌త్య‌కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి అడ్డంగా బుక్క‌య్యార‌ని, నేడో రేపో అరెస్టు త‌ప్ప‌ద‌ని సీబీఐయే ప్ర‌క‌టించింది. కోర్టుకి కూడా ఇదే విష‌యాన్ని అఫిడ‌విట్ రూపంలో తెలియ‌జేసింది. కోర్టు కూడా సీబీఐ ఇచ్చిన విచార‌ణ ప్రాసెస్, వాంగ్మూలాలు, సేక‌రించిన సాక్ష్యాలు ప‌రిశీలించి సీబీఐ అరెస్టుని ఆప‌లేమ‌ని ప్ర‌క‌టించింది. దీంతో ఆ త‌రువాత రోజు వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయ‌న తండ్రి భాస్క‌ర్ రెడ్డిల‌ను సీబీఐ అరెస్టు చేస్తుంద‌ని అంతా అనుకున్నారు. స‌డెన్‌గా అసెంబ్లీ స‌మావేశాలు కూడా వ‌దిలేసి జ‌గ‌న్ రెడ్డి అవినాష్ రెడ్డిని తీసుకుని ఢిల్లీ చేరాడు. మోడీ, అమిత్ షాల‌ను క‌లిశాడు. అటునుంచి జ‌గ‌న్ రెడ్డి వ‌చ్చిన వెంట‌నే సీబీఐ అవినాస్ రెడ్డిని విచార‌ణ‌కి కూడా పిల‌వ‌డంలేదు. ఏపీకి సంబంధించి అదానీ అడిగిన కీల‌క ఆస్తులు అప్ప‌గించ‌డానికి జ‌గ‌న్ రెడ్డి సై అన‌డంతో అదానీ కేంద్రంలో పెద్ద‌ల‌ను మేనేజ్ చేశార‌ని, దీంతో అవినాష్ రెడ్డి అరెస్టు ఆగిపోయింద‌ని పుకార్లు షికారు చేస్తున్నాయి. సీబీఐ అధికారి రాంసింగ్ ని కూడా ఆ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించాల‌ని అదానీని కోర‌గా,  కోర్టు ప‌రిధి అంశం కావ‌డంతో సాధ్యం కాలేద‌ని ప్ర‌చారం సాగుతోంది. మొత్తానికి కేంద్రంలోని పెద్ద‌ల‌కు ఏ తాయిలాలు ఇచ్చాడో కానీ, వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుని ఆప‌గ‌లిగాడ‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read