వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌-త్య‌ కేసులో క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ విచార‌ణ‌కి పిలిచింది. అయితే ఒక క‌న్ను మ‌రొక క‌న్నుని ఎందుకు పొడుస్తుంది అని ప్ర‌జ‌ల్నే అమాయ‌కంగా ప్ర‌శ్నించిన సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎందుకో భయపడుతున్నారని, ఆయన  వ‌ర‌స ప‌ర్య‌ట‌న‌ల ర‌ద్దులు స్ప‌ష్టం చేస్తున్నాయి. వైఎస్ వివేకానంద‌రెడ్డి గుండెపోటుతో చ‌నిపోయార‌ని జ‌గ‌న్ క్యాంప్ ప్ర‌చారం చేసింది. అనంత‌రం నారాసుర ర‌క్త‌చ‌రిత్ర అంటూ త‌న బాబాయ్ ని చంపేశార‌ని అబ్బాయ్ రాగం అందుకున్నారు. ఇదంతా అధికారం అందే వ‌ర‌కే. అంత‌వ‌ర‌కూ సీబీఐ ద‌ర్యాప్తు కావాల‌న్న జ‌గ‌న్ రెడ్డి, సీబీఐ ద‌ర్యాప్తు వ‌ద్దంటూ ప‌ట్టుబ‌ట్ట‌నారంభించారు. నిందితుల‌ని సీబీఐ అరెస్టు చేస్తుంటే అమాయ‌కులంటూ స‌ర్టిఫికెట్లు ఇస్తున్నారు. బాబాయ్ ని చంపింది ఎవ‌రో సీబీఐ చార్జిషీట్లో ప‌క‌డ్బందీగా పేర్కొంటే, బాబాయ్ కూతురు, అల్లుడిపై అనుమానాలు అంటూ క‌థ‌నాలు త‌న పేప‌ర్ సాక్షిలో రాయించారు. క‌డ‌ప ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయొచ్చ‌నే ఊహాగానాలు వ‌చ్చిన ప్ర‌తీసారీ ఢిల్లీ ఎందుకు వెళుతున్నారు. సీబీఐ విచార‌ణ‌కి అవినాశ్ హాజ‌రు అవుతుంటే, ఇటు జ‌గ‌న్ త‌న విశాఖ‌, పొన్నూరు ప‌ర్య‌ట‌న‌ల‌ను ఎందుకు ర‌ద్దు చేసుకున్నారు. ఈ అనుమానాల‌న్నీ బాబాయ్ హ‌-త్య‌కేసులో అబ్బాయ్  వైపే చూపుతున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read