క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి విచిత్రంగా తాను చెప్పే అబ‌ద్ధాల‌ని తానే నిజం చేయాల్సి రావ‌డం క‌ర్మ అనే చెప్పాలి. వివేకానంద‌రెడ్డిని చంపేయించి గుండెపోటు అని చెప్పేందుకు చాలా స్కెచ్‌లు వేశాడు. చివ‌రికి గొడ్డ‌లిపోట్లు అని ఎన్నిక‌ల్లో ఓట్లు దండుకున్నాడు. ఆ గొడ్డ‌లిపోట్ల‌ని నిజం చేయ‌డానికి చాలా మందిని రంగంలోకి దింపాడు. ఇప్పుడు వైఎస్ వివేకానంద‌రెడ్డి కేసులో పీక‌ల్లోతులో ఇరుక్కుపోయి...త‌ల్లికి గుండెపోటు అని చెప్పి క‌ర్నూలు విశ్వ‌భార‌తి ఆస్ప‌త్రిలో చేర్పించి ఓ వారం రోజులు డ్రామా ఆడాడు. ఇప్పుడు త‌ల్లికి బాగానే ఉంద‌ని ఆ ఆస్ప‌త్రి డిశ్చార్జి చేసిన నేప‌థ్యంలో ..ఈ సారి వేదిక‌ని హైద‌రాబాద్ ఏఐజీకి మార్చి డ్రామా మొద‌లుపెట్టారు. ముంద‌స్తు బెయిల్ కోసం ఈ డ్రామా షురూ చేసినా..ఇప్పుడు కోర్టు ఇచ్చిన వెసులుబాట్లు తీసుకోవ‌డానికి త‌ల్లికి ఆరోగ్యం బాగానే ఉన్నా..ఏదో ఒక డ్రామా స‌ర్జ‌రీ అయినా చేయించాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. తల్లిని కర్నూలు ఆస్పత్రి నుంచి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించామని.. గుండె రక్తనాళాల్లో బ్లాక్స్‌ వల్ల అత్యవసర చికిత్స జరుగుతోందని అవినాష్ రెడ్డి న్యాయ‌వాదులు కోర్టుకి తెలిపారు. పిటిషనర్‌ చేస్తున్న ఈ వాదనకు ఎలాంటి మెడికల్‌ రికార్డులు, ఆధారాలు లేవని సీబీఐ న్యాయవాదులు వ్యతిరేకించారు. స‌ర్జరీ జరుగుతోందన్న పిటిషనర్‌ న్యాయవాది స్టేట్‌మెంట్‌ రికార్డు చేస్తున్నాం. ఇది తప్పు అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ధర్మాసనం తెలిపింది. క‌ర్నూలు విశ్వ‌భార‌తి మాదిరిగానే త‌ల్లిని లోప‌ల పెట్టి డ్రామా న‌డిపించేందుకు హైద‌రాబాద్ ఏఐజీలో కుదర‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే ఆస్ప‌త్రి బాగా రెపుటేషన్ గ‌ల‌ది. ఇటువంటి పొలిటిక‌ల్ డ్రామాల‌కు ఆస్ప‌త్రిని వేదిక చేసి ఏఐజీ పేరుప్ర‌తిష్ట‌లు

Advertisements

Advertisements

Latest Articles

Most Read