ఏపి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంను మరో వివాదం చుట్టు ముట్టుకుంది. ఈఎస్ఐ కుంభకోణంలో 14వ నిందితుడైన కార్తీక్ మంత్రి గుమ్మనూరు కుమారిడికి బెంజి కార్ బహుమానం ఇవ్వడంలో అంతర్యం ఏమిటని మాజీ మంత్రి , తెదేపా నేత అయన్న పాత్రుడు బహిరంగంగా దుయ్యబట్టారు. ఈఎస్ఎ కుంభకోణంలో నిందితుడు కార్తీక్ మంత్రికి బినామీగా ఉన్నారంటూ ప్రతిపక్షాలు వ్యాఖనించడం సంచలనం రేపుతుంది. ఇటీవలే మంత్రి స్వ గ్రామమైన గుమ్మనూరులో భారీగా పేకాట దందా నిర్వహిస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించి వాటిని బహిర్గతం చేశారు. ఈ సందర్భంగా నగదుతో పాటు 35 కార్లు, 39 మందిని అరెస్టు చేశారు. కాగా మంత్రి ఇలాఖాలో పేకాట డంపు బహిర్గతం కావడంతో గుమ్మనూరు కుటుంబ సభ్యుల నేతృత్వంలోనే ఈ దందా జరుగుతుందని వివిధ రాజకీయ పార్టీలతో పాటు నేతలు దుయ్యబట్టారు. ఈ వివాదం మంత్రికి తలపోటుగా మారగా, ఇదే క్రమంలో ఇటాలీ భూముల కొనుగోలు వ్యవహారం ఆయనకు మరో తలపోటుగా మారింది. ఇలా ఇప్పటికే అనేక వివాదాలతో మంత్రి సతమతమవుతుండగా, తాజాగా మరో వివాదం చుట్టుముట్టింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయన్నపాత్రుడు మంత్రి గుమ్మనూరుపై ఊహించని అరోపణలు చేశారు.

ముఖ్యంగా ఈ ఎప్ స్కాంలో 14వ నిందితుడిగా ఉన్న కార్తీక్ అనే వ్యక్తి మంత్రి జయరాం కుమారుడికి బెంజికార్ బహుమతిగా ఇచ్చాడని అయ్యన్నపాత్రుడు విజయవాడలో సంచలన వ్యాఖలు చేయడం ప్రస్తుతం రాష్ట్రంలోనే ఇది హాట్ టాపిక్ గా మారింది. ఏ సంబంధంతో కార్తీక్ కారును కానుకగా ఇచ్చారో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేయడం గమనార్హం. ఏ 14 అయిన కార్తీక్ మంత్రి జయరాంకు బినామీగా ఉన్నారంటూ ఆయన ఆరోపణలు చేశారు. ఈఎన్ఏ కుఱకోణంలో ఏ 14 నిందితుడైన కార్తీక్ గుమ్మనూరు కుమారుడు జన్మదినోత్సవం రోజున బెంజీ కారు బహుమతిగా ఇవ్వడం వీటిని మరింత బలపరుస్తుందన్నారు. డెలీవరి తీసుకున్న బెంజ్ జిఎల్‌ఎస్ 350 కారు కానుకగా ఎక్కడి నుంచి వచ్చిందో చూస్తే ఈ ఎన్ఏ కుంభకోణం మూలాలు వైకాపాకి చెందిన మంత్రి జయ రాం దగ్గర తేలుతాయన్నారు. ఈ విషయం మీద ఆలూరులో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం ఆలూరులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫేస్ బుక్ లో తన కుమారుడు ఫోటో దిగిన బెంజీకారు తన కుమారిడిది కాదన్నారు.

వేరేవాళ్ల కారు ప్రక్క ఫోటో దిగారు అంతేనన్నారు. హెలిక్యాప్టర్ , ట్రైన్ వద్ద ఫోటో దిగితే అది మనదే అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. కారు తమదే అని రుజువుచేస్తే పదవికి రాజీనామా చేస్తానని మంత్రి గుమ్మనూరు జయరాం సవాల్ విసరడం గమనార్హం. అయితే మంత్రి చాలంజ్ పై ఈ రోజు అయ్యన్నపాత్రుడు స్పందించారు. మరిన్ని ఆధారాలు చూపిస్తూ ఈ రోజు మీడియా సమావేశం పెట్టారు. మంత్రి మాట్లాడుతూ, కేవలం ఆ కార్ డెలివరీ మాత్రమే తన కొడుకు తీసుకున్నాడని, తన కొడుకు ఫాన్స్ ఎవరో అడిగితే అలా చేసారని, ఆ కార్ తో మాకు సంబంధం లేదు అంటున్నారని, మరి ఆ కారు వేసుకుని, అన్ని చోట్లా తిరుగుతున్న ఈ వీడియోలు ఏమిటి, కారు పై ఎమ్మెల్యే స్టిక్కర్ ఏమిటి అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. దీనికి సంబంధించి, వీడియో, ఫోటోలు ప్రదర్శించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read