తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుకి ఫోన్ మెసేజ్ ద్వారా బెదిరింవులు పాల్పడుతున్న సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. గతంలో ఆ వ్యక్తి పలు వురు నేతలకు ఫోన్ కాల్స్ ద్వారా అలాగే మెసేజ్ ల ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇందులో టిడిపి నాయకులతో పాటు తెలంగాణ రాష్ట్రాన్రికి చెందిన నాయకులను కూడా సదరు వ్యక్తి బెదిరించినట్లు తేలింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడడును, ఆ వ్యక్తి గుర్తు తెలియని నంబర్ నుంచి మెసేజ్ చేస్తూ బెదిరించడం జరి గింది. దీనిపై స్పందించిన అయ్యన్న పాత్రుడుతనను బెదిరించిన సదరు వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు విచారణ చేపట్టగా బుచ్చయ్య పేట మండలం, కె.పి.అగ్రహారం కు చెందిన వియ్యపు తాతారావు అయ్యన్న పాత్రుడుని ఫోన్ ద్వారా బెదిరించడం జరిగిందని వెల్లడైంది. దీంతో తాతారావు ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిం చారు. వియ్యపు తాతారావు గతంలోనూ కూడా ఇలాంటి మెసేజ్లను అలాగే ఫోన్ కాల్స్ చేస్తూ పలువురు పార్టీ నాయ కులను బెదిరిస్తూ ఉండేవాడు. గతంలో కూడా కొందరు నాయకులు తమకు బెదిరిస్తూ మెసేజ్ లు వచ్చా యని మీడి యా ముందు వెల్లడించడం జరిగింది అలాగే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది.

ఆంధ్రాలోనే ఎక్కు వగా టిడిపి నాయకులను టార్గెట్ చేస్తూ సదరు వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు.ఇందులో ఉత్తరాంధ్రకు చెందిన టిడిపి సీనియర్ నేతలే ఎక్కువగా ఉన్నారు. ఇది వరకు తెలంగాణలో కూడా అలాగే అక్కడి నేతలను బెదిరిస్తూ ఫోన్ కాల్స్, మెసేజ్ లు చేశాడు.అయితే తెలంగాణ పోలీసులు ఈ బెదిరింపులు కేసును సీరియస్ గా తీసుకుని అతన్ని కటకటాల పాలు చేశారు. ఆంధ్రాలో అయ్య న్న పాత్రుడుతో పాటు టిడిపి నాయకులు కింజరాపు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాస రావు, యనమల రామకృష్ణ లకు ఫోన్ చేసి అలాగే మెసేజ్ చేసి బెదిరించినట్లు పోలీసు పేర్కొంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రాన్రికి చెందిన టిఆర్ఎస్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి లను కూడా సదరు తాతారావు బెదిరించినట్లు తెలిపారు.రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గల మారెడ్డి పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వియ్యపు తాతారావు పై కేసు నమోదు చేసి ఇదివరకే అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు వెల్లడించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read