తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అరెస్ట్ పై, తెలుగుదేశం పార్టీ వేగంగా స్పందించింది. ఈ రోజు ఉదయమే, టిడిపి , ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది.  ఈ లంచ్ మోషన్ పిటీషన్ ను హైకోర్టు కూడా అనుమతి ఇచ్చింది. దీని పై కొద్ది సేపట్లో వాదనలు జరగనున్నాయి. అయ్యన్నపాత్రుడ్ని అక్రమంగా అరెస్ట్ చేసారని, ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని ఆ పిటీషన్ లో పేర్కొన్నారు. దీంతోపాటు అయ్యన్న పత్రుడిని అరెస్ట్ చేసిన విధానాన్ని కూడా న్యాయవాదులు ఈ పిటీషన్ లో పేర్కొన్నారు. ఫోర్జరీ చట్టం మోపినా కూడా, ఆ సెక్షన్ విధించటానికి ఉన్న గ్రౌండ్ ఉందా లేదా అనేది పోలీసులు పరిశీలన చేసి, ఆ సెక్షన్ పెట్టాలని, గతంలో కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు గురించి న్యాయవాదులు చెప్తున్నారు. అటువంటి సెక్షన్ ఉన్నా కూడా, ముందస్తు నోటీసులు ఇవ్వాలని, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని, ఇలాంటివి ఏమి ఇవ్వకుండా, అరెస్ట్ చేసారని, న్యాయవాదులు పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ పై, మధ్యానం తరువాత విచారణకు రానుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read