ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పనులు పై, జాతీయ స్థాయిలో ఫోకస్ వస్తున్న సంగతి తెలిసిందే. అవి మంచి పనులు అయితే పరవాలేదు కాని, ప్రభుత్వం చేస్తున్న వివాదాస్పద పనుల పై, జాతీయ స్థాయిలో చెడ్డ పేరు వస్తూ, అవే ఎడిటోరియల్స్ గా కూడా మారుతున్నాయి. పీపీఏల రద్దుతో మొదలైన విమర్శలు, మొన్నటి పత్రికా స్వేఛ్చకు సంకెళ్ళు వేస్తూ ఇచ్చిన జీవో దాకా అనేక వివాదాస్పద నిర్ణయాలను, జాతీయ మీడియా విమర్శిస్తుంది. తాజాగా అమరావతిలోని స్టార్ట్ అప్ ఏరియా ప్రాజెక్ట్ నుంచి సింగపూర్ ప్రభుత్వం వైదోలగటం పై, అనేక మండి ఆశ్చర్యం వ్యక్తం చేసారు. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం అంటే, ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్స్ లో కాన్ఫిడెన్సు ఉండేది. తాజాగా, ఇదే విషయం పై ఇండియన్ ఎక్ష్ప్రెస్ లో ఒక ఎడిటోరియల్ వచ్చింది. "రిగ్రసివ్ పాలిటిక్స్, సియం జగన్ రెడ్డి" అంటూ వచ్చిన ఈ ఎడిటోరియల్ పై, ఇప్పుడు చర్చ జరుగుతుంది. చంద్రబాబు పై కోపంతో, రాష్ట్ర అభివృద్ధిని ఇబ్బంది పెట్టవద్దు అని ఎడిటోరియల్ సారంశం.

edit 16112019 2

ఈ ఎడిటోరియల్ లో వచ్చిన హైలైట్స్ ఇలా ఉన్నాయి. "అమరావతి ప్రాజెక్ట్ నుంచి సింగపూర్ వెళ్ళిపోవటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు, మన దేశానికే పెద్ద దెబ్బ. విదేశీ పెట్టుబడిదారులకు, ఇలాంటి చర్యల వల్ల, ఇండియా మీదే, కాన్ఫిడెన్సు పోయే ప్రమాదం ఉంది. జగన్ మోహన్ రెడ్డి గారు, ఈ నిర్ణయాన్ని ఒకసారి మళ్ళీ సమీక్షించుకోవాలి. ఈ ఒప్పందం రద్దు వెనుక ఉన్న ఒకే ఒక కారణం, రాజకీయం కక్ష అని తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్ట్ తీసుకున్నారు కాబట్టే ఆపేసారు. కాని అది తప్పు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన పనులను, తరువాత వచ్చిన జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి, ముందుకు తీసుకు వెళ్లారు. చంద్రబాబు ఐటికి ఇచ్చిన ప్రాధాన్యతను, వైఎస్ఆర్ కొనసాగించారు కాబట్టే, ఈ రోజు హైదరాబాద్ నెంబర్ వన్ గా ఉంది"

edit 16112019 3

అలాగే ఉత్తర్ ప్రదేశ్ లో, మాయవతి చేసిన మంచి పనులను, తరువాత వచ్చిన అఖిలేష్ యాదవ్ కొనసాగించారు, పూర్తీ చేసారు. జగన్ మోహన్ రెడ్డి గారు కూడా, ఇలాంటి ఆలోచనలే చేసి, అమరావతి లాంటి మంచి ప్రాజెక్ట్ ని పూర్తీ చెయ్యాలి. అన్ని ఇప్పటికీ సమకూరి ఉన్నాయి కాబట్టి, అమరావతిని పూర్తీ చేసి, దేశంలోనే ఒక మోడల్ గా నిలపాలి. అలా కాకుండా ప్రజా వేదిక కుల్చటం, పనులు అన్నీ ఆపేయటం, రాజకీయ కక్ష చూపించటం మంచిది కాదు. ఠిస్ ఈజ్ బ్యాడ్ పాలిటిక్స్" అంటూ ఎడిటోరియల్ రాసారు. అయితే ప్రతిపక్షాలు, వీటిని ఎత్తిచూపుతూ విమర్శలు చేస్తున్నా, జగన్ మోహన్ రెడ్డి గారు, కనీసం ఇప్పుడైనా, వీటిని కొనసాగించి, తానే పూర్తీ చేసి, మంచి పేరు తెచ్చుకోవాలి. లేదంటే, ఇలాగే కూల్చేస్తా, అన్నీ ఆపేస్తా అంటే, ఇప్పటికి వచ్చిన చెడ్డ పేరు రెట్టింపు అవుతుంది, ప్రజల్లో కూడా పలుచన అవుతారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read