తెలుగుదేశం పార్టీని ఎలాగైనా ఏదో ఒక వివాదంలోకి లాగాల‌నే వైసీపీ వ్యూహాలు ఎదురు త‌న్నేస్తున్నాయి. టిడిపి అధినేత బావ‌మ‌రిది క‌మ్ వియ్యంకుడైన నందమూరి న‌ట‌సింహం బాల‌య్యని ల‌క్ష్యంగా చేసుకుని వైసీపీ ప‌న్నిన రెండు వ్యూహాలు వ‌ర‌స‌పెట్టి ఎదురు త‌న్నేశాయి. ఐప్యాక్ టీము ర‌చించిన ఈ కుల విద్వేష‌పు ప్ర‌చారం, ఫ్యాన్ వార్ కి బాల‌య్య అయితేనే క‌రెక్టుగా సూట‌వుతార‌ని ఎంచుకున్నారు. మ‌నిషి భోళా, , ముక్కుసూటిత‌నం, బాల‌య్య పేరుకి త‌గ్గ‌ట్టే లౌక్యం తెలియ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేలా మాట్లాడ‌టం, చికాకు పెట్టేవాళ్ల‌ను చాచి కొట్ట‌డం త‌మ‌కు విష‌ప్ర‌చారాల‌కు ప‌నికొస్తాయ‌ని ఐ ప్యాక్ ఆయ‌న‌పైనే ఎక్కువ దృష్టి సారించింది. బాల‌య్య చేసిన‌ అన్ స్టాప‌బుల్ షో సూప‌ర్ హిట్, సినిమాలకి ఎన్ని అడ్డంకులు క‌ల్పించినా బంప‌ర్ హిట్ కావ‌డంతో బాల‌య్య మంచి ఫాములో ఉన్నారు. బాల‌య్య‌ని కెల‌క‌డం ద్వారా టిడిపిని డిస్ట్ర‌బ్ చేయాల‌న్న‌దే ఐప్యాక్ శ‌కుని వ్యూహం. బాల‌య్య వీర‌సింహారెడ్డి, చిరు వీర‌య్య‌ల మ‌ధ్య సంక్రాంతికి ఫ్యాన్ వార్ సృష్టించాల‌ని, కుల‌విద్వేషాలు రెచ్చ‌గొట్టాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసి విఫ‌లం అయ్యారు. చివ‌రికి వీర‌సింహారెడ్డి స‌క్సెస్ మీట్లో య‌థాలాపంగా ప్రాస కోసం పాకులాడి నోటినుంచి వ‌చ్చిన అక్కినేని-తొక్కినేని డైలాగునే వైసీపీ పేటీఎం బ్యాచు మ‌రో ఆయుధం చేసుకుంది. ఇది కూడా వైసీపీ ఫ్యాన్స్ అయిన అక్కినేని ఫ్యామిలీని పావుగా వాడింది. ఇక్క‌డా కులం కుతంత్రం ప్ర‌యోగించేందుకు ఎస్వీరంగారావుని కించ‌ప‌రిచారంటూ కాపునాడు అనే వైసీపీ బ్రాంచిని దింపారు. అయితే ఎస్వీరంగారావుని బాల‌య్య కించ‌ప‌ర‌చ‌లేద‌ని, ఏ కుల‌సంఘాలు గొంతుచించుకోన‌క్క‌ర్లేద‌ని ఎస్వీ రంగారావు వార‌సులు తేల్చి చెప్పేశారు. దీంతో ఎంత ప‌క‌డ్బందీగా కుల విద్వేషం రెచ్చ‌గొట్టాల‌నుకున్న ఐప్యాక్ మ‌రో వ్యూహ‌మూ దెబ్బ‌యిపోయింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read