జగన్ మోహన్ రెడ్డి, మూడు ముక్కల రాజధాని నిర్ణయం తీసుకున్న సమయంలో, ఈ ప్రక్రియ అంతా, చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అని అందరూ అనుకున్నారు. జగన్ ఈ నిర్ణయం తీసుకున్న తరువాత, అమరావతి రైతులు ఎంత ఆందోళన చేసినా, 30 మంది చనిపోయినా, జగన్ మాత్రం అదరలేదు బెదరలేదు. క్యాబినెట్ నిర్ణయం, అసెంబ్లీ నిర్ణయం తీసుకోవటంతో, ఇక మూడు ముక్కల రాజధాని తధ్యం అని అందరూ అనుకున్నారు. ఇక అమరావతి రైతులు రోడ్డున పడినట్టే అని అందరూ అనుకున్నారు. శాసనమండలిలో టిడిపికి మెజారిటీ ఉన్నా, ఇక్కడ బిల్లు రిజెక్ట్ చేసినా, మళ్ళీ అసెంబ్లీ ఆమోదిస్తే, ఇక మండలి గురించి పట్టించుకోనవసరం లేదని అనుకున్నారు. అయితే, ఇదే సమయంలో, చంద్రబాబు తన 40 ఏళ్ళ అనుభవాన్ని చూపించారు. ఏ 40 ఏళ్ళ అనుభవం అంటూ, వైసీపీ ఎగతాళి చేసిందో, దాంతోనే చంద్రబాబు కొట్టారు. మండలి సమావేశాల మొదటి రోజు, బయటకు తెచ్చిన రూల్ 71 దెబ్బకు, గిలగిలా కొట్టుకున్న వైసీపీ, ఇక దీంట్లో నుంచి బయటకు రాలేక, ఏకంగా మండలినే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

cbn 27012020 2

ఇంకో ఏడాది ఎలాగోలా తట్టుకుంటే, జగన్ కే మండలిలో మెజారిటీ వచ్చేస్తుంది. ఏడాది కూడా సహనంగా ఉండలేక, చంద్రబాబు వేసిన పాచికలో జగన్ చిక్కుకుని, ఏకంగా మండలినే రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు జగన్, వైఖరి ఏమిటో, ప్రజలు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న తుగ్లక్ అనే ఆరోపణ నిజం చేస్తూ, వైసీపీ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు వేసిన పాచికకు జగన్ చిక్కారు. ఇది ఇక్కడితో అయిపో లేదు. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ వైఖరి కూడా బయట పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్నాళ్ళు, వైసీపీ, బీజేపీ మధ్య వైరం ఉంది అంటూ, నమ్మించే ప్రయత్నం చేస్తున్నా, ఆచరణలో మాత్రం, కేంద్రం ఎక్కడా జగన్ ని కట్టడి చెయ్యటం లేదు.

cbn 27012020 3

చివరకు ఒక రాజధానిని మూడు ముక్కలు చేస్తాం, 29 వేల మంది రైతుల త్యాగం వృధా చేస్తాం అంటున్నా, కేంద్రం స్పందించలేదు. అయితే, రాష్ట్రంలో బీజేపీ మాత్రం, మాటలు కోటలు దాటిస్తుంది. అయితే ఇప్పుడు ఈ దాగుడు మూతలకు చెక్ పెడుతూ, చంద్రబాబు వేసిన పాచికతో, ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ వైఖరి కూడా తెలిసిపోతుంది. ఒక వేళ, కేంద్రం కనుక మండలి రద్దు నిర్ణయం వెంటనే, అంటే, రేపు ఫిబ్రవరి నుంచి మొదలు అయ్యే పార్లమెంట్ సమావేశంలో ఇది పెడితే, జగన్ కు, బీజేపీకి ఉన్న సంబంధం బయట పడుతుంది. లేదు, ఇప్పటికే ఉన్న రెండు రాష్ట్రాల శాసనమండలి రద్దు తీర్మానాల లాగా, ఏపి తీర్మానం కూడా పెండింగ్ లో పెట్టి, ఏడాది, రెండేళ్ళ తరువాత రద్దు పార్లమెంట్ లో పెడితే, అప్పుడు బీజేపీకి, జగన్ కు ఎలాంటి సంబంధాలు లేవు అని ప్రజలకు అర్ధం అవుతుంది. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ అన్ని విషయాలు లాగా తప్పించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళ వైఖరితో, బీజేపీ ఎటు వైపు అనేది ఏపి ప్రజలకు అర్ధమై పోతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read