జగన్ ఢిల్లీ టూర్ నిరుపయోగమేనా ? మండలి రద్దు కోరుతూ, ప్రధాని, హోం మంత్రిని కలిసినా ఉపయోగం లేదా ? మరో ఏడాది వైట్ చెయ్యాల్సిందేనా ? అవును అనే సమాధానం వస్తుంది. రాష్ట్ర శాసనమండలి రద్దుతీర్మానం బీజేపీలో జాతీయస్థాయి చర్చకు దారితీసింది. దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా శాసన మండలిపై ఆయా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటు న్నాయి. శాసనమండలి ఏర్పాటు కోరుతూ కేంద్ర ప్రభు త్వం ముందు ప్రస్తుతం 11 రాష్ట్రాలకు చెందిన ప్రతిపాదనలున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ నుంచి శాసనమండలి రద్దు తీర్మా నం కేంద్రం ముందుకు వెళ్లింది. శాసన మండలి విషయంలో ఒక విధాన నిర్ణయం తీసుకోవాలని బీజేపీ అగ్రనాయ కత్వం సీరియస్ గా యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దీర్ఘకాలంగా అపరిష్కృ తంగా వున్న ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే శాసనమండలి ఏర్పాటు లేదా రకు సంబంధించి జాతీయ స్థాయిలో ఒకే విధానం ఉండేలా కస రత్తు ప్రారంభించిందని ఉన్నతస్థాయి బీజేపీ ప్రముఖుడు ఒకరు మీడియాకు చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్త చర్చకు దారి తీసిందని చెప్పవచ్చు.

దేశంలో ప్రస్తుతం ఆరు రాష్ట్రాల లో శాసనమండలి ఉంది. మరో 11 రాష్ట్రాలు కావాలని కోరుకుంటున్నాయి. ఒక రాష్ట్రం నుంచి శాసనమండలి రద్దు ప్రతిపాదన తాజాగా కేంద్రం ముందుకు వెళ్లింది. మిగిలిన రాష్ట్రాలలో ఇందుకు సంబంధించి ఏ విధమైన ప్రస్తావన లేదా ప్రతిపాదనలు లేవు. ఈ నేపధ్యంలోనే రాష్ట్రాలలో శాసన మండలి ఉండాలా? వద్దా? అనే విషయమై జాతీయస్థాయి లో అధ్యయనం చేసేందుకు ఒక కేటినెట్ సబ్ కమిటీని నియ మించాలని బీజేపీలో పలువురు సీనియర్లు ప్రతిపాదిస్తు అన్నట్టు సమాచారం. కేబినెట్ సబ్ కమిటీ అన్ని రాష్ట్రాలలో సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం జరపటంతో పాటు శాసనమండలి ఆవశ్యకత ఉందా ? దాని నుంచి ప్రజలు ఏమి ఆశిస్తున్నారు ?

ఇలాంటి అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ఏడాదిలోగా నివేదిక రూపొందించటం, అనంతరం మేధా వులు, రాజ్యాంగ నిపుణులు, వివిధ రాజకీ య పార్టీల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకోవటం వంటి ప్రతిపాదనలు కేంద్రానికి పలువురు సీనియర్ బీజేపీ నాయకులు ప్రతిపాదించినట్టు చెబుతున్నారు. ఏదైనా రాష్ట్రంలో శాసనమండలి ఏర్పాటు, లేదా తీసివేయటం అనేది ఆయా రాష్ట్రాల విచక్షణపై ఆధారపడకుండా ఒక చట్టబద్ధమైన విధానాన్ని రూపొందించాలనేది బీజేపీ యోచనగా ఉన్నది. శాసనమండలి విషయంలో రాజకీయ అవసరాలు, ప్రాధాన్యతలు ఉండ కూడదన్నది బీజేపీ సీనియర్ నేతల వాదన. ఈ విషయంలో విధాన నిర్ణయం తీసుకునే ముందు పార్టీలో విస్తృతంగా చర్చ జరపాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read