తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఈ నెల 17న జరిగిన ఉప ఎన్నిక ఫలితాలను నిలుపుదల చేయాలని కోరుతూ బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి రత్నప్రభ హైకోర్టును ఆశ్రయించారు. ఉప ఎన్నిక ఫలితాలను ప్రకటించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని మంగళవారం దాఖలు చేసిన పిటిషన్లో న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఎన్నికలో అక్ర మాలపై విచారణ జరపాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషను అందజేసిన వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకునేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఫిర్యాదులపై విచారణ జరిపి నివేదిక ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తిరుపతి ఉప ఎన్నిక స్వేచ్చగా, నిష్పాక్షిక వాతావరణంలో జరగలేదని, అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని పిటిషన్లో వివరించారు. ప్రజాస్వా మ్యయుతంగా జరగాల్సిన ఎన్నిక అందుకు విరుద్ధంగా జరిగిందని, అనేక చోట్ల అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో నకిలీ ఓట్లు వేయడం, బూత్ క్యాప్పు రింగ్ కు పాల్పడటం వంటివి చేశారని వివరిం చారు. అధికార పార్టీ నేతల చర్యలపై ఎన్నికల కమిషన్‌ కూడా ఏమీ చేయలేకమౌనంగా చూస్తూ ఉండిపోయిందన్నారు. ఇతర ప్రాంతాలకు చెంది న వారు నకిలీ ఓటర్ కార్డులతో పెద్ద సంఖ్యలో వచ్చారని, వారిని గుర్తిం చిన ఎన్నికల సిబ్బంది, ఏజెంట్లు ప్రశ్నిస్తే జవాబి వ్వకుండా వెనక్కు మళ్లారని వివరించారు.

hc 21042021 2

చెకపోస్టుల ద్వారా ఇతర ప్రాంతాల వాళ్లు పెద్ద సంఖ్యలో ప్రవేశించ కుండా చూడాల్సిన రాష్ట్ర ప్ర భుత్వ యంత్రాంగం అవేమీ చేయలేదని ఆరోపించారు. ఈ అంశాలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాసినా చర్యలు తీసుకోవడంలో విఫల మైందని స్పష్టం చేశారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ ముఖ్య కార్యదర్శి, ఎన్నికలో పోటీ చేసిన అభ్యర్థులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం బుధవారం విచారించే అవకాశం ఉంది.అయితే ఇదే అంశం పై తెలుగుదేశం పార్టీ కూడా, హైకోర్టులో కేసు దాఖలు చేసే పనిలో ఉంది. అంతకంటే ముందు, ఎలక్షన్ కమిషన్ కి మొత్తం వివరాలు ఇచ్చారు. టిడిపి ఎంపీలు వెళ్లి ఫిర్యాదు చేసారు. చంద్రబాబు స్వయంగా 22 పేజీల లేఖ రాసారు. అలాగే దానికి సంబంధించి మొత్తం ఆధారాలు కూడా సమర్పించారు. ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో, తెలుగుదేశం పార్టీ కూడా, హైకోర్టులో కేసు వేయనుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read