స్వాతంత్ర్య సమరయోధులు అంటే సమాజంలో వారికి ఎంతో గౌరవం ఉంటుంది. మన దేశ స్వాతంత్రం కోసం, ఎన్నో త్యాగాలు చేసారు వారు. ఆ తరం వారు, వయసు పైబడి, ఇప్పుడు చాలా కొద్ది మంది మన సమాజంలో ఉన్నారు. అలాంటి వారికి ప్రభుత్వాలు కూడా ఎన్నో కార్యక్రమాలతో వారికి చేయుతనిస్తూ వస్తున్నాయి. దేశం కోసం ఇలాంటి త్యాగం చేసిన కుటుంబం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉంది. 92 ఏళ్ళ అడుసుమిల్లి వెణుగోపాలరావు గారు, ఆయన సతీమణి హనుమతరత్నం, ఇక్కడ నివాసం ఉంటున్నారు. వృద్ధాప్యంలో వెణుగోపాలరావు గారి సతీమణికి ఆరోగ్యం దెబ్బతింది.

bonda 19092018 2

హనుమతరత్నం గారు ఎంతో కాలంగా మంచంలోనే వుంటున్నారు., శస్త్రచికిత్సతో నయమవుతుందిని వైద్యులు చెప్పట్టంతో, దాచుకున్న డబ్బులతో 3లక్షల రూపాయలతో వైద్యం చెయించారు. ఉన్న డబ్బులు అయిపోవడంతో దిక్కుతోచని స్థితిలో సహాయం కోసం ప్రధానమంత్రి గారి లేఖ రాసారు. మేము స్వాతంత్రం కోసం పోరాడాము, ఇప్పుడున్న పరిస్థితిలో మాకు అనుకోని ఇబ్బంది వచ్చింది, మా సతీమణి ఆపరేషన్ కి, మా దగ్గర ఉన్న డబ్బులు అయిపోయాయి, జీవిత చరమాంకంలో ఉన్న మమ్మల్ని, ఆదుకోండి అంటూ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గారికి ఉత్తరం రాసారు.

bonda 19092018 3

ప్రధాని కార్యాలయం కూడా స్పందించింది. కాని, కొన్ని నిబంధనలు అడ్డువస్తున్నాయి, మేము సహాయం చెయ్యలేము అని చెప్పింది. వెణుగోపాలరావు గారు, మళ్ళీ ప్రధాని కార్యాలయానికి ఉత్తరం రాస్తూ ఆ ఇబ్బంది ఏంటో అడిగారు. అక్కడ నుంచి వచ్చిన సమాధానం, మీ సతీమానికి ఆధర్ కార్డు లేని కారణంగా మేము సహాయం చెయ్యలేము అని. స్వతంత్రం కోసం పోరాడిన వారికి, ఆధర్ కార్డు లేదని, సహాయం చెయ్యలేము అని చెప్పింది ప్రధాని కార్యాలయం. ఇది ఇలా ఉండగానే, స్థానిక ఎమ్మల్యే బొండా ఉమా, తన దినచర్యలలో భాగంగా, నియోజకవర్గంలో ఇంటి ఇంటికి తిరగే కార్యక్రమంలో, వెణుగోపాలరావు గారు ఇంటికి చేరుకున్నారు.

bonda 19092018 4

ఈ సందర్భంలో, వెణుగోపాలరావు గారు ఆయన సతీమణి, వారికి వచ్చిన కష్టం చెప్పారు. దేశం కోసం పోరాడిన మాకు, ఆధర్ కార్డు లేదని, ప్రధాని కార్యాలయమే మాకు సహాయం చెయ్యలేము అని చెప్పిందని, ఇంకా మా బాధలు ఎవరు వింటారని, ఎమ్మల్యే బొండా ఉమా దగ్గర బాధ పడ్డారు. బొండా ఉమా, వెంటనే జరిగిన విషయం అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చెప్పారు. కేవలం ఆధార్ కార్డు లేదని, ఈ వయసులో వారిని కేంద్రం పట్టించులేదని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, వారి స్థితి విని చలించిపోయారు. దేశం కోసం పోరాడిన వారికి, కేవలం ఆధార్ లేదని వదిలేస్తామా అంటూ, బొండా ఉమా తీసుకున్న చొవరకి అభినందించి, వెంటనే వెణుగోపాలరావు గారికి, 3 లక్షల సహాయం చెయ్యమని సియఓ అధికారలుని ఆదేశించారు. నిన్న ఆ చెక్ అందటంతో, స్వయంగా ఎమ్మల్యే బొండా ఉమా వారి ఇంటికి వెళ్లి, ఆ చెక్ అందచేసి, దేశ స్వతంత్రం కోసం పోరాడిన మీకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వృద్ధ దంపతులు మాట్లాడుతూ ఎప్పుడో స్వతంత్రం వచ్చిన మా కాలంలో ప్రజానాయకులను వుండే వారు, ఇప్పుడు మరలా చంద్రబాబు గారు మిమ్మల్ని చూసాను అంటూ బొండా ఉమా గారికి ధన్యవాదాలు తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read