తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, ఈ రోజు తన అఫిషియల్ ఫేస్బుక్ పేజ్ లో పెట్టిన ఒక పోస్ట్, ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇదే జరిగితే, రాష్ట్ర రాజకీయాలను కుదిపే అంశం అవుతుంది. ఇది ఆయన పెట్టిన పోస్ట్. "బిగ్ బ్రేకింగ్ ఢిల్లీ..... జగన్ కు బెయిల్ రద్దు చేసే యోచనలో CBI...??? విజయ సాయి రెడ్డి లేవనెత్తిన విషయాన్ని సున్నితంగా తిరస్కరించిన కేంద్రం...!" అంటూ బొండా ఉమా పోస్ట్ చేసారు. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి, శుక్రవారం మినహయింపు పిటీషన్ పై, సిబిఐ ఇచ్చిన గట్టి కౌంటర్ చూసి, త్వరలోనే ఏదో జరగబోతుంది అంటూ, ప్రచారం జరుగుతుంది. సిబిఐ అంత స్ట్రాంగ్ గా కౌంటర్ ఇవ్వటం వెనుక, కేంద్ర హోం శాఖ ఉందని ప్రచారం కూడా జరిగిన సంగతి తెలిసిందే. శుక్రవారం కోర్ట్ కి రావాలని, అడిగినందుకే, ఇంత గట్టిగా సిబిఐ వాదించటం పై, చర్చ జరిగింది. ఆయన ఇప్పుడు సియంగా ఉన్నారని, సాక్షులని ప్రభావితం చేస్తారని సిబిఐ కోర్ట్ కు చెప్పటంతో, కోర్ట్ సిబిఐ వాదనతో ఏకీభవించింది.

bonda 17112019 2

అయితే, త్వరలొనే సిబిఐ బెయిల్ రద్దు పిటీషన్ కూడా వేస్తుందని, దీనికి సంబంధించి బలమైన ఆధారాలు కూడా సేకరించింది అంటూ, వార్తలు వస్తున్నాయి. అయితే, ఇవన్నీ రాజకీయ ఆరోపణలు అని, ఇప్పటికిప్పుడు జగన్ మోహన్ రెడ్డికి, ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ, వైసిపీ నేతలు అంటున్నారు. జగన్ ను ఎదుర్కోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, అంటున్నారు. ఈ ప్రచారం ఇలా కొనసాగుతూ ఉండగానే, ఈ రోజు బొండా ఉమా, ఢిల్లీ బిగ్ బ్రేకింగ్ అంటూ, జగన్ కు బెయిల్ రద్దు యోచనలో సిబిఐ ఉందని పోస్ట్ చేసారు. అయితే, ఇది రాజకీయంగా, ప్రచారం కోసం పెట్టిన పోస్టింగా, లేక నిజంగానే ఏదైనా జరుగుతుందా అనే చర్చ జరుగుతంది. సహజంగా బొండా ఉమా పేజ్ నుంచి ఇలాంటివి పోస్ట్ చెయ్యరు.

bonda 17112019 3

ఇవి ఎందుకు చేసారు ? బొండా ఉమాకు ఏమైనా సమాచారం ఉందా అనే విషయం పై చర్చ జరుగుతంది. మరో పక్క, నిన్న ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ లో, ఎక్కువ కాలంగా, సిబిఐ, ఈడీ కేసుల్లో బెయిల్ ఉన్న వారికి, రద్దు చెయ్యాలని కేంద్ర హోం శాఖ ఆదేశించినట్టు వార్త ప్రసారం చేసారు. బొండా ఉమా, ఆ వార్త ఆధారంగా, ఇలా పోస్ట్ చేసారా అనే చర్చ కూడా జరుగుతుంది. మరో పక్క, ఈ రోజు ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో, కాంగ్రెస్ పార్టీ చిదంబరానికి బెయిల్ ఇచ్చి, పార్లమెంట్ సమావేశాలకు హాజరు అయ్యేలా అవకాసం ఇవ్వాలని కోరిన సమయంలో, విజయసాయి రెడ్డి కల్పించుకుని, జగన్ కు ఆనాడు జరిగిన అన్యాయం అంటూ చెప్తుంటే, అమిత్ షా ఆ విషయం మీకు ఎందుకు, వాళ్ళు చెప్పారు, మేము నోట్ చేసుకున్నాం అని చెప్పినట్టు వార్తలు వచ్చాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read