ఏపీ ప్రభుత్వం ఒక్క నెలలోనే 6 నెలల అప్పు తీసుకుందని తన నివేదిక వెల్లడించిన కాగ్ - ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి నెలలోనే  రూ.19,717 కోట్లను రుణాల రూపంలో సమీకరించింది -ఏడాది మొత్తం మీద రూ.37,079 కోట్లు రుణంగా బడ్జెట్ లో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది.. ఇందులో 53.18 శాతం(6 నెలల అప్పు) ప్రభుత్వం తొలి నెలలోనే తీసుకుందన్న కాగ్ - గతేదాది 34.57 శాతం ఉందన్న కాగ్ - ప్రతినెలా ప్రభుత్వ లెక్కలను పరిశీలిస్తున్న కాగ్ - తాజాగా ఏపీలో ఏప్రిల్ నెల లెక్కలను వెల్లడించిన కాగ్ - ఏప్రిల్ నెలలో చేసిన అప్పులో ప్రజా రుణం కింద రూ.3,926.33 కోట్లు, ప్రజా పద్దుగా ఉన్న రూ.15,861 కోట్లు - ఇలా వచ్చిన మొత్తంలో రూ.73.47 కోట్లు నగదు నిల్వ ఉండటంతో మొత్తం రుణం రూ.19,714.04 కోట్లుగా లెక్క కట్టిన కాగ్ - పన్ను రాబడి రూ.7,738 కోట్లే - ఏప్రిల్‍లో పన్ను రాబడి మరీ తగ్గిపోయిందన్న కాగ్ - ఇందులో జీఎస్టీ రూ.2,866.44 కోట్లు - కేంద్ర సాయం రూ.3,630 కోట్లతో పాటు పన్నేతర ఆదాయం కలిపి రూ.11,616 కోట్లు  - ఏపీలో ఏప్రిల్ నెలలో రూ.31,311 కోట్ల ఖర్చు.. దీనిలో రాబడి రూపేణా వచ్చింది కేవలం 37 శాతం - అప్పులు, ఇతరత్రా రుణాల రూపంలో సమీకరించింది సుమారు 63 శాతం ఉందన్న కాగ్

Advertisements

Advertisements

Latest Articles

Most Read