తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై గుంటూరులో మరో కేసు నమోదు అయ్యింది. గుంటూరుకు చెందిన న్యాయవాది పచ్చల అనిల్ కుమార్ గుంటూరు అరండల్‌పేట పోలీసులు స్టేషన్ లో, చంద్రబాబుతో పాటు, కొంత మంది తెలుగుదేశం నేతల పైన కూడా ఆయన ఫిర్యాదు చేసారు. తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు, కొంత మంది టిడిపి నేతలు మీడియా సమావేశాల్లో పదే పదే  N440K వైరస్ ప్రమాదకరంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రజలను పదే పదే  చెప్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు, దీంతో ఇతర రాష్ట్రాలు కూడా మన ప్రజలను కట్టడి చేస్తున్నాయని, ఇదంతా చంద్రబాబు, టిడిపి నేతలు చేసిన తప్పుడు ప్రచారం అంటూ ఆయన ఫిర్యాదులో తెలిపారు. పచ్చల అనిల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు, కొద్ది సేపటి క్రితం కేసు కూడా నమోదు చేసారు. కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. 188, 505(1)b, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. ఇప్పటికే ఇదే అంశం పై, కర్నూల్ లో కేసు పెట్టించారు. ఇప్పుడు తాజాగా గుంటూరులో కూడా మరో కేసు పెట్టించారు. ఇప్పటికే కర్నూల్ పోలీసులు చంద్రబాబుకు నోటీసులు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా, ఎందుకో వెనక్కు తగ్గారు. ఇప్పుడు వ్యూహం మార్చి, గుంటూరులో ఎందుకు కేసు పెట్టించారో చూడాలి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read