ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారం, ఇటీవల, న్యాయ వ్యవస్థను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యల పై, హైకోర్టులో పిల్ దాఖలు అయ్యింది. అయితే ఈ పిటీషన్ వేసింది బీజేపీ కావటం గమనార్హం. మీడియాలో ఎక్కువగా కనిపించే, బీజేవైఏం అధ్యక్షుడు రమేష్ నాయుడు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు. వ్యవస్థల పై సామాన్యులకు విశ్వాసం సన్నగిల్లేలా స్పీకర్ మాట్లాడారని, రమేష్ నాయుడు అభ్యంతరం తెలిపారు. ఈ నెల రెండవ తేదీన , తిరుమలలో తమ్మినేని మాట్లాడిన అంశాలను కోర్టు దృష్టికి తెచ్చారు. పరిపాలనలో, పాలసీలలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని, ఇలాగైతే మేము ఎందుకు అంటూ తమ్మినేని మాట్లాడిన వ్యాఖ్యలను ఆక్షేపించారు. ప్రజాస్వామ్యంలో, మూడు స్థంబాలలలో ఒకటైన న్యాయ వ్యవస్థ పై రాజ్యాంగం స్పష్టంగా చెప్పిందని, వ్యవస్థల మధ్య, స్పష్టమైన విభజన రేఖ ఉందని, అలాగే చట్టాలు, వాటి అమలు తీరు విషయంలో, జోక్యం చేసుకునే అధికారం రాజ్యాంగమే, న్యాయ వ్యవస్థకు ఇచ్చిందని పేర్కొన్నారు.

శాసన, ఎక్జిక్యూటివ్ తీసుకునే నిర్ణయాలను, సమీక్షించే అధికారం కోర్టులకు ఉన్నాయని అన్నారు. సామాన్యుడికి న్యాయ వ్యవస్థ పై నమ్మకం ఉండేలా, ఆర్టికల్ 129, 215 ప్రకారం, తమ్మినేని సీతారం చేసిన వ్యాఖ్యల పై కోర్టు ధిక్కరణ కింద పరిగణించాలని అన్నారు. స్పీకర్ వ్యాఖ్యలు రాజ్యంగ స్పూర్తికి విరుద్ధంగా ఉన్నాయని, ప్రజలు అయినా, స్పీకర్ అయినా, చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే, అవి చక్కదిద్దే హక్కు, రాజ్యాంగం కోర్టులకు కట్టబెట్టిందని అన్నారు. స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలు ఒక దుష్ట సంప్రదాయానికి, నాంది పలికేలా ఉన్నాయి కాబట్టే, తాను కోర్టు వద్దకు రావాల్సి వచ్చిందని అన్నారు. అయితే బీజేపీ ఈ విషయంలో ఎంటర్ అవ్వటం పై, రాజకీయంగా ఆసక్తి రేపుతుంది. బీజేపీ ఏపిలో తన ఆట మొదలు పెట్టిందా అనే విషయం పై చర్చ జరుగుతుంది. 108 స్కాం బయట పెట్టిన దగ్గర నుంచి, బీజేపీ రోజు రోజుకీ వైసీపీ పై విమర్శల దాడి పెంచుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read