రాష్ట్రంలో క-రో-నా కట్టులు తెంచు కుంటోంది. ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ఈ రోజు అందిన సమాచారాన్ని అనుసరించి క-రో-నా పాజిటివ్ కేసులు ఏపిలో 1,322 ఒక్క రోజు వ్యవధిలో నమోదయ్యాయి. అమ్మో క-రో-నా అనే రీతిలో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యగా రోజుకో రికార్డు అన్నట్లుగా పెరిగిపోతుంది. ఇదే రీతిలో రాష్ట్రంలో క-రో-నా పాజిటివ్ మరణాలు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రం లో కరోనా ప్రభావంతో మృతి చెందిన వారి సంఖ్య మొత్తంగా 239 కి చేరుకుంది. ఈ రోజు ఉదయానికి రాష్ట్రంలో కొత్తగా స్థానికంగా ఉన్నవారిలోను, పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారితో కలిపి 1,322 మంది కొత్తగా పాజిటివ్ లక్షణాలు గుర్తించారు. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటినను అనుసరించి రాష్ట్రంలో ఇప్పటివరకు 20 వేల 19 మందిలో వైరస్ పాజిటివ్ కేసులు గుర్తించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,322 క-రో-నా పాజిటివ్ కేసులను గుర్తించారు.

వాటిలో రాష్ట్రంలో స్థానికంగా ఉండే వారిలో 1263 మందిలో పాజిటివ్ కేసులు గుర్తించారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 56 మందిలో, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒకరిలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 3 గుర్తించారు. రాష్ట్రంలో నివాసముంటున్న వారిలో కొత్తగా గుర్తించిన పాజిటివ్ కేసుల్లో అనంతపురంలో 142, చిత్తూరులో 120, తూర్పు గోదావరి జిల్లాలో 171, గుంటూరులో 197, కడపలో 96, కృష్ణాలో 55, కర్నూలులో 136, నెల్లూరులో 41, ప్రకాశంలో 38, శ్రీకాకుళంలో 36, విశాఖపట్టణంలో 101, విజయనగరంలో 24, పశ్చిమ గోదావరిలో 106 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని స్థానికుల్లో మొత్తంగా 17,365 మందిలో పాజిటివ్ కేసులు గుర్తించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read