బీజేపీ, టిడిపి నేతలకు షాక్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం. నెల్లూరు జిల్లాలో, మూడు రోజులు క్రిందట. అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్ర ఎంటర్ అయ్యింది. ఈ మూడు రోజుల నుంచి కూడా వారికి అనేక ఆంక్షలు పెడుతున్నారు నెల్లూరు పోలీసులు. మూడు రోజుల నుంచి కూడా నెల్లూరు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలికారు. హారతులు పడుతూ, కొబ్బరికాయలు కొడుతూ, పూలు జల్లుతూ, పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. మహా పాదయత్రకు నెల్లూరులో పెద్దగా రెస్పాన్స్ ఉండదులే అని ప్రభుత్వం భావించింది. అయితే ఎవరూ ఊహించని విశేష స్పందన లభించింది. అయితే ప్రధానంగా పోలీసులు, మరీ ముఖ్యంగా కావలి డీఎస్పీ వైఖరి మాత్రం, రైతులను, మహిళలను ఇబ్బంది పెట్టేల ఉందని విమర్శలు వస్తున్నాయి. డప్పులు కొట్టవద్దు అంటూ, పదే పదే పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రిందట ఏపి బీజేపీ నేతలు సుజనా చౌదరి, సియం రమేష్, పురందేస్వారి, కన్నా లక్ష్మీ నారాయణ, కామినేని శ్రీనివాస్ వీరందరూ వచ్చి అమరావతి రైతులకు మద్దతు తెలిపారు. అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు వెంకటరామారావు, రామకృష్ణలు కూడా అమరావతి రైతులకు మద్దతు తెలుపుతున్నారు.

bjp 24112021 2

ఈ రోజు వైసీపీ మినహా అన్ని పార్టీల వారు రైతులకు మద్దతు తెలుపుతున్నారు. ఒక్క వైసీపీ మాత్రమే రైతులకు మద్దతు ఇవ్వటం లేదు. అయితే కావాలి డీఎస్పీ అడ్డుకోవటమే కాకుండా, ఇప్పుడు ప్రభుత్వ ఒత్తిడితో కేసులు కూడా నమోదు చేస్తున్నారని అమరావతి జేఏసి ఆరోపిస్తుంది. ఇప్పటికే కావాలిలో మూడు కేసులు పెట్టినట్టు చెప్తున్నారు. తాజాగా బీజేపీ, టిడిపి నేతలకు కూడా షాక్ ఇచ్చారు. తెలుగుదేశం నేతలు బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు వెంకటరామారావు, రామకృష్ణతో పాటుగా, బీజేపీ నేతలు అయిన సుజనా చౌదరి, పురంధేశ్వరి, సీఎం రమేష్‌, కామినేనిలపై కేసులు పెట్టారు. అయితే వీరు మద్దతు తెలిపి వెంటనే వెళ్ళిపోయారు. మొత్తం 75 మంది పైన ఈ కేసులు నమోదు అయ్యాయి. ఇది ఇలా ఉంటే, కొంత మంది యాత్రలో పాల్గునని వారి పైన కూడా కేసులు పెట్టారని, బీజేపీ, టిడిపి చెప్తూ, అవాక్కయ్యారు. అయితే పోలీసులు మాత్రం, కేసులు పెట్టలేదని, ఎఫ్ఐఆర్ లు నమోదు చేసామని, హైకోర్ట్ కు మాత్రమే సమాచారం ఇచ్చామని చెప్తున్నారు. అయితే టిడిపి, బీజేపీ నేతలు మాత్రం, కావలి డీఎస్పీ పై మండి పడుతూ, ఇది కేవలం ప్రభుత్వ ఒత్తిడితో చేస్తున్న పనులని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read